By: ABP Desam | Updated at : 12 Apr 2023 10:33 AM (IST)
బటిండా కంటోన్మెంట్ లో కాల్పుల్లో నలుగురు సైనికులు మృతి
Bathinda Military Station: పంజాబ్ లోని బఠిండాలో ఉన్న ఆర్మీ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని మూసివేశారు. ఈ ఘటన తర్వాత కంటోన్మెంట్ లోకి ఎవరినీ అనుమతించడం లేదు. కంటోన్మెంట్ లో కాల్పులు జరిగాయని, అందులో నలుగురు సైనికులు మరణించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ రోజు తెల్లవారుజామున 4.35 గంటలకు బఠిండా మిలిటరీ స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురికి గాయాలైనట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేషన్ క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దింపి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సీల్ చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఉగ్రవాద ఘటన కాదు: ఆర్మీ
ఇది ఉగ్రవాద ఘటన కాదని పంజాబ్ సీనియర్ పోలీసు అధికారికి ఆర్మీ చెప్పినట్లు తెలుస్తోంది. 80 మీడియం రెజిమెంట్ ఆర్టిలరీ ఆఫీసర్స్ మెస్ లో కాల్పులు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఈ యూనిట్ లోని గార్డు రూమ్ నుంచి అసాల్ట్ రైఫిల్ కనిపించకుండా పోయింది. అక్కడే ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.
సైన్యం చెప్పిన సమాచారం ప్రకారం ఉగ్రవాద ముప్పు లేదని బఠిండా ఎస్ఎస్పీ గుల్నీత్ ఖురునా తెలిపారు. మిలిటరీ స్టేషన్ అధికారులు బాధితుల గుర్తింపును ఇంకా ధృవీకరించలేదని ఆయన చెప్పారు.
Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!
IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?
TCS Work From Office: ఆఫీస్కి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ - ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు