అన్వేషించండి

India - China Border Issue: గ్రేట్ ఇండియన్ ఆర్మీ, గల్వాన్ లోయలో భారత సైనికుల పోరాటంపై మంత్రి జై శంకర్ ప్రశంసలు

EAM Jaishankar: 2020లో లడఖ్ లోని గల్వాన్ లోయలో చైనా దాడుల సందర్భంగా మన సైనికులు అద్భుతంగా పోరాడారని, ధైర్యసాహసాలు ప్రదర్శించారని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కొనియాడారు. 

EAM S Jaishankar: చైనాతో ఇండియాకు కొన్ని చోట్ల సరిహద్దు సమస్యలున్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మంగళవారం లోక్ సభలో తెలిపారు. నిజానికి ఇరుదేశాల మధ్య వాస్తవ సరిహద్దు రేఖ (ఎల్ఏసీ) ఉందని, అయితే కొన్ని చోట్ల ఈ రేఖకు సంబంధించి ప్రాంతాలపై అభిప్రాయ బేధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక చర్చల ద్వారానే సరిహద్దు కు సంబంధించిన అంశాలను పరిష్కారం చేసుకుంటామని వెల్లడించారు. 
ఎల్ఏసీలో కొన్ని ప్రాంతాల సరిహద్దుకు సంబంధించి ఇరుపక్షాలలో కామన్ అవగాహన లేదని పేర్కొన్నారు. ఈక్రమంలో చైనాతో చర్చల ద్వారా దీనిపై పరిష్కారానికి  కృషి చేస్తామని వెల్లడించారు. మరోవైపు సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా రెండు దేశాల మధ్య రిలేషన్ష్ సాధారణంగా ఉండలేవని చైనాకు చెప్పినట్లు జై శంకర్ పునరుద్ఘాటించారు. వీటికి సంబంధించి తమకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందని, న్యాయపరమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఆ దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

అక్సాయ్ చిన్ ఆక్రమణ..
1962 యుద్ధం ముగిశాక లడఖ్ ప్రాంతంలోని అక్సాయ్ చిన్ లోని 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని వివరించారు. , ఇక మరో 5180 చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించిన దాయాది పాకిస్తాన్.. ఈ ప్రాంతాన్ని చైనాకు ధారదత్తం చేసిందని విదేశాంగ మంత్రి జై శంకర్ ఆరోపించారు. 

2020లో మన ఆర్మీ గొప్పగా పోరాడింది..
ఇక 2020లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా దళాలు ఆక్రమణకు పూనుకోగా, మన సైనిక దళాలు సమర్థంగా తిప్పికొట్టాయని జై శంకర్ ప్రశంసించారు. ఆ సమయంలో సవాలుతో కూడుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ సైన్యం గొప్పగా పోరాడిందన్నారు. అప్పటికే కోవిడ్ 19 ఒకవైపు, లాజిస్టిక్ సమస్యలు మరోవైపు ఇబ్బంది పెట్టినా మన సైనిక దళాలు ఏమాత్రం వెనుకంజ వేయకుండా, ప్రత్యర్థి దళాల దాడులను సమర్థంగా తిప్పికొట్టాయని కొనియాడారు. 

Also Read: Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కృషితో..
మరోవైపు చైనాతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ జరిపిన సంప్రదింపులు కూడా ఫలప్రదమయ్యాయని జై శంకర్ కొనియాడారు. చైనా రక్షణ మంత్రి డోంగ్ జున్ తో లావోస్ లో జరిగిన 11వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో  రాజనాథ్ సింగ్ చర్చించారు. ఆ చర్చల తర్వాత వివాదస్పద సరిహద్దు వద్ద రక్షణ దళాలను వెనక్కి రప్పించాలని తీర్మాణించాయి. దీంతో 2020కి ముందున్నట్లుగానే ప్రస్తుత పరిస్థితి నెలకొంది. 

ఇరుదేశాల సంయక్త పహారా..

తూర్పు లడఖ్ లోని డెంచోక్, డెస్పాంగ్ ప్రాంతాలలో వారానిక ఒకసారి రెండు దేశాలకు చెందిన సైన్యం కలిసి పహారా కాయాలని నవంబర్ లో ఒక అవగాహనకు వచ్చాయి. ఈ క్రమంలో నవంబరులో ఉమ్మడిగా ఈ కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతరం వారానికి ఒకసారి ఒక్కో దేశానికి చెందని సైనిక దళం పహారా కాయాలనే నిర్ణయానికి వచ్చాయి. రెండు దేశాలకు సంబంధించి పలు మంత్రిత్వ శాఖలు పలు దఫాలుగా చర్చలు జరపడంతో ప్రస్తుతానికి శాంతియుత వాతావరణం నెలకొంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget