అన్వేషించండి

PM Narendra Modi:పెద్దన్నా, అంతొద్దన్నా; అమెరికాకు మోదీ ఇచ్చిన సందేశం ఇదేనా?

PM Narendra Modi:కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ అవసరం లేదు, ఈ విషయంపై చర్చించే ముచ్చటే లేదని తేల్చి చెప్పేశారు

PM Narendra Modi: జాతీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోదీ కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. వందల ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జమ్ముకశ్మీర్ సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఆదివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టేట్మెంట్‌ ఇచ్చారు. ఇది ఇండియాలో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించకుండానే చాలా క్లియర్‌గా పెద్దన్న అవసరం లేదు అని చెప్పేశారు. అసలు జమ్ముకశ్మీర్‌పై సమస్యే లేదని స్పష్టం చేశారు. 

పాకిస్థాన్‌తో తాను చర్చలకు కూర్చోవాలంటే అది పీవోకే, ఉగ్రవాదంపై మాత్రమే అని చెప్పిన ప్రధాన మంత్ర మోదీ టోన్‌లో చాలా డెప్త్ ఉందని అంటున్నారు. జమ్ముకశ్మీర్ అనేది ఇక్కడ సమస్య కాదని పీవోకే మాత్రమే సమస్యగా చెప్పేశారు. అన్నింటి కంటే ముఖ్యమైన మరో సమస్య ఉగ్రవాదమని ఈ రెండు విషయాలపై మాత్రమే చర్చించేందుకు సిద్దమని తేల్చి చెప్పారు.
 
ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి చేయలేమని ప్రధాని మోదీ అన్నారు మరియు "నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన రెండు వారాల తర్వాత, మే 7న భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోదీ తొలి స్పందన ఇది. ఇది యుద్ధాల యుగం కాదు' అనే తన సందేశాన్ని పునరుద్ఘాటించారు. అలాగనే ఉగ్రవాదుల యుగం కూడా దాని తెలిపారు. "యుద్ధభూమిలో ప్రతిసారీ పాకిస్తాన్‌ ఓడిపోయింది. ఈసారి ఆపరేషన్ సిందూర్‌లో కొత్త అంశాన్ని జోడించాం. ఆపరేషన్ టైంలో 'భారతదేశంలో తయారు చేసిన' ఆయుధాలను వాడాం. వాటి ప్రామాణికత నిరూపితమైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరం ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత మనకు అతిపెద్ద బలం" అని మోదీ అన్నారు.

మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి మాట్లాడుతూ "మొదటి మూడు రోజుల్లోనే పాకిస్తాన్‌లో భారత్‌ భారీ విధ్వంసం సృష్టించింది, అది వారిని పూర్తిగా నిస్సహాయులను చేసింది. భారత్‌ దూకుడు ఫలితంగా ఉద్రిక్తత తగ్గించడానికి పాకిస్థాన్ మార్గాలు వెతుక్కుంది. అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. పూర్తిగా ఓడిపోయిన తర్వాత మే 10 మధ్యాహ్నం మన DGMOని సంప్రదించి వేడుకుంది." అని ఈ క్రెడిట్ కూడా అమెరికాకు ఇవ్వలేదు మోదీ. పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందని చెప్పారు. అంతే కానీ అమెరికా చెప్పిందనో ఎవరో బెదిరించారోనే వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. 

క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్ 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇష్యూలో తానే క్రెడిట్ కొట్టేసేందుకు యత్నించారు. అందుకే ఇరు దేశాలతో చర్చలు జరిపామని అంగీకరించకుంటే వ్యాపారాలు నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. రెండు దేశాలు అణ్వాయుధ శక్తులని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశామన్నారు. ఇందులో తన కృష్టి ఫలిచిందని అన్నారు. 

అణు యుద్ధాల గురించి అమెరికా అధ్యక్షుడు చెప్పిన విషయాన్ని భారత్ ఖండించింది. అణ్వాయుధాలు ఉపయోగించాలన్న ఆలోచన భారత్‌కు ఎప్పుడూ లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా 9 ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించాయి. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని ఉన్నత వర్గాలు ABP న్యూస్‌తో తెలిపాయి. మీరు ఆగిపోతే మేం ఆగిపోతామని పాక్ DGMO అభ్యర్థనకు భారతదేశం అంగీకరించిందని తెలిపాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Kerala BJP: కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
Gujarat Love Marriage Conditions: ప్రేమ పెళ్లిచేసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి - గుజరాత్‌లో చట్టం - ఈ పెద్దోళ్లున్నారే?
ప్రేమ పెళ్లిచేసుకోవాలంటే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరి - గుజరాత్‌లో చట్టం - ఈ పెద్దోళ్లున్నారే?

వీడియోలు

Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్
CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget