అన్వేషించండి

ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఉగ్రసంస్థల పేరులో కూడా ఇండియా ఉంది - విపక్ష కూటమిపై ప్రదాని మోదీ ఘాటు వ్యాఖ్యలు

అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, కౌంటర్ ఎన్‌కౌంటర్ కామెంట్స్‌తో ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. పార్లమెంట్‌లోని రెండు సభలు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ రోజు కూడా ఉభయ సభల్లో (లోక్ సభ, రాజ్యసభ) గందరగోళం నెలకొంది. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇవాళ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తాము సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అధికార పక్షం ఎదురు దాడి చేసింది. ఇండియా పక్షాలను ఈస్ట్‌ఇండియా కంపెనీతో ప్రధాని మోదీ పోలుస్తూ విమర్శలు చేసారు.

అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, కౌంటర్ ఎన్‌కౌంటర్ కామెంట్స్‌తో ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. ఎన్డీఏ, ఇండియా రెండు పార్టీలు కూడా మణిపూర్‌ హింసాకాండను అడ్డుపెట్టుకొని ఒకరినొకరు దూషించుకుంటున్నారు. సభను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. 

విపక్షాల 'ఇండియా' పేరుపై రవిశంకర్ ప్రసాద్ విమర్శలు
బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ప్రతిపక్ష 'ఇండియా' కూటమిని ఇండియన్ ముజాహిదీన్‌తో పోల్చారు. 'ప్రధానిని చూసి గర్విస్తున్నాం. నేడు ఇండియన్ ముజాహిదీన్ కూటమితో రాజకీయాలు చేస్తున్నారు. 2024లో తాము అధికారంలోకి రాలేమని ప్రతిపక్షాలు అంగీకరించాయి.

ప్రభుత్వం చర్చకు సిద్ధమైతే వాయిదా తీర్మానాలు దేనికి? 
మణిపూర్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే వాయిదా తీర్మానం పెట్టి ఏం లాభం అని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ప్రశ్నించారు. అదే సమయంలో రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా చర్చించాలని ఎంపీ పీయూష్ గోయల్ అన్నారు. 

ఇండియన్‌ ముజాహిదీన్‌', 'పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాలో కూడా ఇండియా ఉంది: మోదీ

విపక్షాలు పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరుచుకుపడ్డారు. ప్రధాని 'ఇండియా' కూటమిని బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ, PFI వంటి తీవ్రవాద సంస్థలతో పోల్చారు. నిరసన తెలపడమే ప్రతిపక్షాల పని అని, తమ పార్టీ నేతలు పనిపై దృష్టి పెట్టాలని కోరారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని.. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"...బ్రిటిషర్లు వచ్చి తమకు ఈస్టిండియా కంపెనీ అని పేరు పెట్టుకున్నట్లే, విపక్షం కూడా ఇండియా పేరుతో తమను తాము ప్రదర్శిస్తోంది," అని ప్రధాని ప్రతిపక్షాలను హేళన చేస్తూ అన్నారు. 'ఇండియన్‌ ముజాహిదీన్‌', 'పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)' వంటి తీవ్రవాద సంస్థల్లో కూడా 'ఇండియా' ఉందని ప్రధాని తీవ్ర స్థాయిలో దాడి చేశారు.

మణిపూర్ పై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న విపక్షాలు
మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాల నేతల పార్లమెంట్‌ సమావేసాలకు ముందు భేటీ అయ్యారు. మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలని ఉభయ సభల్లో డిమాండ్ చేస్తూనే ఉండాలని నిర్ణయించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతున్న టైంలోనే భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గదిలో సమావేశమయ్యారు.  సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

ప్రధాని స్పందించే వరకు ప్రతిష్టంభన కొనసాగుతుంది: సంజయ్ సింగ్
ప్రధాని స్పందించే వరకు ప్రతిష్టంభన కొనసాగుతుందని, ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉంటుందని పార్లమెంట్ హౌస్ ఆవరణలో బైఠాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తనను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణంలో కూర్చొని నిరసన చేపట్టారు. సంజయ్ సింగ్ సస్పెన్షన్ పై రాజ్యసభ ఎంపీ జేబీ మాథేర్ మాట్లాడుతూ.. సంజయ్ సింగ్ ఒక్కరే కాదు, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. మా ఎంపీల్లో ఒకరిని సస్పెండ్ చేయడం ద్వారా బెదిరించవచ్చని అధికార ప్రభుత్వం భావిస్తే... ఇంకా గట్టిగా డిమాండ్ చేస్తాం. ప్రధాని పార్లమెంటుకు వచ్చి మణిపూర్ పై ప్రకటన చేయాలి, ఆ తర్వాత సమగ్రంగా చర్చించాలన్నారు.

ప్రధాని 'బేటీ బచావో' నినాదం ఏమైంది?
మణిపూర్ హింసాకాండపై ప్రధాని సమాధానం చెప్పాలన్నదే తమ డిమాండ్ అన్నారు విపక్ష ఎంపీలు. సోమవారం నుంచి గాంధీ విగ్రహం వద్దే కూర్చొని ఉన్న ఎంపీలు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని గుర్తు చేసారు. పార్లమెంటులో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. 'బేటీ బచావో' అనే ప్రధాని నినాదం ఏమైందని ప్రశ్నించారు. 

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget