అన్వేషించండి

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహల్ఘం వద్ద ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది.

జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్‌లోని చందన్‌వాడి సమీపంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 6 మంది ఐటీబీపీ సిబ్బంది మరణించగా, 37 మంది గాయపడినట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్రలో ఐటీబీపీ సిబ్బందిని మోహరించారు.

పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం
బస్సులో 39 మంది సైనికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐటీబీపీకి చెందిన 37 మంది సిబ్బంది, జమ్మూ కశ్మీర్ పోలీస్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి లోతట్టు ప్రాంతానికి దూసుకుపోయిందని, అలా లోయలో పడిపోయినట్లు సమాచారం. జవాన్లందరూ చందన్‌వాడి నుంచి పహల్గామ్ వైపు వెళ్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర డ్యూటీ నుంచి జవాన్లందరూ తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో జవాన్లు గాయపడే అవకాశం ఉంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

రాష్ట్రపతి సంతాపం

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) చనిపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అనంత్ నాగ్‌లో జరిగిన ఘటన తనను కలచివేసిందని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ద్రౌపది ముర్ము ప్రార్థించారు.

షానవాజ్ హుస్సేన్ సంతాపం
ఈ ఘటనపై బీహార్ మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని ఆయన ట్వీట్ చేశారు. అమర్‌నాథ్ యాత్రలో నిమగ్నమైన ఐటీబీపీ బస్సు పడిపోవడంతో పలువురు జవాన్లు వీరమరణం పొందడం, గాయపడిన వార్త తనకు చాలా బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం
ఈ ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చందన్‌వాడి దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర ITBP జవాన్లను కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.

మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం
అదే సమయంలో, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సైనికుల అమరవీరులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ కశ్మీర్ నుండి ఈ రోజు చాలా విచారకరమైన వార్త అందింది. పహల్గామ్‌లో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన వీర ITBP జవాన్ల కుటుంబాలకు మరియు సహోద్యోగులకు సంతాపం తెలియజేస్తున్నాను. చాలా మంది ITBP జవాన్లు గాయపడ్డారు. వారికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget