అన్వేషించండి

Baglihar Dam Water: పాక్‌కు జల సంక్షోభం! బగ్లిహార్ డ్యామ్ వద్ద చినాబ్ నీటిని నిలిపివేసిన భారత్.. నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్

India Stops Water Release At Baglihar Dam | పహల్గాంలో ఉగ్రదాడి తరువాత భారతదేశం బాగ్లిహార్ డ్యామ్‌ నుండి పాకిస్తాన్‌కు నీటి విడుదల నిలిపివేసింది. ఇదివరకే సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించింది.

India Blocks Chenab Water Release At Baglihar Dam | పాకిస్తాన్‌కు భారత్ మరో షాకిచ్చింది. చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి విడుదలను భారతదేశం నిలిపివేసింది త్వరలో జీలం నదిపై ఉన్న కిషన్‌గాంగ్ డ్యామ్ వద్ద ఇలాంటి చర్యలను చేపట్టాలని భావిస్తున్నట్లు ఓ అధికారి వార్తా సంస్థ పీటీఐతో అన్నారు. ఈ జలవిద్యుత్ ప్లాంట్లు రాంబన్, జమ్మూలోని బాగ్లిహార్, ఉత్తర కాశ్మీర్‌లోని కిషన్‌గాంగ్ డ్యామ్ ద్వారా భారతదేశం నుంచి పాకిస్తాన్‌కు నీటిని విడుదల చేస్తారు.

సింధు జలాల ఒప్పందపై నిషేధం నుంచి వరుస చర్యలు

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ ఉగ్రదాడిలో నేపాల్ టూరిస్ట్ సహా 26 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో ఎక్కువ మంది పర్యాటకులు ఉన్నారు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడి తరువాత భారతదేశం సింధూ జలాల ఒప్పందం (IWT) నిషేధించినట్లు ప్రకటించింది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన దశాబ్దాల నాటి ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిషేధించింది. భారతదేశం నుంచి పాకిస్తాన్ కు సింధు జలాలు విడుదల చేయకుండా చర్యలు చేపట్టి దాయాదిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది భారత్. 

తాజాగా బాగ్లిహార్ డ్యామ్ నుంచి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. కిషన్‌గాంగ్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ నుండి ముందు నుంచే విమర్శలను ఎదుర్కొంటున్నాం. పాకిస్తాన్ ముందుగా బాగ్లిహార్ డ్యామ్ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని వరల్డ్ బ్యాంకును కోరింది. అయితే కిషన్‌గాంగ్ ప్రాజెక్ట్ రాజకీయ, చట్టపరమైన అంశాలతో కూడుకుని ఉంది. ముఖ్యంగా జీలం ఉపనది అయిన నీలం నదిపై దాని ప్రభావం చూపునుంది.

సింధూ జలాలు ఆపితే విధ్వంసం సృష్టిస్తామని పాక్ వార్నింగ్

సింధు జలాల విషయంలో భారతదేశం చేసిన చర్యకు పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. సింధు నదిపై IWT ఉల్లంఘనగా పరిగణించే ఏదైనా నిర్మాణానికి తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. జియో న్యూస్‌తో ఆసిఫ్ మాట్లాడుతూ.. ఖచ్చితంగా, భారత్ ఏదైనా నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తే, మేం కచ్చితంగా దానిపై దాడి చేస్తాం.” అని వార్నింగ్ ఇచ్చారు. భారత్ చేసే అలాంటి చర్యలను “ఆక్రమణ”గా ఆయన అభివర్ణించారు.

“ఆక్రమణ అంటే కేవలం తుపాకులు లేదా బుల్లెట్లు వదలడం మాత్రమే కాదు. చాలా రూపాల్లో దాన్ని చేయవచ్చు. అందులో ఒకటి నీటిని అడ్డుకోవడం లేదా దారి మళ్లించడం. దాని వల్ల మరో ప్రాంతంలో దాహం సమస్య తలెత్తి ప్రజల మరణాలకు దారితీయవచ్చు” అని ఆసిఫ్ అన్నారు. భారత్ ఏదైనా నిర్మించాలని చూస్తే, పాకిస్తాన్ ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుందని గుర్తంచకోవాలన్నారు.

భారత్‌కు నోటీసులు ఇవ్వాలని పాక్ యోచన

ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. భారతదేశం ఏకపక్షంగా నీటిని నిలిపివేయడంపై అధికారికంగా దౌత్య నోటీసు జారీ చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. భారతదేశ విదేశాంగ, న్యాయ, జల వనరుల మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపుల తరువాత ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ శనివారం అబ్దాలి నుంచి క్షిపణి ప్రయోగం నిర్వహించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్నట్లు సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 29న ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పహల్గాం దాడిపై ఎలా స్పందించాలో భారత త్రివిధ దళాలకు తెలుసునన్నారు. భారత బలగాలకు “సంపూర్ణ ఆపరేషనల్ స్వేచ్ఛ” ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget