అన్వేషించండి

ఢిల్లీలో అందుబాటులోకి రానున్న మరో 400 ఎలక్ట్రిక్‌ బస్‌లు, G20 సమ్మిట్ ఎఫెక్ట్‌

G20 Summit 2023: G20 సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో కొత్తగా 400 ఎలక్ట్రిక్ బస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

G20 Summit 2023: 


జీ 20 సదస్సు..

G20 Summit ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రోడ్లు తళతళ మెరిసిపోతున్నాయి. అతిథులకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు అధికారులు సిద్ధవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కొత్తగా 400 విద్యుత్ బస్‌లను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ బస్‌లకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గహ్లోట్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కేంద్రం ప్రవేశపెట్టిన FAME స్కీమ్‌లో భాగంగా 400 ఎలక్ట్రిక్ బస్‌లు ఢిల్లీలో సర్వీస్‌లు అందిస్తున్నాయి. ఇప్పుడు వీటికి మరో 400 బస్‌లు తోడవనున్నాయి. Delhi Transport Corporationలో దాదాపు 1,500 వరకూ ఎలక్ట్రిక్ బస్‌లను నడుపుకునేందుకు అనుమతి లభించింది. ఇందులో 921 బస్‌లు ఫేమ్ స్కీమ్‌ ద్వారానే అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించి...క్రమంగా విద్యుత్ వాహనాల సంఖ్య పెంచాలన్నదే FAME II స్కీమ్ ఉద్దేశం. కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలాంటి నగరాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది కేంద్రం. ఢిల్లీ ప్రజారవాణాలో 80% మేర విద్యుత్ వాహనాలే అందుబాటులో ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే...G20 సదస్సు ఢిల్లీలోనే జరుగుతుండడం వల్ల వీలైనంత త్వరగా వీటిని నడపాలని చూస్తోంది. అందుకే...ఈ సమ్మిట్‌ కన్నా ముందుగానే వందలాది బస్‌లను ప్రారంభించనుంది. 

ముమ్మరంగా ఏర్పాట్లు..

G 20 సదస్సుకి ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులతో పాటు సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే సౌత్ ఢిల్లీలోని మున్సిపల్ పార్క్‌లో అతి పెద్ద థీమ్ లోగోతో పాటు జీ20లోని సభ్య దేశాల జాతీయ పతాకాలనూ ఏర్పాటు చేశారు. వీటికోసం ప్రత్యేకంగా 20 స్తంభాలు అరేంజ్ చేశారు. గ్రేటర్ కైలాశ్‌లో ఉన్న ఈ ప్రాంతంలోని పార్క్‌ని ఇలా అలంకరించారు. సదస్సుకి వచ్చే అతిథులు తమ ఆతిథ్యాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చూడడమే తమ ఉద్దేశమని స్థానిక ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. సెప్టెంబర్ 9-10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. ఢిల్లీలోని రోడ్లన్నీ అలంకరించారు. ఎక్కడా చెత్త కనబడకుండా క్లీన్ చేశారు. గోడలపై కొత్త పెయింట్స్ వేశారు. ఈ క్రమంలోనే పార్క్‌ని G 20 థీమ్‌తో అలంకరించారు. ప్రస్తుతం స్థానికులు ఈ పార్క్‌ని G 20 పార్క్‌గా పిలుస్తున్నారు.

"20 స్తంభాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కాంక్రీట్ మిక్స్‌తో పాటు వుడెన్ టెక్ట్స్‌చర్‌తో వీటిని తయారు చేశాం. ప్రతి పిల్లర్‌పైనా G 20 దేశాల్లోని ప్రతి ఒక్క దేశానికీ ఓ జెండా అమర్చాం. ఇద్దరు ఆర్టిస్ట్‌లతో పాటు పది మంది కూలీలు ఇందుకోసం శ్రమించారు. ఈ పార్క్ చరిత్రలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం."

- ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 

Also Read: మోదీపై యుద్ధం ప్రకటించిన I.N.D.I.A కూటమి, త్వరలోనే దేశవ్యాప్తంగా ర్యాలీలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget