అన్వేషించండి

Biren Singh: మణిపుర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్ర దాడి - భద్రతా సిబ్బందికి గాయాలు

Manipur CM N Biren Singh: మణిపుర్ సీఎం కాన్వాయ్‌పై సోమవారం ఉదయం తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటన కాంగ్‌పోక్పి జిల్లాలో జరగ్గా.. భద్రతా సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి.

Manipur Chief Minister N Biren Singh Convoy Attacked: జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపుర్‌లో ఏకంగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ (Biren Singh) కాన్వాయ్‌పైనే దాడికి యత్నం జరిగింది. సోమవారం ఉదయం సీఎం కాన్వాయ్‌పై సాయుధులైన తీవ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో సీఎం భద్రతా సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల హింస చెలరేగిన జిరిబామ్‌ జిల్లాకు సీఎం మంగళవారం వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించేందుకు సెక్యూరిటీ సిబ్బంది వెళ్తుండగా ఆ కాన్వాయ్‌పై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే, ఈ దాడిని భద్రతా బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ ఘటన కాంగ్‌పోక్పీ జిల్లాలో జరిగింది.

ఇటీవల జిరిబామ్ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 70కిపైగా ఇళ్లను తగులబెట్టడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఈ క్రమంలో కొందరు పౌరులు వేరే చోటుకి పారిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల టైంలో లైసెన్స్ తుపాకులను పోలీసులు జప్తు చేయడంతో వీటిని తిరిగి ఇవ్వాలని స్థానికులు జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో అశాంతి నెలకొనగా.. సీఎం బీరెన్ సింగ్ అక్కడ సందర్శించాలని అనుకున్నారు. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ సిబ్బంది వెళ్తున్న క్రమంలో మిలిటెంట్లు ఆ కాన్వాయ్‌పై ఆకస్మికంగా దాడి చేశారు.

దాడిని ఖండించిన సీఎం

కాన్వాయ్‌పై దాడిని సీఎం బీరెన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది నేరుగా ముఖ్యమంత్రిపై అంటే ప్రజలపై దాడిగా అభివర్ణించారు. దాడి ఘటనపై విచారణ జరిపించి కఠిన చర్యలు చేపడతామని అన్నారు.

Also Read: PM Modi: ప్రధాని మోదీ 3.0 ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అనూహ్య ఘటన - జంతువు సంచారం, వీడియో వైరల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Lakshmi Manchu: చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
చ‌ర‌ణ్‌, రానా, అల్లు అర్జున్, ప్ర‌భాస్.. 140 మందితో వాట్సాప్ గ్రూప్ దాంట్లో ఏం మాట్లాడుకుంటామంటే? - మంచుల‌క్ష్మీ
Embed widget