అన్వేషించండి

MPs Suspension: లోక్‌సభలో బీభత్సం సృష్టించిన 10 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. అయినా వెనక్కి తగ్గని ప్రతిపక్షం

పెగాసస్ దుమారం పార్లమెంట్ రెండు సభలను ఇంకా కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ వెనక్కితగ్గకపోవడంతో ఎలాంటి చర్చల్లేకుండానే సభలు రోజూ వాయిదా పడుతున్నాయి.

విపక్ష పార్టీల ఎంపీలు అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో తాము కోరిన అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. పెగాసస్‌తో ఫోన్‌ హ్యాకింగ్‌, సాగు చట్టాలు రద్దు చేయడం లాంటి అంశాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో పార్లమెంట్ సమావేశాలలో గందరగోళం నెలకొంది.  కాంగ్రెస్ సహా ఇతర విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 

లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్ ఓం బిర్లా ఛైర్‌పైకి, ట్రెజరీ బెంచ్‌పైకి విసిరారు. దీంతో మరోసారి సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు అప్పటికే రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. అయితే  విపక్ష ఎంపీలు కాగితాలు చింపి విసిరి వేయడంపై స్పీక‌ర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగితాలు విసిరిన ప‌ది మంది ఎంపీల‌పై వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 

గౌరవప్రదమైన స్పీకర్ స్థానం ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు 374(2) రూల్ ప్ర‌కారం ప‌ది మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్ర‌తాప‌న్‌,హిబీ ఎడెన్, గుర్జీత్ సింగ్ ఔజిలా, మాణికం ఠాగూర్‌, డీన్ కురియ‌కోజ్‌,  జ్యోయిమణి, ర‌వ‌నీత్ బిట్టు, వి వైద్యలింగం, స‌ప్త‌గిరి శంక‌ర్‌, ఏఎం ఆరిఫ్‌, దీప‌క్ బైజ్‌ ఉన్నారు.  భవిష్యత్తులోనూ ఎవరైనా స‌భ్యులు ఇదే తీరుగా స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా ప్ర‌వ‌ర్తిస్తే.. ఈ లోక్‌స‌భ ముగిసేవరకు బహిష్కరించున్నట్లు ఎంపీలను హెచ్చరించారు.

కాగా, నేటి ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి పెగాసస్ వివాదం, సాగు చట్టాల రద్దు అంశంపై ప్లకార్డులతో నినాదాలు చేశారు.  స్పీకర్ మాత్రం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించగా, విపక్ష సభ్యులు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కొందరు పేపర్లు చించివేసి స్పీకర్ ఛైర్, ట్రెజరీ బెంచీలపైకి విసిరేయడంతో స్పీకర్ సభను 12.30 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 

పెద్దల సభ రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు నినాదాలు, నిరసనలతో సభ ఉదయం 12 గంటల వరకు వాయిదా పడింది. విరామం తరువాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు. పెగాసస్ ఫోన్ ట్యాపింగ్, సాగు చట్టాల రద్దుపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబడుతూ నినాదాలు చేశారు.

కాగా,  కేంద్రమంత్రి నుంచి పత్రాలు లాక్కొని, చించివేసి అమర్యాదగా ప్రవర్తించిన టీఎంసీ ఎంపీ శంతను సేన్‌పై ఇటీవల వేటు పడింది. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు రాజ్యసభ సభ్యుడు శంతను సేన్‌ను హాజరుకాకుండా సస్పెండ్‌ చేయడం తెలిసిందే.

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget