అన్వేషించండి

Naxal Leader Bhupati : నక్సల్స్ కోసం ఫస్ట్ టైమ్ అటవీ ప్రాంతానికి CM! ఆ ఒక్కటే లక్ష్యం!

Devendra Fadnavis: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గడ్చిరోలిలో మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం జరిగింది. లొంగిపోయిన మావోయిస్టులకు ముఖ్యమంత్రి రాజ్యాంగం కాపీ అందజేశారు.

Gadchiroli Naxal : గడ్చిరోలిలో (Gadchiroli) మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు (Mallojula Venugopal Rao) పెద్ద ఎత్తున లొంగిపోవడంతో మావోయిస్టు రహిత మహారాష్ట్ర సాధ్యమయ్యే అవకాశాలు మరింత పెరిగాయి. మావోయిస్టుల (Naxal) సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు , అత్యంత సీనియర్ నక్సల్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి తన 60 మంది సహచరులతో కలిసి గడ్చిరోలి పోలీసుల (Gadchiroli Police) ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్ర నుంచి మావోయిజం త్వరలో అంతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) సమక్షంలో ఈ లొంగుబాటు కార్యక్రమం గడ్చిరోలిలో జరిగింది. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను ముఖ్యమంత్రికి సమర్పించగా...ముఖ్యమంత్రి వారికి రాజ్యాంగ ప్రతిని అందించారు.

Gadchiroli Naxal : 1980 నుండి గడ్చిరోలిలో మావోయిస్టు సాయుధ పోరాటం, 538 మంది సాధారణ పౌరుల బలిదానం

ఇదే సమయంలో, 1980 నుండి గడ్చిరోలిలో ప్రారంభమైన మావోయిస్టు సాయుధ పోరాటంలో ఇప్పటివరకు మావోయిస్టులు 538 మంది సాధారణ పౌరుల ప్రాణాలు తీశారు. అలాగే 'సాయుధ మావోయిజం మార్గాన్ని వదిలి, ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి ప్రధాన స్రవంతిలోకి రావాలి' అని మావోయిస్టు నాయకుడు సోను అలియాస్ భూపతి అన్నారు. ఇప్పుడు ఆయనతో పాటు 60 మందికి పైగా సహచరులు గడ్చిరోలి పోలీసుల (Gadchiroli Police) ఎదుట లొంగిపోయారు, దీనివల్ల మహారాష్ట్ర నుంచి మావోయిజం త్వరలో అంతమయ్యే అవకాశం ఉంది.

Devendra Fadnavis : ముఖ్యమంత్రి భూపతి విషయంలో పోలీసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు

భూపతి లొంగిపోవచ్చు, కానీ ఆయన తెలంగాణాలో లొంగుతాడు లేదా ఛత్తీస్‌గఢ్‌లో లొంగుతాడా అని భావిస్తున్న సమయంలో, భూపతి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోవడానికి అంగీకరించాడు. గత కొన్ని రోజులుగా మధ్యవర్తుల ద్వారా భూపతి ,ఆయన సహచరులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి లొంగిపోవడం , ఆయుధాలు వదిలి సమాజంలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాలను... పోలీసులు , వారి మధ్యవర్తులు వివరించడంలో విజయం సాధించారు. భూపతి లొంగిపోయే ముందు ఒక షరతు విధించాడు. అదేంటంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో మాత్రమే లొంగిపోతాను అన్నాడు. ముఖ్యమంత్రి కూడా భూపతి లొంగిపోయే నిర్ణయాన్ని ఆమోదించిన తర్వాత ఈ రోజు తన ప్రధాన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి మహారాష్ట్ర తరపున పోలీసులు .. వారి మధ్యవర్తులు భూపతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గడ్చిరోలికి వెళ్లారు

దేశంలో మావోయిజానికి చోటు లేదు..నక్సల్స్ ఫ్రీ భారత్ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్. లొంగిపోయిన నక్సల్స్ ని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు... ఈ సందర్భంగా కొందరికి చెక్ లు అందించారు ముఖ్యమంత్రి

నక్సల్స్ కోసం ఓ ముఖ్యమంత్రి అటవీ ప్రాంతానికి వెళ్లడం ఫస్ట్ టైమ్.. ఇంతమంది నక్సల్స్ ఒకేసారి లొంగిపోవడం కూడా ఇదే మొదటి సారి. దీనివెనుకున్న లక్ష్యం మహారాష్ట్ర నక్సల్ ముక్తి దిశగా అడుగులు వేయాలన్నదే. 

మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, 60 మంది మావోయిస్టులు... పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Embed widget