అన్వేషించండి

బీజేపీతో కలిసేందుకు జేడీఎస్ ఆసక్తి, NDAలో చేరడంపై మాత్రం సస్పెన్స్

JDS With BJP: ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జేడీఎస్ ప్రకటించింది.

JDS With BJP:


కలిసి పని చేస్తాం: కుమారస్వామి

2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం మించిపోతోంది. అధికారంలో ఉన్న బీజేపీతో పాటు విపక్షాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే NDA కూటమి ఏర్పాటు కాగా...అదే రోజున విపక్షాలు కూడా కూటమి కట్టాయి. UPA అనే పేరు మార్చి INDIAగా ప్రకటించాయి. ప్రస్తుతానికి 38 పార్టీలు NDAలో ఉండగా...26 పార్టీలు INDIAకి మద్దతునిస్తున్నాయి. అయితే...కొన్ని పార్టీలు మాత్రం ఈ రెండు కూటములకూ దూరంగా ఉన్నాయి. అందులే కర్ణాటక JDS ఒకటి. ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల తరవాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది ఈ పార్టీ. కింగ్‌మేకర్ అవుతామని భావించినా...భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పటి నుంచి కుమారస్వామి పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆయనకు NDA నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం. కానీ...కుమారస్వామి మాత్రం ఈ విషయంలో ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకూ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని కుమారస్వామి...మొత్తానికి క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో కలిసి పని చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. అయితే...NDAలో చేరతారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. ఏ నిర్ణయమైనా తీసుకున్న తనకు ఏం పరవాలేదని కుమారస్వామితో ఆయన చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుమారస్వామి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మీడియా ప్రశ్నించినా "లోక్‌సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉందిగా" అని సమాధానమిస్తున్నారు. 

"నేను ఎప్పటి నుంచో ఒకే విషయం స్పష్టంగా చెబుతున్నాను. జేడీఎస్, బీజేపీ అసెంబ్లీ లోపల అయినా, బయట అయినా ప్రతిపక్షాలే. రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఒకవేళ కలిసి పని చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగానే ఉన్నాం. ఇప్పటికే మా ఎమ్మెల్యేలతో ఈ విషయమై చర్చించాను. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలలే మిగిలున్నాయి. అవి వచ్చినప్పుడు మిగతా నిర్ణయాల గురించి ఆలోచిస్తాం. దేవెగౌడ నాకే ఆ నిర్ణయాన్ని వదిలేశారు. ప్రస్తుతానికి మేం కాంగ్రెస్‌పై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాం. 10 మంది సభ్యులతో కూడిన కమిటీ కూడా ఏర్పాటు చేశాం"

- కుమారస్వామి, జేడీఎస్ నేత 

వచ్చే ఎన్నికల్లోనూ తామే అధికారం దక్కించుకునేందుకు బీజేపీ చాలానే కష్టపడుతోంది. ఇప్పటి నుంచి అందుకు సంబంధించిన కసరత్తులను కూడా చేస్తోంది. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, ఎన్నికల్లో గెలిచేందుకు ఏం ఏం చేయాలి వంటి వాటిపై చర్చించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈక్రమంలోనే ఎన్డీఏ ఎంపీలను మొత్తం పది బృందాలుగా విభజించారు. వీరిలో 35 నుంచి 40 మంది పార్లమెంటు సభ్యులు ఉంటారు. జులై 25వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పది బృందాలతో నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్రతీ రోజు 2 గ్రూపులతో ప్రధాని మోదీ భేటీ అయ్యేలా ప్లాన్ చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారికి విజయ సూత్రాలను అందించనున్నారని సమాచారం. విపక్షాలను ఎలా ఎదుర్కోవాలి, వారి సవాళ్లను ఎలా తిప్పికొట్టాలి వంటి అంశాలపై కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: రాజస్థాన్‌ అసెంబ్లీలో సొంత ప్రభుత్వంపైనే మంత్రి విమర్శలు, పదవి నుంచి తొలగించిన సీఎం

టాప్ హెడ్ లైన్స్

DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
Breaking News: ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
ఆరుగురిని చంపిన రాజ్‌కుమార్ ఆత్మహత్య- మృతదేహం రికవరీ చేసుకున్న పోలీసులు 
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seediri Appalaraju Son Arav Arrest: పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
పలాస హిట్ అండ్ రన్ కేసు - కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ లొంగుబాటు!
Shabad Mass Murder Accused Selfie Video: అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
అమ్మాయి కుటుంబం మోసం చేసింది - షాబాద్ సైకో కిల్లర్ రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Embed widget