By: ABP Desam | Updated at : 04 Jun 2022 09:48 AM (IST)
EAM S Jaishankar On Visit To Slovakia ( Image Source : ANI ) ( Image Source : ANI )
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారతదేశ వైఖరిని స్పష్టం చేస్తూ భారతదేశ విదేశాంగ విధానం కంచెపై కూర్చోవడం కాదని అన్నారు. ఇది ఒకరి భూభాగం గురించి అన్నారు. స్లోవేకియాలో జరుగుతున్న GLOBSEC 2022 బ్రాటిస్లావా ఫోరమ్లో 'ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మిత్రులో ఫ్రెండ్షిప్ను మరో స్థాయికి తీసుకెళ్లడం' అనే అంశంపై జైశంకర్ మాట్లాడారు.
ANI చెప్పిన వివరాల ప్రకారం జైశంకర్ ఇలా అన్నారు. 'మీతో నేను ఏకీభవించడం లేదు... మేము కంచె మీద కూర్చున్నామని నేను అనుకోను. అంటే మేము మా భూభాగంలో మేం ఉన్నాం. ప్రపంచంలోని పెద్ద సవాళ్లు ఏమిటంటే... వాతావరణ మార్పు, తీవ్రవాదం, భద్రత మొదలైనవి. వీటిలో మీరు దేన్నైనా తీసుకోండి లేదా అన్నింటినీ తీసుకోండి. దానిలో కొంతైనా భారత్ నుంచి సమాధానం వస్తుంది.'
I don't think we're sitting on fence,just because I don't agree with you. It means I'm sitting on my ground...what are big challenges of world? Climate change,terrorism,security etc. You take any or all challenges some part of the answer comes from India: EAM Dr S Jaishankar
— ANI (@ANI) June 3, 2022
రష్యా చమురును కొనుగోలు చేస్తున్న భారతదేశం గురించి కూడా ఆయన మాట్లాడుతూ... చమురు కొనుగోళ్లతో రష్యాకు మాత్రమే భారతదేశం ఎందుకు నిధులు ఇస్తోందని, గ్యాస్ కొనుగోలు చేయడం ద్వారా రష్యాకు యూరప్ నిధులు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు.
"చమురు మార్కెట్ను అర్థం చేసుకోండి, చమురు కొరత చాలా ఉంది, చమురును పొందడం కష్టం, భారతదేశం వంటి దేశం మరొకరి నుంచి చమురును పొంది మరొకరికి విక్రయించడం వెర్రి పని కాదా, ఇది అర్ధంలేనిది. ," జైశంకర్ అన్నారు.
ఆంక్షలను దాటవేయడానికి రష్యా చమురును రవాణా చేయడానికి భారతదేశం సిద్ధమవుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో ఎలాంటి నిజం లేదని డాక్టర్ జైశంకర్ ఖండించారు.
"యూరప్ సమస్యలు ప్రపంచ సమస్య, కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్య కాదు, ఇది మీది, ఇది నాది, ఇది మనది అనే ఆలోచన నుంచి యూరప్ ఎదగాలి" అని ఆయన అన్నారు.
#WATCH This is construct you're trying to impose on India. Don't think it's necessary for India to join any axis.India entitled to make its own choices which will be a balance of its values &interests:EAM on being asked about US-led axis & China as another potential axis in world pic.twitter.com/cFCiy3wneq
— ANI (@ANI) June 3, 2022
యూరప్ చమురును కొనుగోలు చేస్తోంది, యూరప్ గ్యాస్ కొనుగోలు చేస్తోంది. జనాభా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే విధంగా కొత్త ఆంక్షల ప్యాకేజీ ఉంది. మీపై మీకు శ్రద్ధ ఉంటే... ఇతర వ్యక్తుల పట్ల కూడా శ్రద్ధ ఉంటుంది. ఒక యూరప్ చెప్పిందే చేస్తూ వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం బాధాకరమైనది కాకపోవచ్చు కానీ... ఆ స్వేచ్ఛ ఇతరులకు కూడా ఉండాలి అని జయశంకర్ చెప్పారు.
ఇండో-చైనా సంబంధాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మధ్య ఉన్న సమాంతరాల గురించి జైశంకర్ మరింత మాట్లాడారు.
యుఎస్, చైనాల మధ్య భారతదేశం ఎటు మొగ్గుతుందన్న ప్రశ్నపై.. భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారు. ఏదో వైపు ఉండాల్సిన అవసరం భారత్కు ఉంటుందని అనుకోవద్దు. భారతదేశం దాని విలువలు, ఆసక్తుల మధ్య సమతుల్యతతో తన సొంత నిర్ణయాన్ని తీసుకునే హక్కు కలిగి ఉందని అన్నారు.
జైశంకర్ ప్రస్తుతం జూన్ 2 నుంచి 6 వరకు స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. రెండు యూరోపియన్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపందుకున్నాయి.
PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్
తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ
The Elephant Whisperers Film: దేశం గర్వపడేలా చేశారు, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' బృందానికి ప్రధాని కితాబు
ఇండోర్లోని రామనవమి ఆలయంలో అపశృతి- మెట్లబావిలో పడి 12 మంది మృతి
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు