అన్వేషించండి

Indian Railways: రైల్వే ప్రయాణికులారా ఇది విన్నారా? లగేజ్ ఎక్కువైతే ఇక బాదుడే బాదుడు!

Indian Railways: రైలు ఎక్కాలనుకుంటున్నారా? అయితే ఒకసారి లగేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. లేకపోతే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.

Indian Railways: రైల్వే ప్రయాణికులారా..! ఈ విషయం తెలిసిందా? ఇకపై మీరు ఎక్కువ లగేజ్ తీసుకువెళ్తే ఛార్జీలు చెల్లించుకోవాలి. లగేజీకి ఛార్జేంటి అనుకుంటున్నారా? కానీ ఇక ఎక్స్‌ట్రా లగేజ్‌పై చార్జీలు పడతాయి. ఎక్కువ లగేజ్ ఉంటే దానికి కూడా ముందే బుకింగ్ చేసుకోవాలి. ముందు బుక్ చేసుకోకపోతే సాధారణ రేట్ల కన్నా ఆరు రెట్లు ఎక్కువ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అవును లగేజ్ పరిమితి నిబంధనలను ఇక కచ్చితంగా అమలు చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది.

ఎంత వరకు అనుమతి

రైలులో మనం ప్రయాణించే క్లాస్ బట్టి లగేజ్‌ను అనుమతిస్తారు. అయితే అందులో కొంచెం ఎక్కువ ఉన్నా పరిమిత లగేజ్ కింద అనుమతి ఇస్తారు. లగేజ్‌కు కనిష్ఠ ఛార్జీని రూ.30గా నిర్ణయించారు. ఆయా క్లాస్, లగేజ్ అనుమతి వివారాలు ఇవే

క్లాస్ ఇంత వరకు ఫ్రీ పరిమిత అనుమతి( Marginal allowance) గరిష్ఠంగా అనుమతించే లగేజ్ 
AC ఫస్ట్ క్లాస్  70 Kgs 15 Kgs 150 Kgs
AC 2-టైర్ స్లీపర్/ ఫస్ట్ క్లాస్  50 Kgs 10 Kgs 100 Kgs
AC 3-టైర్ స్లీపర్/ AC ఛైర్ కార్  40 Kgs 10 Kgs 40 Kgs
స్లీపర్ క్లాస్ 40 Kgs 10 Kgs 80 Kgs
సెకండ్ క్లాస్ 35 Kgs 10 Kgs 70 Kgs

బుకింగ్ ఇలా

లగేజ్ తీసుకెళ్లే ప్రయాణికులు ట్రైన్ బయలు దేరడానికి 30 నిమిషాల ముందుగానే బుకింగ్ స్టేషన్‌లోని లగేజ్ ఆఫీస్‌కు వెళ్లాలి. అక్కడ బుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ ఉంది. ప్రయాణికులు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే లగేజ్ కోసం కూడా ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. అయితే లగేజ్‌ను భద్రంగా ప్యాక్ చేసి ఉంచాలి. లేకపోతే బుకింగ్ కోసం లగేజ్‌ను తీసుకోకపోవచ్చు. కనుక ప్రయాణికులు ఎక్కువగా లగేజ్ కలిగి ఉంటే పార్సిల్ ఆఫీస్‌కు వెళ్లి లగేజ్ కోసం బుక్ చేసుకోవడం మంచిది.

పెనాల్టీలు 

ఒకవేళ ట్రైన్‌లో పరిమితికి మంచి లగేజ్‌ను తీసుకెళ్తే పెనాల్టీలు చెల్లించుకోక తప్పదు. కనుక దీని కన్నా ముందు బుక్ చేసుకోవడం ఉత్తమం. లగేజ్ బుక్ చేసుకోకుండా తీసుకెళ్తే సాధారణ ఛార్జీల కన్నా ఆరు రెట్లు వరకు ఛార్జీలు పడతాయి. అందువల్ల లగేజ్ చాలా ఎక్కువగా ఉంటే మాత్రం పార్సిల్ ఆఫీస్‌కు వెళ్లి దాన్ని బుక్ చేసుకోవడం ఉత్తమం.

ఈ నిబంధనలను రైల్వేశాఖ కచ్చితంగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. అందువల్ల మీరు ఎక్కువగా లగేజ్ తీసుకెళ్లే సమయంలో ముందుగానే దాన్నిబుక్ చేసుకోవడం మంచిది.

Also Read: Gyanvapi Row: 'ప్రతి మసీదులో శివలింగం వెతకాల్సిన పనేంటి'- బండి సంజయ్‌కు RSS చీఫ్ కౌంటర్

Also Read: Self-Marriage Ceremony:సెల్ఫ్ మ్యారేజ్‌ చెల్లుతుందా..? ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది..?

టాప్ హెడ్ లైన్స్

Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget