అన్వేషించండి

I.N.D.I.A కూటమిపై కాంగ్రెస్ ఫోకస్ చేయడం లేదు - నితీశ్ సంచలన వ్యాఖ్యలు

I.N.D.I.A Alliance: విపక్ష కూటమిపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

I.N.D.I.A Alliance: 


నితీశ్ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు..

I.N.D.I.A కూటమిలో ఐక్యత ఉందా లేదా..? అన్న అనుమానాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. కలవనైతే కలిశారు కానీ ఎవరి దారి వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఆ కూటమిలోని నేతలు. ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇవే అనుమానాలకు తావిస్తున్నాయి. I.N.D.I.A కూటమి ఏర్పాటైంది కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదని, కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందని వెల్లడించారు. అందుకే కూటమి చడీచప్పుడు లేకుండా ఉండిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. పట్నాలోని ఓ ర్యాలీలో పాల్గొన్న నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా హఠావో, దేశ్ బచావో థీమ్‌తో జరిగిన ఆ కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ఆ సమయంలో అక్కడ సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా లాంటి సీనియర్ నేతలున్నారు. Janata Dal (United) పార్టీ అన్ని పార్టీలనూ ఒక్కటి చేసే బాధ్యత తీసుకుందని తేల్చి చెప్పారు నితీశ్ కుమార్. దేశ ప్రజలు బేజీపీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అన్నారు. 

"మేం అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరిపాం. చరిత్రను మార్చాలని చూస్తున్న బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం. పట్నాతో పాటు పలు చోట్ల ఇప్పటికే కీలక సమావేశాలు జరిగాయి. I.N.D.I.A కూటమి ఏర్పడింది. కానీ పెద్దగా ఏమీ జరగడం లేదు. అంతా చడీచప్పుడు లేకుండా ఉంటున్నారు. త్వరలోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఫోకస్ అంతా ఆ ఎన్నికలపైనే ఉంది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు మేమెంతగానో ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల తరవాత ఆ పార్టీయే అందరినీ పిలిచి మాట్లాడుతుందని అనుకుంటున్నాను. మా కూటమిని కాంగ్రెస్‌ లీడ్ చేయాలని మేమంతా నిర్ణయించుకున్నాం. బహుశా అన్ని ఎన్నికలు పూర్తైన తరవాతే కాంగ్రెస్ ఈ బాధ్యత తీసుకుంటుందేమో"

- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 

 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలో అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్‌ ఉన్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ దృష్టి అంతా ఈ ఎన్నికలపైనే ఉంది. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజస్థాన్‌లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: యాపిల్‌కి కేంద్రం నోటీసులు, ట్యాపింగ్ ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
తప్పుడు సమాచారానికి చెక్.. కంటెంట్ మోడరేషన్‌పై మెటాకు మోదీ సర్కార్ అల్టిమేటం!
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget