అన్వేషించండి

Heavy Rains in Chennai due to Michaung Cyclone: మిగ్ జాం ఎఫెక్ట్ - చెన్నై నగరం అతలాకుతలం, 8 మంది మృతి

Chennai Heavy Rains: మిగ్ జాం తుపాను ధాటికి చెన్నై మహా నగరం వణికిపోతోంది. వర్షాల వల్ల ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వర్షాలు కాస్త తెరిపినివ్వడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Heavy Rains in Chennai due to Michaung Cyclone: మిగ్ జాం తుపాన్ (michaung Cyclone) ధాటికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. గత 24 గంటల్లో 20 నుంచి 29 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై 5 నుంచి 6 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. భారీ వానలతో జనం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల్లో రవాణా సేవలు స్తంభించాయి. దాదాపు 70కి పైగా విమాన సర్వీసులు రద్దు చేసిన అధికారులు, మరో 33 సర్వీసులను దారి మళ్లించారు. కాంచీపురం (Kanchipuram), తిరువళ్లూరు (Tiruvallur), చెంగల్పట్టు (Chengalpattu) జిల్లాల్లోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో చెన్నైలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, అధికార యంత్రాగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సీఎం స్టాలిన్ అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుపాను కారణంగా ప్రభావిత జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు బ్యాంకులకు మంగళవారం సెలవు ప్రకటించారు. 

 

 

తెరిపిచ్చిన వర్షం

కాగా, మంగళవారం ఉదయానికి వర్షం కాస్త తెరిపినివ్వడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని అటు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, తమిళనాడు ఉత్తర తీర ప్రాంతాలు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టును మూసేయగా, మంగళవారం ఉదయం సిబ్బంది రన్ వేపై నీటిని తొలగించారు. విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. నగరంలో కొన్ని చోట్ల వరద ఉద్ధృతితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూవమ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తమిళనాడులో తుపాను కారణంగా వర్షాల వల్ల 8 మంది మృతి చెందడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడు, ఏపీ, ఒడిశాలో వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. 

Also Read: Cyclone Michaung News: రవాణా వ్యవస్థపై మిగ్‌జాం ఎఫెక్ట్‌- విమానాలు, రైళ్లు రద్దు

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget