అన్వేషించండి

నేడు ఐఎన్‌డీఐఏ పక్షాలు భేటీ- సీట్ల లొల్లి కొలిక్కి తీసుకొస్తారా- సమావేశానికి మమత గైర్హాజరు

INDIA Parties:పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోంది. సీట్ల సర్ధుబాటు అంశంపై చర్చించేందుకు సమావేశం కావాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.

INDIA Parties: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన I.N.D.I..A కూటమిలో సీట్ల పంపకం కత్తి మీద సాములా మారుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో సీట్ల పంపకంలో లొల్లి మొదలవుతోంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తోంది. సీట్ల సర్ధుబాటు అంశంపై చర్చించేందుకు సమావేశం కావాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అయితే, కాంగ్రెస్‌ పార్టీతో చర్చించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ముందుకు రాకపోవడంతో ఈ వ్యవహారం కూటమికి ఇబ్బందికరంగా పరిణమించేలా కనిపిస్తోంది. బీజేపీని అధికారానికి దూరం చేయాలన్న ఉద్ధేశంతో ఏకమైన పార్టీలు ఆదిలోనే ఇలా సీట్ల పంపకాలతో లొల్లికి దిగుతుండడం కూటమిలోని ఇతర పార్టీలను కలవరానికి గురి చేస్తోంది.

సీట్ల స్పష్టతతో బీజేపీకి కళ్లెం..

దేశ వ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో I.N.D.I.A. కూటమిగా ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నుంచి దించడమే లక్ష్యంగా ఈ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు సమావేశమైన I.N.D.I.A. భాగస్వామ్య పార్టీ నాయకులు.. ఎన్నికలకు ముందే అభ్యర్థులపై స్పష్టతకు రావాలని నిర్ణయించాయి. అందులో భాగంగానే రాష్ట్రాలు వారీగా సీట్ల పంపకాలతో దృష్టి సారించాయి. ఆయా రాష్ట్రాల్లో కీలకంగా ఉండే పార్టీలు.. తమకున్న బలాబలాలను బట్టి సీట్లను కేటాయించుకోవాలని నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్‌లో సమావేశం నిర్వహించగా.. సీఎం మమతా గైర్హాజరు కావడంతో సీట్ల పంపకం ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

ఇరు పార్టీల మధ్య కుదరని సయోధ్య..

పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపకానికి సంబంధించి ఇరు పార్టీలు చర్చించాలని భావించాయి. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల లెక్క తేల్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఐదుగురి సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ చర్చలు జరిపేందుకు మమతా బెనర్జీ ఇష్టపడలేదు. దీనికి బలమైన కారణం ఉన్నట్టు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మెజార్టీ సీట్లను కాంగ్రెస్‌ పార్టీ అడుగుతోంది. దీనికి మమతా సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే ఇస్తామంటూ మమతా బెనర్జీ ప్రతిపాదించారు. టీఎంసీ కాంగ్రెస్‌కు ఇవ్వాలని చూస్తున్న సీట్లలో మాల్డా దక్షిణ్‌, బెర్హమ్‌పూర్‌ సీట్లలో ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎంపీలే ఉన్నారు. ఈ రెండు స్థానాలే ఇస్తామంటూ చేసిన టీఎంసీ ప్రతిపాదనను కాంగ్రెస్‌ తిరస్కరించింది. దీంతో మరోమారు జరపాలనుకున్న చర్చలకు తృణమూల్‌ అధినేత్రి మమతా దూరంగా ఉండిపోయారు.

ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధం..

కాంగ్రెస్‌ పార్టీ సీట్ల పంపకంపై ముందుకు రాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెల్చుకుంది. ఈ స్థానాలనే ఇస్తామనడం ఏమిటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గెల్చిన స్థానాలను మళ్లీ గెల్చుకోవడానికి ఎవరి సహాయం అక్కర్లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీట్ల పంపకాలు వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ తేల్చకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ప్రస్తుతం టీఎంసీ ఎంపీలు ఉన్న స్థానాలను కాంగ్రెస్‌ కోరుతుండడం.. అందుకు టీఎంసీ అధినేత్రి ససేమిరా అనడంతో చిక్కు వీడడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో సీట్ల లెక్క తేలితే ఇండియా కూటమికి దాదాపు సీట్ల పంపకాలు ఇబ్బందులు తప్పినట్టుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: విచారణకు రావాల్సిందే! కేజ్రీవాల్‌కు ఈడీ నాలుగో సారి నోటీసులు

Also Read:  4 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం, పెరిగిన ఆహార ధరలే కారణం, EMI ఆశలపై నీళ్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget