అన్వేషించండి

India Air Strikes Pak: పాకిస్తాన్‌లోని ప్రతి ఎయిర్‌బేస్ కేంద్రాన్ని టార్గెట్ చేసే సత్తా మాకుంది: IAF ఏయిర్ మార్షల్

Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడి జరిగిన 96 గంటల్లోనే అరేబియా సముద్రంలో పరీక్షలు నిర్వహించినట్లు భారత నేవీ చీఫ్ తెలిపారు. పాక్ లోని ప్రతి కేంద్రాన్ని టార్గెట్ చేసే సత్తా ఉందన్నారు ఎయిర్ మార్షల్.

న్యూఢిల్లీ: నేవీ వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్ మాట్లాడుతూ, "పహల్గాం ఉగ్రదాడి జరిగిన 96 గంటల్లోనే అరేబియా సముద్రంలో మేం పరీక్షలు నిర్వహించాం. మా వ్యూహాలకు తగినట్లుగా టార్గెట్స్ ఛేదించడానికి గల ప్రయత్నాలలో భాగంగా కొన్నింటిని పరీక్షించి, కొన్ని మెరుగుపరిచాం. టార్గెట్స్‌పై ఆయుధాలను కచ్చితంగా ప్రయోగించడానికి పరీక్షించి, సిద్ధంగా ఉన్నాం. ఆ తరువాత, మా దళాలు ఉత్తర అరేబియా సముద్రంలో నిర్ణయాత్మకంగా ముందుకు సాగాయి. కరాచీతో సహా ఉపరితలంపై ఎంపిక చేసిన లక్ష్యాలను అనుకున్న సమయంలో ఛేదించడానికి పూర్తి సామర్థ్యంతో నేవీ సిద్ధంగా ఉంది. మనం అటాకింగ్ మోడ్‌లో ఉండటం వల్ల పాకిస్తాన్ నావికాదళం, పాక్ ఎయిర్‌ఫోర్స్ డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లాయని" తెలిపారు.

పాక్ దాడులను ఈజీగా తిప్పికొట్టాం, ఏ నష్టం జరగలేదు

పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భారత వైమానిక కేంద్రాలకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని, వారి దాడులను తిప్పికొట్టడంతో పాటు లాహోర్, గుజ్రావాలాలోని పాక్ రాడార్ సిస్టమ్స్ పై దాడి చేశామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పాకిస్తాన్ ప్రయోగించిన కొన్ని ఫైటర్ జెట్స్‌ను భారత ఆర్మీ కూల్చివేసినట్లు వెల్లడించారు. మేం కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపితే, పాక్ మాత్రం అమాయక పౌరులపై దాడులు చేసి వికృత బుద్ధిని మరోసారి బయటపెట్టిందన్నారు.

ఆపరేషన్ సిందూర్, అనంతరం జరిగిన పాక్ దాడులు, వాటిని తిప్పికొట్టడంపై డీజీఎం, త్రివిధ దళాధిపతులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. "DGMO చెప్పినట్లుగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌కు ప్లాన్ చేశాం. మొత్తం తొమ్మిది లక్ష్యాలలో, భారత వైమానిక దళానికి బహవల్పూర్, మురిడ్కేలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను కేటాయించారు. ఈ 2 పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. బాగా క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత సమర్థవంతంగా దాడులు చేశాం. గగనతనం నుంచి భూ ఉపరితలం పైకి మందుగుండుతో దాడి చేసి టార్గెట్స్ ఛేదించాం. 

పాకిస్తాన్ దాడుల్లో భారత వైమానిక స్థావరాలకు నష్టం జరగలేదు
ఆపరేషన్ సిందూర్ తరువాత మే 8వ తేదీ రాత్రి 22:30 గంటల నుండి 9న సైతం పలు భారత నగరాల్లో డ్రోన్లు, మానవరహిత వైమానిక దాడులు చేసింది పాక్. అటు శ్రీనగర్ నుండి నలియా వరకు మేం సిద్ధంగా ఉన్నాం. దాంతో శత్రువులు నిర్దేశించిన టార్గెట్స్‌కు ఎటువంటి నష్టం జరగకుండా వారి దాడులను తిప్పికొట్టాం. భారత బలగాలు మరోసారి సైనిక స్థావరాలు, లాహోర్,  గుజ్రాన్‌వాలాలోని రాడార్ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేశాం. లాహోర్‌కు దగ్గరగా డ్రోన్ దాడులు మొదలుపెట్టగా.. శత్రువు పౌక్ వారి పౌర విమానాలను లాహోర్ నుండి ఫ్లైయింగ్ కు అనుమతించారు. దాంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి టార్గెట్ ఫినిష్ చేశామని ఎయిర్ మార్షల్ ఎకె భారతి చెప్పారు.

నిరంతరం సమీక్షలు, ఏర్పాట్లతో తిప్పికొట్టిన బలగాలు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ఉగ్రస్థావరాలను నాశనం చేయగా.. పాక్ ఆర్మీ శ్రీనగర్ నుండి నల్య వరకు డ్రోన్లు, యూఏవీలు, ఫైటర్ జెట్స్ తో దాడులకు యత్నించింది. మేం ముందుగానే ఎదురుదాడికి సిద్ధమైన కారణంగా పాక్ కుయుక్తులు చెల్లలేదు. వారి దాడికి ప్రతిదాడి చేసి, పాక్ లోని కొన్నిచోట్లకు వెళ్లి దాడులతో సత్తా చాటాం. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget