అన్వేషించండి

Maoists Surrender Letter: కొత్త సంవత్సరంలో లొంగిపోతాం.. 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల మరో లేఖ

Maoists Surrender: జనవరి 1 న తాము తాత్కాలికంగా ఆయుధాలు వదిలేసి, జన జీవన స్రవంతిలో కలవాలనుకుంటున్నామని మావోయిస్టులు మరో లేఖను విడుదల చేశారు.

రాయ్‌పూర్: ఆయుధాలను వదిలేసేందుందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) డెడ్‌లైన్ ఫిక్స్ చేసుకుంది. ఎంఎంసి సహచరులందరూ జనవరి 1, 2026న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ప్రభుత్వాలకు ఆయుధాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ పునరావాసం కల్పిస్తే లొంగిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

మావోయిస్టు కమిటీ ప్రతినిధి లేఖలో పేర్కొన్న అంశాలివే..

‘అప్పటి వరకు, 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, భద్రతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని అభ్యర్థిస్తున్నాం. జోన్‌లో ఎక్కడా భద్రతా దళాలు అరెస్టులు లేదా ఎన్‌కౌంటర్‌లు వంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదు. జోన్ అంతటా చెల్లాచెదురుగా ఉన్న మా సహచరులందరితో సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేం ప్రయత్నిస్తాము. భద్రతా దళాల కార్యకలాపాలను కొనసాగించడం మాకు అంతరాయం కలిగిస్తుంది. మా ప్రయత్నాలను వేగవంతం చేయకుండా నిరోధిస్తుంది. మా ఆయుధాలను ముక్కలుగా అప్పగించే బదులు, ప్రభుత్వ పునరావాస ప్రణాళికను ఒకేసారి లేదా పెద్ద సంఖ్యలో అంగీకరించి జన జీవన స్రవంతిలో చేరాలనుకుంటున్నాం.


Maoists Surrender Letter: కొత్త సంవత్సరంలో లొంగిపోతాం.. 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల మరో లేఖ
ఛత్తీస్‌గఢ్‌లో సతీష్ దాదా, మహారాష్ట్రలో సోను దాదా విషయంలో జరిగినట్లుగా, మేం ఆయుధాలను అప్పగించి, 3 రాష్ట్రాలలో ఒక ముఖ్యమంత్రి లేదా హోం మంత్రి ముందు లొంగిపోతాం. మేం ఆయుధాలను అప్పగించి, వచ్చే నెలలో ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడంలో సపోర్ట్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధాన స్రవంతిలో చేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మొత్తం ప్రక్రియ శాంతియుతంగా పూర్తి కావడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తున్నాను. భద్రతా దళాలు ఆ తేదీ వరకు కార్యకలాపాలను నిలిపివేసి, ఎన్‌కౌంటర్‌ల వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉంటేనే ఇది సాధ్యం.

విజయ్ శర్మ (ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హోంమంత్రి) రేడియోలో మాట్లాడటం మేం విన్నాము. ఈ ప్రయోజనం కోసం 10 నుండి 15 రోజులు సరిపోతాయని అన్నారు. ఆయన ప్రతిస్పందనను మేం గౌరవిస్తాము, కానీ అంత తక్కువ సమయం సరిపోదు. ఆయుధాలను వదులుకుని ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావడానికి మేము నిర్ణయించిన ఖచ్చితమైన తేదీకి (జనవరి 1, 2026) ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు.

మా ప్రతిపాదనలు, డిమాండ్లు చేయాలనుకుంటే, ప్రభుత్వం వాటిని వింటుందని.. అందుకు ప్రయత్నాలు చేస్తుందని తన ప్రకటనలో పేర్కొన్నందుకు విజయ్ శర్మకు మా కృతజ్ఞతలు. ప్రభుత్వానికి కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు, డిమాండ్లను చెబుతాం. ప్రధాన స్రవంతిలో చేరడానికి ముందు లేదా పునరావాసం తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాలు చేర్చుతాము.

మిగిలిన రెండు రాష్ట్రాల (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్) ప్రభుత్వాల నుండి మా అభ్యర్థనపై విజయ్ శర్మ నుండి వచ్చిన ప్రతిస్పందనతో మాకు భరోసా రాలేదు. మిగిలిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చిడి భరోసా కలిగించే రెస్పాన్స్ కోసం చూస్తున్నాం. విజయ్ శర్మ లాగా, వారు మాకు ప్రతిపాదనలు, డిమాండ్లను అందిస్తే, ప్రజల తరపున మేం ఖచ్చితంగా అలాగే చేయాలనుకుంటున్నాము.

ఒంటరిగా వెళ్లి లొంగిపోవద్దు..

ఈ ప్రక్రియ అయ్యే వరకు జోన్ అంతటా ఉన్న మా సహచరులు తమ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలి. దానికి అంతరాయం కలిగించే ఎటువంటి ప్రేరణ లేదా చర్యలో పాల్గొనవద్దు. ఈసారి మేము PLGA వారోత్సవాన్ని పాటించబోం. ఈ వారంలో తన భద్రతా దళాల గస్తీని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము. జోన్ అంతటా ఉన్న అన్ని సహచరులకు మేం ఆడియో విజ్ఞప్తిని జారీ చేస్తాము. దీని గురించి విన్న లేదా తెలుసుకున్న వెంటనే ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించాలని కామ్రేడ్లను అభ్యర్థిస్తున్నాము. స్వయంగా వెళ్లి లొంగిపోవద్దని కూడా కామ్రేడ్లను అభ్యర్థిస్తున్నాము. మనమందరం దీన్ని కలిసి చేయాలి’ అని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో మావోయిస్టు ప్రతినిధి అనంత్ స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget