News
News
వీడియోలు ఆటలు
X

Temple Accident: గుడిపై పడ్డ చింతచెట్టు, ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి - 20 మందికి గాయాలు

అకోలా జిల్లాలోని బాలాపూర్ తాలూకాలోని పరాస్‌లో నిన్న (ఆదివారం) సాయంత్రం భారీ గాలులు సంభవించాయి. ఈ గాలులకు చెట్టు కూలింది.

FOLLOW US: 
Share:

Akola Temple Accident: మహారాష్ట్ర అకోలా జిల్లాలోని పరాస్ గ్రామంలో ఒక దేవాలయంపై చింత చెట్టు కూలడంతో 7 మంది మృతి చెందగా, 20 నుంచి 25 మంది గాయపడ్డారు. బాబూజీ మహారాజ్ ఆలయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆలయంలో 50 నుంచి 60 మంది భక్తులు ఉన్నారు. ఈదురు గాలులతో వర్షం మొదలవుతుండగా, ఆ గాలికి పెద్ద నిమ్మచెట్టు షెడ్డు మీద పడింది. రాత్రంతా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగం, గ్రామస్తులు వీలైనంత వేగంగా సహాయక చర్యలు ప్రారంభించారు.

అకోలా జిల్లాలోని బాలాపూర్ తాలూకాలోని పరాస్‌లో నిన్న (ఆదివారం) సాయంత్రం భారీ గాలులు సంభవించాయి. గ్రామంలోని బాబూజీ మహారాజ్ ఆలయానికి ఆదివారం నాడు చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఆలయంలో హారతి నిర్వహించారు. హారతి అనంతరం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో బయట భక్తులు ఆలయంలోని ఓ రేకుల షెడ్డు కింద తలదాచుకున్నారు. సరిగ్గా ఈ సమయంలో గాలి వీచడంతో గుడి ముందున్న నిమ్మచెట్టు షెడ్డుపై పడింది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారుల బృందం సహాయక చర్యల కోసం సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో పాటు శిథిలాలను తొలగించేందుకు జేసీబీ, అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే బలమైన గాలులు, వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగించాయి. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున జనం 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఆలయ షెడ్డు కింద 50 నుంచి 60 మంది ఉన్నారు. ఈదురు గాలులు వీయడంతో కొంత మంది ఆలయం లోపలికి వెళ్లగా, 15 నుంచి 20 మంది ఆలయ షెడ్డులో ఉన్నారు. ఈదురు గాలులకు నిమ్మచెట్టు షెడ్డుపై పడిపోవడంతో షెడ్డు కూలిపోయింది. షెడ్డు కింద నిల్చున్న వ్యక్తులు షెడ్డు కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 7 మంది చనిపోయారు. రెస్క్యూ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది’’ అని తెలిపారు.

ప్రమాదంలో మృతుల బంధువులకు సాయం ప్రకటించాలని ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ ట్వీట్ చేశారు. అకోలాలోని పరాస్ జిల్లాలోని బాబూజీ మహారాజ్ ఆలయంలో ఆరతి సందర్భంగా టిన్ షెడ్డుపై చెట్టు కూలడంతో పలువురు భక్తులు గాయపడ్డారని, భక్తులు మృతి చెందారనే బాధాకరమైన వార్త విన్నామని, ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరణించిన వారి బంధువులకు తక్షణ సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 38 నుండి 40 డిగ్రీల వరకు

ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేడి కూడా పెరిగింది. చాలా దక్షిణాది రాష్ట్రాల్లో 38 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వాతావరణ శాఖ (IMD) ఇచ్చిన సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో విదర్భ మరఠ్వాడా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.

Published at : 10 Apr 2023 07:43 AM (IST) Tags: Akola news Maharastra news temple accident Akola temple accident

సంబంధిత కథనాలు

మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు - బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు

మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు - బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

RBI: రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?

RBI: రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?

Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

టాప్ స్టోరీస్

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!