అన్వేషించండి

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహల్ఘం వద్ద ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది.

జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్‌లోని చందన్‌వాడి సమీపంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 6 మంది ఐటీబీపీ సిబ్బంది మరణించగా, 37 మంది గాయపడినట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్రలో ఐటీబీపీ సిబ్బందిని మోహరించారు.

పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం
బస్సులో 39 మంది సైనికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐటీబీపీకి చెందిన 37 మంది సిబ్బంది, జమ్మూ కశ్మీర్ పోలీస్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి లోతట్టు ప్రాంతానికి దూసుకుపోయిందని, అలా లోయలో పడిపోయినట్లు సమాచారం. జవాన్లందరూ చందన్‌వాడి నుంచి పహల్గామ్ వైపు వెళ్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర డ్యూటీ నుంచి జవాన్లందరూ తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో జవాన్లు గాయపడే అవకాశం ఉంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

రాష్ట్రపతి సంతాపం

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) చనిపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అనంత్ నాగ్‌లో జరిగిన ఘటన తనను కలచివేసిందని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ద్రౌపది ముర్ము ప్రార్థించారు.

షానవాజ్ హుస్సేన్ సంతాపం
ఈ ఘటనపై బీహార్ మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని ఆయన ట్వీట్ చేశారు. అమర్‌నాథ్ యాత్రలో నిమగ్నమైన ఐటీబీపీ బస్సు పడిపోవడంతో పలువురు జవాన్లు వీరమరణం పొందడం, గాయపడిన వార్త తనకు చాలా బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం
ఈ ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చందన్‌వాడి దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర ITBP జవాన్లను కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.

మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం
అదే సమయంలో, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సైనికుల అమరవీరులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ కశ్మీర్ నుండి ఈ రోజు చాలా విచారకరమైన వార్త అందింది. పహల్గామ్‌లో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన వీర ITBP జవాన్ల కుటుంబాలకు మరియు సహోద్యోగులకు సంతాపం తెలియజేస్తున్నాను. చాలా మంది ITBP జవాన్లు గాయపడ్డారు. వారికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget