అన్వేషించండి

Meta India : కేంద్ర మంత్రికి క్షమాపణలు చెప్పిన మెటా ఇండియా.. ఎందుకంటే ?

Ashwini Vaishnaw :సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మాతృ సంస్థ మెటా బుధవారం పాడ్‌కాస్ట్ సందర్భంగా భారతదేశ ఎన్నికలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది.

Mark Zuckerberg:సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మాతృ సంస్థ మెటా బుధవారం పాడ్‌కాస్ట్ సందర్భంగా భారతదేశ ఎన్నికలపై ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేయాలని యోచించనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో మెటా సీఈఓ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం​. కరోనా మహమ్మారిని నిర్వహించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని జుకర్‌బర్గ్‌ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో నోరు జారారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం 2024 ఎన్నికల్లో విజయం సాధించబోదని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ అంశంపై అప్పట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. మార్క్‌ జూకర్‌బర్గ్‌ మాటలు తప్పని రుజువైందన్నారు. ప్రజలు తమ పార్టీకే స్పష్టమైన మెజార్జీ అందించారని తెలిపారు. జూకర్‌బర్గ్‌ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.మెటా ఇండియా దీనిని అనుకోకుండా జరిగిన పొరపాటు అని పేర్కొంది. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా క్షమాపణలు చెప్పి తన అభిప్రాయాలను వివరించారని పీటీఐ పేర్కొంది.

 

క్షమాపణలు చెప్పిన మెటా ఇండియా
మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటనకు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ ఎక్స్ లో చేసిన పోస్టులో ఇలా రాశారు.. ‘‘2024 ఎన్నికలలో అనేక అధికార పార్టీలు తిరిగి ఎన్నిక కావు అనే మార్క్ జుకర్‌బర్గ్ పరిశీలన చాలా దేశాలకు వర్తిస్తుంది కానీ భారతదేశానికి కాదు. ఈ అనుకోకుండా జరిగిన పొరపాటుకు మేము క్షమాపణలు కోరుతున్నాము. భారతదేశం మెటాకు చాలా ముఖ్యమైన దేశంగా మిగిలిపోయింది. దాని వినూత్న భవిష్యత్తుకు కేంద్రంగా ఉండాలని మేము ఎదురుచూస్తున్నాము.’’ అని అన్నారు.

Also Read :German Companies : అబద్ధాలు చెప్పి లీవ్ తీసుకుంటున్నారా? - అయితే మీకో అలర్ట్, వీరు మిమ్మల్ని పట్టిస్తారు!
అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విని వైష్ణవ్ 
భారత ప్రభుత్వం గురించి తప్పుడు వాదనలపై మార్క్ జుకర్‌బర్గ్‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రంగా విమర్శించారు. ఆయన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం నిరాశపరిచిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ 2024 ఎన్నికల్లో 64 కోట్లకు పైగా ఓటర్లు పాల్గొన్నారని కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏపై భారత ప్రజలు మరోసారి తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత 2024 ఎన్నికలలో భారతదేశంతో సహా చాలా అధికార ప్రభుత్వాలు ఓడిపోయాయనే జుకర్‌బర్గ్ వాదన తప్పని అశ్విని వైష్ణవ్ అన్నారు.


మెటా ఇండియా క్షమాపణపై నిషికాంత్ దూబే స్పందన
మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యకు మెటా ఇండియా క్షమాపణలు చెప్పడంపై.. ఇది భారత ప్రజల విజయమని బిజెపి ఎంపీ అన్నారు. మెటా చేసిన ఈ క్షమాపణ భారత పార్లమెంటు, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సమన్లు ​​జారీ చేయబడతాయని  ఐటీ పార్లమెంటరీ ప్యానెల్ అధిపతి నిషికాంత్ దూబే హెచ్చరించారు.

 

Also Read :Flying Cars : 2026 నాటికి ఎగిరే కార్లు సిద్ధం - వీటి ధరెంత? స్పెసిఫికేషన్స్ ఇవే..!

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget