By: ABP Desam | Updated at : 25 Jan 2023 06:56 PM (IST)
Edited By: jyothi
ఢిల్లీలో దారుణం - ఫోన్ ఇవ్వలేదని యువకుడిని 45 సార్లు పొడిచి చంపిన మైనర్లు!
Delhi Crime News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా కార్డ్స్ ఆడుకుంటున్న 18 ఏళ్ల బాలుడి దగ్గరకు వెళ్లిన ఇద్దరు బాలురు... ఫోన్ లాక్కోవడం మొదలు పెట్టారు. దీంతో సదరు యువకుడు ప్రతిఘటించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మైనర్లలో ఒక బాలుడు... తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి పొడవడం ప్రారంభించాడు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు... దాదాపు 45 సార్లు కడుపు, మెడ, చేతులు, కాళ్లపై దాడి చేసి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
దక్షిణ ఢిల్లీలోని భాటి మైన్స్లోని సంజయ్ కాలనీలో నివాసం ఉంటున్న 18 ఏళ్ల హర్ష్ కుమార్ కు చేతికి గాయమైంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అతడికి దెబ్బ తగలడంతో ఆరోజు కళాశాలకు వెళ్లేలేదు. ఉదయం నుంచి ఇంట్లో ఉన్న కుమార్... శనివారం మధ్యాహ్నం నూడుల్స్ కొనేందుకు బయటకు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. మైదాన్ గర్షి వద్దనున్న రాధాకృష్ణ దేవాయలం సమీపంలో తనతోటి స్నేహితులతో కలిసి హర్ష్ కుమార్ సరదాగా కార్డ్స్ ఆడుతున్నాడు. ఆ విషయం గుర్తించి ఇద్దరు బాలురు అక్కడకు వెళ్లారు. హర్ష్ కుమార్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో కుమార్ ప్రతిఘటించాడు.
తీవ్ర కోపోద్రిక్తుడైన ఓ బాలుడు ముందుగా తన వెంట తెచ్చుకున్న కత్తి తీసి.. కుమార్ పై దాడి చేయడం ప్రారంభించాడు. ముందుగా మెడపై పొడిచిన అతడు ఆపై కాళ్లు, చేతులు, కడుపు ఇలా శరీరమంతటా పొడిచాడు. దాదాపు 45 సార్లు పొడిచి హర్ష్ కుమార్ ను హత్య చేశాడు. ఈ ఘటనతో తీవ్రంగా భయపడిపోయిన హర్ష్ స్నేహితులు పారిపోయారు. హత్య అనంతరం నిందితులు హర్ష్ కుమార్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో.. హర్ష్ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఎంతకూ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇంతలోనే మైదాన్ గర్షి వద్ద ఓ మృతదేహం ఉందంటూ పలువురు స్థానికులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు హర్ష్ కుమార్ గా గుర్తించారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి చూపించారు. రక్తపుమడుగులో ఉన్న తమ కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గొంతు, కడుపుపై లోతైన గాయాలు, అనేక కత్తిపోట్లు ఉన్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు, అలాగే హర్ష్ కుమార్ తో ఆడుకున్న స్నేహితులను కూడా పోలీసులు గుర్తించారు.
వారిద్దరూ అదుపులోకి తీసుకున్నట్లు డీపీసీ చందన్ చౌదరి వివరించారు. విచారణలో కూడా నిందితులు హత్యా నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే నిందితుల వద్ద నుంచి హర్ష్ కుమార్ ఫోన్ తో పాటు సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హత్య చేసినప్పుడు నిందితుల బట్టలు, షూస్ రక్తంతో తడిచిపోయాయని వాటిని కూడా తాము స్వాధీనం చేసుకున్నట్లు పేర్కన్నారు.
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Certificates in DigiLocker: ఫేక్ సర్టిఫికేట్లకు కేంద్రం చెక్, యూనివర్సిటీలకు కీలక ఆదేశాలు జారీచేసిన యూజీసీ!
Jammu Kashmir Survey: పాకిస్థాన్లో కలిసే ప్రసక్తే లేదన్న కశ్మీరీలు,స్వతంత్రతే కావాలని ఓ సర్వేలో వెల్లడి
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ
Indian PM: భారత ప్రధాని విదేశాలలో పర్యటిస్తే ఎక్కడ బస చేస్తారో తెలుసా!
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి