అన్వేషించండి

Siddaramaiah: సిద్ధరామయ్య కీలక నిర్ణయం- రీజియన్ డెవలప్‌మెంట్‌ బోర్డులో అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం

Siddaramaiah: బీజేపీ ప్రభుత్వ హయాంలో కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డులో జరిగిన అవినీతి ఆరోపణలపై ప్రియాంక్ ఖర్గే ఫిర్యాదు మేరకు సిద్ధరామయ్య దర్యాప్తునకు ఆదేశించారు.

Siddaramaiah: కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు చేసింది. ఎన్నడూ లేని విధంగా కర్ణాటక సర్కారులోని పెద్దలు కుంభకోణాలకు పాల్పడ్డారని, కోట్లాది రూపాయల కన్నడ ప్రజల సంపదను దోచుకున్నారని కాంగ్రెస్ నాయకులు బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. 40 శాతం కమీషన్ ఇస్తే పనులు ఈజీగా జరుగుతాయని ఎన్నికల అస్త్రంగా వాడిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. వాళ్లు చెప్పినట్లుగానే కర్ణాటకలో బీజేపీ అవినీతి ఆరోపణలపై విచారణ చేయిస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారు. అందులో భాగంగానే తాజాగా కర్ణాటకలోకి కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 

బీజేపీ ప్రభుత్వ హయాంలో కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డు(KKRDB) అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చేసిన ఫిర్యాదు మేరకు సిద్ధరామయ్య దర్యాప్తుకు ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఖర్గే తెలిపారు. 

'కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్‌మెంట్ బోర్డు నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశించారు. బీజేపీ రహస్య అజెండాను నెరవేర్చడానికి అలాగే వారి సొంత ఎమ్మెల్యేల కోసం కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశారు. గతంలో హామీ ఇచ్చినట్లుగా, కేకేఆర్డీబీ పై సమగ్ర విచారణ జరిపి దోషులపై కేసులు నమోదు చేస్తాం' అని ప్రియాంక్ ఖర్గే తెలిపారు.

'కళ్యాణ కర్ణాటక(KKRDB)లోనే కాదు ఇంకా చాలా మోసాలు జరిగాయి. న్యాయం జరిగాలంటే అన్ని స్కామ్ లపై విచారణ జరగాలి' అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇంటిలిజెన్స్‌ విభాగమూ సిద్దరామయ్యకే కేటాయించారు. ఇక ముఖ్యమంత్రి రేసులో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించిన జి పరమేశ్వరకు మంచి పదవే కట్టబెట్టారు. హోం మంత్రి బాధ్యతలు అప్పగించారు. డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్‌కి భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖను కేటాయించారు. దీంతో పాటు బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్ బాధ్యతలూ ఇచ్చారు. హెచ్‌కే పాటిల్‌ లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాలు, దినేశ్ గుండు రావ్‌కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కృష్ణ బైరె గౌడకు రెవెన్యూ శాఖలు కేటాయించారు. కర్ణాటక ప్రభుత్వంలో మొత్తం 34 మంది మంత్రులు ఉంటారు. గత వారమే 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లిస్ట్‌ని ఫైనలైజ్ చేసే ముందు సిద్దరామయ్య, డీకే శివ కుమార్‌ హైకమాండ్‌తో విస్తృత చర్చలు జరిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget