అన్వేషించండి

Goa Political News: మహారాష్ట్రలో ముగిసింది, గోవాలో మొదలైంది- ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఆఫర్!

Goa Political News: గోవాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభాలకు గురిచేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

Goa Political News: మహారాష్ట్రలో నరాలు తెగే ఉత్కంఠ భరిత రాజకీయాలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే గోవాలో అలజడి మొదలైంది. అధికార భాజపాలో కాంగ్రెస్‌ నేతలు చేరుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. కమలం పార్టీతో టచ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. 

ఇదీ జరిగింది

ఈ కుట్రలో భాగమైన ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలపై గోవా కాంగ్రెస్‌ చర్యలు చేపట్టింది. వారిపై అనర్హత వేటుకు సిద్ధమైంది. గోవా అసెంబ్లీలో 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, కేదార్ నాయక్, రాజేష్ ఫల్దేశాయి, డెలియాలా లోబో గైర్హాజరయ్యారు.

ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసిన వారంతా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు భాజపాలో చేరుతున్నట్లుగా వార్తలొచ్చాయి. దీంతో కాంగ్రెస్‌లో చీలిక కోసం ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, భాజపాతో కుమ్మక్కై కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దినేష్ గుండూరావు ఆరోపించారు.

వేటు కోసం

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గోవా అసెంబ్లీ స్పీకర్‌ రమేష్ తవాడ్కర్‌ను కోరినట్లు గోవా పీసీసీ చీఫ్ అమిత్ పాట్కర్ తెలిపారు. దీనిపై వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్‌ అధిష్ఠానం సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఎంపీ ముకుల్ వాస్నిక్‌కు గోవా పంపింది. 

రూ. 50 కోట్లు!

గోవాలో తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు.

" గోవాలో కాంగ్రెస్‌ నేతలను భాజపా ప్రలోభాలకు గురిచేస్తోంది. భాజపాలో చేరేందుకు ఒక్కో కాంగ్రెస్ నేతకు ఆ పార్టీ రూ.50 కోట్లు ఆఫర్‌ చేసిందియ. ఒక్క గోవాలోనే కాదు.. ప్రతి రాష్ట్రంలో ఆపరేషన్‌ కమల్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. కానీ కర్ణాటకలో మాత్రం ఇది సాధ్యం కాదు.                                                                "
-సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ సీఎం

Also Read: Maharashtra Political Crisis: ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట- ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశం

Also Read: Vladimir Putin: 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న పుతిన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget