అన్వేషించండి

MPs Suspension: లోక్‌సభలో బీభత్సం సృష్టించిన 10 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. అయినా వెనక్కి తగ్గని ప్రతిపక్షం

పెగాసస్ దుమారం పార్లమెంట్ రెండు సభలను ఇంకా కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ వెనక్కితగ్గకపోవడంతో ఎలాంటి చర్చల్లేకుండానే సభలు రోజూ వాయిదా పడుతున్నాయి.

విపక్ష పార్టీల ఎంపీలు అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో తాము కోరిన అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో పార్లమెంట్‌ ఉభయసభలు దద్దరిల్లాయి. పెగాసస్‌తో ఫోన్‌ హ్యాకింగ్‌, సాగు చట్టాలు రద్దు చేయడం లాంటి అంశాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో పార్లమెంట్ సమావేశాలలో గందరగోళం నెలకొంది.  కాంగ్రెస్ సహా ఇతర విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 

లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్ ఓం బిర్లా ఛైర్‌పైకి, ట్రెజరీ బెంచ్‌పైకి విసిరారు. దీంతో మరోసారి సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు అప్పటికే రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. అయితే  విపక్ష ఎంపీలు కాగితాలు చింపి విసిరి వేయడంపై స్పీక‌ర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగితాలు విసిరిన ప‌ది మంది ఎంపీల‌పై వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. 

గౌరవప్రదమైన స్పీకర్ స్థానం ప‌ట్ల అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినందుకు 374(2) రూల్ ప్ర‌కారం ప‌ది మంది ఎంపీల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్ర‌తాప‌న్‌,హిబీ ఎడెన్, గుర్జీత్ సింగ్ ఔజిలా, మాణికం ఠాగూర్‌, డీన్ కురియ‌కోజ్‌,  జ్యోయిమణి, ర‌వ‌నీత్ బిట్టు, వి వైద్యలింగం, స‌ప్త‌గిరి శంక‌ర్‌, ఏఎం ఆరిఫ్‌, దీప‌క్ బైజ్‌ ఉన్నారు.  భవిష్యత్తులోనూ ఎవరైనా స‌భ్యులు ఇదే తీరుగా స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచేలా ప్ర‌వ‌ర్తిస్తే.. ఈ లోక్‌స‌భ ముగిసేవరకు బహిష్కరించున్నట్లు ఎంపీలను హెచ్చరించారు.

కాగా, నేటి ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి పెగాసస్ వివాదం, సాగు చట్టాల రద్దు అంశంపై ప్లకార్డులతో నినాదాలు చేశారు.  స్పీకర్ మాత్రం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించగా, విపక్ష సభ్యులు తమ నిరసనను మరింత ఉద్ధృతం చేశారు. కాంగ్రెస్ ఎంపీలు కొందరు పేపర్లు చించివేసి స్పీకర్ ఛైర్, ట్రెజరీ బెంచీలపైకి విసిరేయడంతో స్పీకర్ సభను 12.30 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. 

పెద్దల సభ రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు నినాదాలు, నిరసనలతో సభ ఉదయం 12 గంటల వరకు వాయిదా పడింది. విరామం తరువాత సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు. పెగాసస్ ఫోన్ ట్యాపింగ్, సాగు చట్టాల రద్దుపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబడుతూ నినాదాలు చేశారు.

కాగా,  కేంద్రమంత్రి నుంచి పత్రాలు లాక్కొని, చించివేసి అమర్యాదగా ప్రవర్తించిన టీఎంసీ ఎంపీ శంతను సేన్‌పై ఇటీవల వేటు పడింది. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు రాజ్యసభ సభ్యుడు శంతను సేన్‌ను హాజరుకాకుండా సస్పెండ్‌ చేయడం తెలిసిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget