అన్వేషించండి

G20 Summit: జీ20 సమ్మిట్‌లో ఏఐ అవతార్, దేశాధినేతలకు స్వాగతం పలికేలా అభివృద్ధి

G20 Summit: జీ20 సదస్సులో వివిధ దేశాల అధినేతలకు ఆహ్వానం పలికేందుకు ప్రత్యేక ఏఐ అవతార్ ను అభివృద్ధి చేశారు.

G20 Summit: ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంగరంగ వైభవంగా నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు వచ్చే దేశాధినేతలు తిలకించేందుకు.. మదర్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన చూసేందుకు వచ్చే ప్రపంచ దేశ అగ్ర నాయకులను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఏఐతో అవతార్ ను అభివృద్ధి చేసింది కేంద్ర సర్కారు. 

వేద కాలం నుంచి ఆధునిక యుగం వరకు దేశ ప్రజాస్వామ్య సంస్కృతులను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు. ఆడియో రూపంలో, టెక్ట్స్ రూపంలో దీనిని ఏర్పాటు చేశారు. ఆడియో రూపంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్, మాండరీన్, ఇటాలియన్, కొరియన్, జపనీస్ సహా 16 ప్రపంచ భాషల్లో ఆడియోను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ను చూసేందుకు ప్రపంచ దేశాల అగ్రనేతలు, ఇతర ప్రతినిధులు రాగానే వారిని ఏఐ ఆధారిత అవతార్ ఆహ్వానం పలుకుతుంది. ఎగ్జిబిషన్ ప్రాముఖ్యత గురించి అతిథులకు ఈ అవతార్ వివరించి చెబుతుంది. వారికి ఏ భాష కావాలంటే ఆ భాషలో సవివరిస్తుంది.

Also Read: Telangana High Court: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

జీ20 సదస్సు జరగనున్న ప్రదేశానికి ఎదురుగా భారీ నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారీ ఏర్పాట్లపై మధ్య ఈ అతిపెద్ద నటరాజ విగ్రహం సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది.

28 అడుగుల భారీ నటరాజ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఈ విగ్రహాన్ని తమిళనాడులో ప్రత్యేకంగా రూపొందించి ఢిల్లీకి తెప్పించారు. ఈ అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని తమిళనాడు కుంభకోణం తాలూకా స్వామిమలైలోని దేవ సేనాపతి శిల్పకళాశాలలో తయారు చేశారు. దేవా. రాధాకృష్ణన్, దేవా.పి. కందన్, దేవా స్వామినాథన్ తమ సహోద్యోగులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి ఈ నటరాజ విగ్రహాన్ని రూపొందించారు. ఈ భారీ విగ్రహాన్ని తమిళనాడు నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గం ద్వారా తీసుకువచ్చారు. సుదీర్ఘమైన గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర వేల కిలోమీటర్లు ఈ విగ్రహాన్ని తరలించారు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీకి చేర్చారు. శిఖరాగ్ర సదస్సు జరిగే ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో ఈ 19 టన్నుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

ఈ నటరాజ విగ్రహాన్ని బంగారం, వెండి సహా 8 లోహాలతో తయారు చేశారు. ఈ విగ్రహం రూపకల్పన కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆరు నెలల ముందే ఆర్డర్ ఇచ్చింది. విగ్రహం మొత్తం ఎత్తు 22 అడుగులు కాగా.. దాని స్టాండ్ 6 అడుగుల ఎత్తు ఉంటుంది. 21 అడుగుల వెడల్పు ఉంటుంది. దాదాపు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP DesamKKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs: టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన ట్రంప్- 3 నెలలు వాయిదా- చైనాపై మాత్రం తగ్గేదేలే
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
AP, Telangana Weather Report: తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల వాసులకు బిగ్ అలర్ట్- హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
IPL 2025 GT VS RR Result Update: టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
టాప్ లేపిన గుజ‌రాత్.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన టైటాన్స్.. ఆక‌ట్టుకున్న‌ సుద‌ర్శ‌న్, ప్ర‌సిధ్.. హిట్ మెయ‌ర్ పోరాటం వృథా
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Embed widget