అన్వేషించండి

Farooq Abdullah: పాకిస్తాన్ గేట్లు తెరిస్తే అసలు సంగతి ఏంటో తేలుస్తాం: ఫరూక్ అబ్దుల్లా

Farooq Abdullah: కాశ్మీర్ సమస్యపై భారత్‌, పాకిస్తాన్ నిజాయితీగా చర్చలు జరిపే వరకు ర్యాలీలు నిర్వహించడం, సరిహద్దు పర్యాటకం అనే తమాషాలు కొనసాగుతూనే ఉంటాయని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.

Farooq Abdullah: సరిహద్దు పర్యాటకంపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దు పర్యాటకం ప్రోత్సహించడం, ర్యాలు నిర్వహించడం తమాషాలుగా అభవర్ణించారు. కాశ్మీర్ సమస్యపై భారత్‌, పాకిస్తాన్ నిజాయితీగా చర్చలు జరిపే వరకు ఈ తమాషాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.  

సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించడం, లోయ అంతటా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నందున కాశ్మీర్‌లో పరిస్థితి మారిందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానమిస్తూ ఇరు దేశాల హృదయాలు స్వచ్ఛంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిస్కారం సాధ్యమవుతుందని శ్రీనగర్ ఎంపీ విలేకరులతో అన్నారు. యుద్ధాలు దేనిని పరిష్కరించలేవని, భారతదేశం, పాకిస్తాన్ స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో సమస్యల పరిష్కారానికి మాట్లాడాలని అబ్దుల్లా అన్నారు. 

కశ్మీర్ సమస్యపై ఇరు దేశాలు నిజాయితీగా మాట్లాడనంత వరకు, (ర్యాలీలు, సరిహద్దు ప్రర్యాటకం) ఈ ప్రదర్శనల తమాషా అప్పటి వరకు కొనసాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని, కానీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

జమ్మూ కాశ్మీర్‌లో సాధారణ స్థితి నెలకొందని ప్రభుత్వ చెబుతోందని దీనిపై మీ ఉద్దేశం ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఫరూక్ అబ్దుల్లా ఘాటుగానే స్పందించారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతి ఉంటే, ఉగ్రవాదం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఎందుకు బుల్లెట్‌లు పేల్చుతున్నారని, సైనికులు, ప్రజలు ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నించారు. 

జమ్మూ కాశ్మీర్‌లో వాస్తవానికి శాంతి ఉంటే, నిత్యం రక్తపాతం ఎందుకు జరుగుతోందని, చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు వివరిస్తారని అబ్దుల్లా ప్రశ్నించారు. యుద్ధం వల్ల నష్టాలు ఏంటో, దాని ప్రభావాలు ఏంటో రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో తెలుసుకోవచ్చన్నారు. 

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో యూరప్ ఆర్థికంగా నాశనమైపోతోందని, యుక్రెయన్ ప్రజలను ఎవరు చంపుతున్నారు? యుద్ధంతో ఇరు దేశాలు వారు ఏమి సాధిస్తారు? సరిహద్దులను మారుస్తుందా? అంటూ ప్రశ్నించారు.  

అలాగే భారత్, పాకిస్తాన్ యుద్ధం ద్వారా ఏమీ సాధించలేవని గుర్తుంచుకోవాలన్నారు. కేవలం చర్చలు మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. చైనాతో ఇదే విషయంపై 18 సార్లు చర్చలు జరిగాయని, విదేశాంగ మంత్రి స్థాయిలో కూడా చర్చలు జరిగిన విషయాన్ని ఉదహరించారు.  

నియంత్రణ రేఖ (LoC) సమీపంలోని అనేక ప్రదేశాలలో సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జమ్మూ, కాశ్మీర్ పరిపాలన గురించి అడిగిన ప్రశ్నకు అబ్దుల్లా సమాధానమిచ్చారు. సరిహద్దులు తెరవబడాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా పాక్ పరిధిలో ఉన్న కాశ్మీర్ భాగాన్ని చూస్తామని, అప్పుడు అక్కడ నిజమైన శాంతి ఉందని తాము అంగీకరిస్తాన్నారు.

జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత కేంద్రం అక్కడ శాంతి నింపేందుకు చర్యలు చేపట్టింది. అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించేందుకు సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది.  అయినా తరచూగా పాక్ కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంటోంది. కొన్ని సార్లు సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతోంది. దీనిపై ఎన్‌సీ అధినేత ఫరూక్ స్పందించారు. ఇరు దేశాలు చర్చలు జరపడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా ఉంటారని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget