News
News
X

Kamal Gupta On POK: మరో 2, 3 ఏళ్లలో భారత్‌లో పీవోకే భాగమవుతుంది: హర్యానా మంత్రి కీలక వ్యాఖ్యలు

Kamal Gupta On POK: రెండు, మూడేళ్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్ లో భాగం అవుతుందని హర్యానా మంత్రి కమల్ గుప్తా వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

FOLLOW US: 
Share:

Kamal Gupta On POK: రానున్న రెండు మూడేళ్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్ - POK భారతదేశంలో భాగం అవుతుందని హర్యానా మంత్రి, భారతీయ జనతా పార్టీ(BJP) సీనియర్ నాయకుడు, డాక్టర్ కమల్ గుప్తా వ్యాఖ్యానించారు. హర్యానాలోని రోహ్ తక్ లో వ్యాపార ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీవోకే భారత్ లో భాగం అవుతుందని ధీమాగా చెప్పారు.

2014 లో తాము బలంగా లేము అని, కానీ ఇప్పుడు దృఢంగా తయారయ్యామని కమల్ గుప్తా అన్నారు. పీవోకేలోని మన భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించిందన్న కమల్ గుప్తా.. అక్కడి ప్రజలు భారత్ లో కలిసేందుకు ఇష్టంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రెండు మూడేళ్లలో పీవోకే భారత్ లో భాగమవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలోనే అది జరుగుతుందని కమల్ గుప్తా జోస్యం చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఆర్టికల్ 370ని రద్దు చేశామని కమల్ అన్నారు. ఈ పనులన్నీ చూస్తుంటే పీవోకేలో గొంతులు లేస్తున్నాయని, ముజఫరాబాద్ లో ఆందోళనలు మొదలయ్యాయని హర్యానా కేబినెట్ మంత్రి తెలిపారు. 

ఆర్టికల్ 370ని రద్దు చేశాం:  కమల్ గుప్తా

'2014 కు ముందు మనం బలంగా లేము. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ గా తయారయ్యాం. పీవోకేలోని మన భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. భారత్ లో చేరాలని అక్కడి నుండి చాలా మంది కోరుతున్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో ఏ క్షణంలో అయినా పీవోకే భారత దేశంలో భాగం అవుతుంది. అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రామ మందిర నిర్మాణ పనులు ప్రారంభించి ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఈ పనులన్నీ చూస్తుంటే పీవోకేలో గొంతులు లేవడంతో పాటు ముజఫరాబాద్ లో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడి ప్రజలు భారత్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారు.' అని కమల్ గుప్తా వ్యాఖ్యానించారు. 

పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు..

భారత్ పొరుగు దేసం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిందని కమల్ గుప్తా తెలిపారు. దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. విపరీతంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా జనజీవనం హరంగా మారిందని కమల్ గుప్తా పేర్కొన్నారు. ఇంతలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పాకిస్థాన్ ను వీడి భారత్ లో చేరాలని కోరుకుంటున్నారని హర్యానా మంత్రి తెలిపారు. గత నెలలోనే పీవోకే నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారత్ లో చేరాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో జే సింద్ ముత్తాహిదా మహాజ్- JSMM అధ్యక్షుడు షఫీ బర్ఫత్ కూడా ఫిబ్రవరి 14న పాకిస్థాన్  తన దేశం కాదని మరోసారి అన్నట్లు గుర్తు చేశారు.

Published at : 06 Mar 2023 06:56 PM (IST) Tags: India News Haryana Minister Kamal Gupta Haryana Minister POK Will Become Part Of India Home Minister Kamal Gupta

సంబంధిత కథనాలు

Covid-19 Review Meeting: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు

Covid-19 Review Meeting: కరోనా వ్యాప్తిపై ప్రధాని మోదీ సమీక్ష, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు కీలక సూచనలు

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!

Gautam Adani: కోటీశ్వరుల కష్టాలు! వారానికి రూ.3000 కోట్లు నష్టపోతున్న అంబానీ!

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!