అన్వేషించండి

QRSAM: భారత గగనతల రక్షణకు ₹30,000 కోట్లతో QRSAM, పాకిస్తాన్, చైనాకు చెక్ పెట్టే క్షిపణి వ్యవస్థ!

QRSAM: విదేశీ దాడుల నుండి మన దేశ గగనతలాన్ని రక్షించే ఉద్దేశంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM) వ్యవస్థను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది

QRSAM: గగనతల రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా భారత సైన్యం కొత్త అడుగులు వేస్తోంది. విదేశీ దాడుల నుంచి మన దేశ గగనతలాన్ని రక్షించే ఉద్దేశంతో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (QRSAM) వ్యవస్థను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ చివరి వారంలో రక్షణ మంత్రిత్వ శాఖ జరిపే సమావేశంలో ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది.

QRSAM అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏంటి?

క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్నే సంక్షిప్తంగా QRSAM అని పిలుస్తారు. ఇది మధ్య శ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఒక అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థ. దీని పేరులోనే ఉన్నట్లు 'క్విక్ రియాక్షన్' అంటే అత్యంత వేగంగా స్పందించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ రక్షణ వ్యవస్థ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది కదులుతున్నప్పటికీ శత్రువుల విమానాలు, క్షిపణులు, హెలికాప్టర్లు, డ్రోన్‌లను గుర్తించి, గాల్లోనే కూల్చివేసేంత శక్తివంతమైంది.

QRSAM వ్యవస్థ ముఖ్యమైన లక్షణాలు:

  • అధిక చలనశీలత: ఈ వ్యవస్థను అధిక చలనశీలత ఉన్న వాహనాలపై (ట్రక్కులు) అమర్చుతారు. ఇది కదులుతున్నప్పటికీ శత్రు దేశాల క్షిపణులు, విమానాలు, డ్రోన్‌లు, హెలికాప్టర్లను గుర్తించి, ట్రాక్ చేసి, ధ్వంసం చేయగలదు.
  • శీఘ్ర ప్రతిస్పందన: శత్రు వైమానిక దాడులను ఇట్టే పసిగట్టి, వాటిపై ప్రతిదాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది.
  • 360 డిగ్రీల రక్షణ: ఈ వ్యవస్థ 360 డిగ్రీల పరిధిలో రక్షణ కల్పిస్తుంది. ఇందులో రెండు ఫోర్-వాల్డ్ రాడార్‌లు ఉంటాయి, ఇవి 360 డిగ్రీల కోణంలో శత్రువుల నుండి వచ్చే ముప్పును గుర్తించగలుగుతాయి.
  • పరిధి:ఈ వ్యవస్థ 5 కిలోమీటర్ల నుండి గరిష్టంగా 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలపై నిఘా ఉంచి, వాటిని ధ్వంసం చేయగలదు.
  • బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం: QRSAM బహుళ లక్ష్యాలను ఛేదించగల వ్యవస్థ. ఒకే లాంచర్ నుండి ఆరు క్షిపణులను ప్రయోగించి, ఒకేసారి ఆరు లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉంది.
  • ఎలక్ట్రానిక్ జామింగ్ను నిరోధించడం: QRSAM ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్ మెజర్ (ECCM) సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఇది శత్రు దేశాల ఎలక్ట్రానిక్ జామింగ్ సిస్టమ్‌ను నిరోధిస్తూ తన పనిని కానిచ్చే అద్భుత సామర్థ్యం ఉంది.

ఈ వ్యవస్థలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేస్తోంది. వీటికి అనుసంధానించే క్షిపణులను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) అభివృద్ధి చేస్తుంది. ఇక వీటిని ప్రయోగించే లాంచర్లను లార్సెన్ అండ్ టూబ్రో (L&T) అనే భారతీయ బహుళజాతి సంస్థ అభివృద్ధి చేస్తోంది.

పాకిస్థాన్, చైనాలకు చెక్ పెట్టే రక్షణ వ్యవస్థ

భారత ప్రభుత్వం QRSAM వ్యవస్థను ప్రధానంగా మూడు రెజిమెంట్ల కోసం కొనుగోలు చేయాలని భావిస్తోంది. వీటిని మన దేశ పశ్చిమ (పాకిస్థాన్ సరిహద్దు) ,ఉత్తర (చైనా సరిహద్దు) సరిహద్దులలో వ్యూహాత్మకంగా మోహరించనున్నారు. ఇది ఈ రెండు దేశాల నుండి వచ్చే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్‌ల నుంచి గగనతల రక్షణను అందిస్తుంది. ఇప్పటికే మన సైన్యం వద్ద ఉన్న MRSAM (Medium Range Surface-to-Air Missile), ఆకాష్ (Akash) వంటి గగనతల రక్షణ వ్యవస్థలకు అనుబంధంగా పనిచేసి, వాటి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన శౌర్యం

ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు నిర్ణయం వెనుక ఆపరేషన్ సింధూర్ అనుభవాలు ఉన్నాయి. ఏప్రిల్ 22న పహెల్గామ్ ఉగ్రదాడి తర్వాత, మే 6, 7వ తేదీలలో అర్ధరాత్రి పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మన దేశం ఆపరేషన్ సింధూర్‌ను నిర్వహించింది. దీనికి ప్రతిస్పందనగా, పాకిస్థాన్ మన దేశంపై పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది.

అయితే, మన సైన్యం వాటిని విజయవంతంగా అడ్డుకుంది. భారత సైన్యంలో ఉన్న బోఫోర్స్ 40 mm ఆటోమేటిక్ గన్ L/70, రష్యా తయారీ Zu-23 విమాన విధ్వంసక తుపాకులు, అలాగే వైమానిక దళంలోని స్పైడర్ (SPYDER), మరియు రష్యా తయారీ S-400 సుదర్శన్ వ్యవస్థలు కలిసి ఈ దాడులను సమర్థవంతంగా నిరోధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో QRSAM వంటి 'క్విక్ రియాక్షన్' వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందని స్పష్టమైంది. ఈ కారణంగానే మన సైన్యం ఈ వ్యవస్థ కొనుగోలుకు సిద్ధమవుతోంది.

మరిన్ని అధునాతన యుద్ధ పరికరాల కొనుగోలుకు రంగం సిద్ధం

పాక్‌తో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యం మరింత బలోపేతం అయ్యేందుకు చర్యలు చేపట్టింది. QRSAM వ్యవస్థతోపాటు, సైన్యానికి త్వరలో కొత్త రాడార్ యంత్రాలు, చిన్న శ్రేణి క్షిపణులు, జామర్లు, లేజర్ వ్యవస్థలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది టర్కీ, చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే డ్రోన్ ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఈ అధునాతన వ్యవస్థలు భారత సైన్యం చేతికి వస్తే భారత దేశ గగనతల రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును బలంగా తిప్పికొట్టే శక్తి వస్తుందని మిలటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget