అన్వేషించండి

ITBP Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం, ఆరుగురు జవాన్లు దుర్మరణం

ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహల్ఘం వద్ద ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది.

జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్‌లోని చందన్‌వాడి సమీపంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో 6 మంది ఐటీబీపీ సిబ్బంది మరణించగా, 37 మంది గాయపడినట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్రలో ఐటీబీపీ సిబ్బందిని మోహరించారు.

పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం
బస్సులో 39 మంది సైనికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఐటీబీపీకి చెందిన 37 మంది సిబ్బంది, జమ్మూ కశ్మీర్ పోలీస్ కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి లోతట్టు ప్రాంతానికి దూసుకుపోయిందని, అలా లోయలో పడిపోయినట్లు సమాచారం. జవాన్లందరూ చందన్‌వాడి నుంచి పహల్గామ్ వైపు వెళ్తున్నారు. అమర్‌నాథ్ యాత్ర డ్యూటీ నుంచి జవాన్లందరూ తిరిగి వస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో జవాన్లు గాయపడే అవకాశం ఉంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

రాష్ట్రపతి సంతాపం

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) చనిపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. అనంత్ నాగ్‌లో జరిగిన ఘటన తనను కలచివేసిందని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ద్రౌపది ముర్ము ప్రార్థించారు.

షానవాజ్ హుస్సేన్ సంతాపం
ఈ ఘటనపై బీహార్ మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ విచారం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని ఆయన ట్వీట్ చేశారు. అమర్‌నాథ్ యాత్రలో నిమగ్నమైన ఐటీబీపీ బస్సు పడిపోవడంతో పలువురు జవాన్లు వీరమరణం పొందడం, గాయపడిన వార్త తనకు చాలా బాధ కలిగించిందని ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విచారం
ఈ ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చందన్‌వాడి దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర ITBP జవాన్లను కోల్పోయినందుకు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.

మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం
అదే సమయంలో, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా సైనికుల అమరవీరులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ కశ్మీర్ నుండి ఈ రోజు చాలా విచారకరమైన వార్త అందింది. పహల్గామ్‌లో జరిగిన ప్రమాదంలో వీరమరణం పొందిన వీర ITBP జవాన్ల కుటుంబాలకు మరియు సహోద్యోగులకు సంతాపం తెలియజేస్తున్నాను. చాలా మంది ITBP జవాన్లు గాయపడ్డారు. వారికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget