అన్వేషించండి

Manipur News: మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం- హింస కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు

Manipur Violence: మణిపూర్ మరోసారి భగ్గుమంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఇంటర్‌నెట్ సేవలపై నిషేధం విధించాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.

Manipur Erupts Again: కొన్ని వారాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో గత వారం రోజులుగా మళ్లీ హింస చెలరేగింది. కొన్ని నెలల క్రితం కుకీ, మొయితీ తెగల మధ్య జరిగిన ఘర్షణలో 200 మంది వరకు మృత్యువాత పడగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు దిగాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి మణిపూర్‌లో ఐదు రోజుల పాటు మొబైల్‌ ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్, వీపీఎన్‌  సేవలు నిలుపులద చేస్తూ  చర్యలు తీసుకున్నారు. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకొని సంఘ విద్రోహశక్తులు అసత్యాలను ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళనలు రేగేలా చేస్తున్నాయని.. అందుకే ఇంటర్నెట్‌ నిలుపుదల చేస్తున్నట్లు మణిపూర్‌ సర్కార్ తెలిపింది.

వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌ మీడియాల ద్వారా విద్రోహశక్తులు ప్రజలను రెచ్చగొట్టి.. ప్రజల మానప్రాణాలు, వారి ఆస్తులపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందని .. ఈ చర్యల ద్వారా కట్టడి చేయొచ్చని అధికారులు వివరించారు. ఇంఫాల్‌ లోయ పరిధిలోని రెండు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూని ప్రకటించింది. అయితే ఈ కర్ఫ్యూని కూడా లెక్క చేయని కొందరు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. గత వారం జరిగిన డ్రోన్ బాంబు అటాక్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.ఒక దశలో బలగాలు టియర్‌ గ్యాస్‌ను గాల్లోకి కాల్పులను జరిపి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.

ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి తమ 6 డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా కోరారు. పరిష్కారానికి కృషి చేస్తానని తమతో గవర్నర్ చెప్పినట్లు విద్యార్థులు పేర్కొన్నారు.  పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన మణిపూర్‌ సర్కార్ అన్ని హైయర్ ఎడ్యుకేషన్ కళాశాలలను సెప్టెంబర్ 12 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మణిపూర్ యూనివర్శిటీ ఇప్పటికే అన్ని రకాల ఎగ్జామ్స్‌ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

కేంద్రం కూడా మణిపూర్‌కు మరో రెండు బెటాలియన్ల సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను ఎయిర్‌ లిఫ్ట్ ద్వారా తరలించింది. తద్వారా మణిపూర్‌లో అదనంగా మరో 2 వేల మంది బలగాలను చేర్చింది. సైన్యం, అస్సాం రైఫిల్స్‌ ఇంకా ఇతర భద్రతా బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి ఆయుధాలను స్వాధీనం చేసున్నారు.

Also Read: హైవేలపై టోల్‌ ఛార్జ్‌ మినహాయింపు పొందాలంటే ఏం చేయాలి? ఇంతకీ ఏంటీ GNSS?

గతేడాది మే నుంచి కుకీలకు మొయితీలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మొయితీలు తమను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులివ్వాలని డిమాండ్ చేస్తుండగా.. కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొయితీల దగ్గరే అధికారం మొత్తం ఉందని కుకీల భద్రతకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కుకీ తెగ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో 16 నెలలుగా మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొని ఉండగా.. కొద్ది నెలలుగా పరిస్థితి అదుపులో ఉంది. ఐతే గత వారం డ్రోన్ బాంబు దాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ దాడికి పాల్పడిన వాళ్లు కుకీలుగా మొయితీలు ఆరోపిస్తున్నారు. ఆ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Also Read: రాహుల్ గాంధీకి పెళ్లంట - మరోసారి ఊగిపోతున్న సోషల్ మీడియా ! వధువు ఎవరో తెలుసా ?

ఘటనకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు రిపోర్టు ఇచ్చినట్లు మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ఈ పరిస్థితి వెనుక చైనా కుట్ర ఉన్నట్లు సెంట్రల్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. కేంద్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
West Asia Tensions: గల్ఫ్‌లో యుద్ధం భారత్‌కు నష్టకాలం! నాలుగు రోజుల్లో ఎంత లాస్‌ అయ్యామంటే? 
గల్ఫ్‌లో యుద్ధం భారత్‌కు నష్టకాలం! నాలుగు రోజుల్లో ఎంత లాస్‌ అయ్యామంటే? 
Iran Israel War 2026: భారత్‌లో చమురు సంక్షోభం రాబోతోందా? కేంద్రం ఏం చెప్పింది?
భారత్‌లో చమురు సంక్షోభం రాబోతోందా? కేంద్రం ఏం చెప్పింది?
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
ABP Desam Smart Ed Conclave 2026: AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
AI యుగంలో డిగ్రీలు ఉంటే సరిపోవు! స్కిల్ ఉన్నోడికే గుర్తింపు! ABP Desam Smart Ed Conclave 2026లో నిపుణుల సూచన!
Manchu Manoj Wedding Anniversary: మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
మౌనికతో మనోజ్ వివాహ బంధానికి మూడేళ్లు... ఒక్కటిగా ముందడుగు, వరుస విజయాలు
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
Embed widget