అన్వేషించండి

Viral News: రైలు సిగ్నల్‌కు బురద పూసి దోపిడీ! ఈ దొంగల స్కెచ్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Train Robbery Attempt: ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో రైలు సిగ్నల్‌ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు.

Laksar Railway Station: దొంగతనాలు పలు రకాలు. దొంగలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఇంటి యజమానులు ఊర్లకు వెళ్లినప్పుడు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి ఇంట్లో వస్తువులు స్వాహా చేసేవారు కొందరు. రాత్రి వేళ ఆరుబయట నిద్రిస్తుంటే గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లను గుళ్ల చేసేవారు మరికొందరు. ఒంటరిగా ఉండే వారే లక్ష్యంగా ఇళ్లను దోపిడీ చేసే వారు ఇంకొందరు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు ఇలా ప్రతి చోట దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇలా నిత్యం ఎంతో మంది జేబుకు కత్తెర వేస్తూనే ఉంటారు. 

వీటితో పాటు రైళ్లలో జరిగే దొంగతనాలు ఇంకో రకం. రన్నింగ్ ట్రైన్‌లో డోర్ దగ్గరో, కిటికీ దగ్గరో ఉన్న వారి ఫోన్లు లాక్కెళ్తుంటారు. ఇటీవల రన్నింగ్‌ ట్రైన్లలో ఫోన్ల చోరీకి యత్నించి దొంగలు దొరికిపోయిన ఘటనలు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాగే మరికొందరు ఏకంగా దర్జాగా బోగిల్లో ప్రయాణికుల్లా ఫోజ్ కొడుతూ..  అందరూ పడుకున్నాక చేతికి పని చెబుతారు. ప్రయాణికుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, ఇతర విలువైన వస్తువులు కాజేస్తారు. ఇంకొందరు దొంగలు ఏకంగా రైళ్లను ఆపేసి ప్రయాణికులను దోచుకుంటారు. నిర్మానుష్య ప్రదేశాలు, కొండల మధ్యలో రైళ్లు వెళ్తున్నప్పుడు రైళ్లను ఆపివేసి ప్రయాణికులను భయపెట్టి వారి వద్ద ఉన్న వస్తువులను మొత్తం దోచేస్తారు. ఇలాంటి దొంగతనాలు ఇటీవల పెరిగిపోయాయి. ఏపీలో కడప, యర్రగుంట్ల మధ్య రైళ్లలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి.

ఉత్తరాఖండ్‌లో సిగ్నల్ లైట్లకు బురద మట్టి పూసి..
ఇప్పుడు ఈ దొంగల గోల మాకెందుకు అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్‌లో జరిగిన చోరీ గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా రైళ్ల దోపిడీకి భిన్నంగా సరికొత్తగా దోపిడీకి యత్నించారు. ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో రైలు సిగ్నల్‌ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. మొరాదాబాద్‌ - సహారన్‌పుర్‌ రైల్వే డివిజన్‌లోని లక్సర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైళ్ల దోపిడీకి దొంగలు స్కెచ్ వేశారు. ప్లాన్‌లో భాగంగా రైలు సిగ్నల్‌కు దుండగులు బురద పూసి సిగ్నల్‌ కనిపించకుండా చేశారు. ఆ మార్గంలో వస్తున్న  పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పుర్‌- చండీగఢ్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సిగ్నల్ కనిపించకపోవడంతో నిలిచిపోయాయి.

అదే అదునుగా దుండగులు రైళ్లలోకి చొరబడ్డారు. ప్రయాణికుల వస్తువులు, నగదును దోపీడీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. బంగారం, డబ్బు, వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. అయితే దొంగలకు ప్రయాణికులు ఊహించని షాక్ ఇచ్చారు. రైళ్లలోని వారంతా ఒక్కసారిగా ఎదురు తిరగడంతో దొంగలు తోక ముడిచారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనతో అప్రమత్తమైన లోకో పైలట్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లక్సర్‌ ఆర్పీఎఫ్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి శివాచ్, జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ సంజయ్‌ శర్మ, జీఆర్పీ ఎస్పీ సరితా డోభాల్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులను ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రయాణికుల ధైర్యాన్ని అధికారులు మెచ్చుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
Kiran Royal: వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు -  పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
Embed widget