అన్వేషించండి

Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు

Visa Fee Reductions : వీసా ఫీజుల తగ్గింపు గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగిస్తున్నట్టు భారతదేశంలోని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది.

Visa Fee Reductions : తగ్గించిన వీసా రుసుములను డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించినట్టు  భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయం చైనా సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. అదే సమయంలో, భారతదేశం - చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో పురోగతిని సూచిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రెండు దేశాలు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడానికి దౌత్య - సైనిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

విదేశీ ప్రయాణికులను ఆకర్షించేందుకు చైనా తెగ ప్రయత్నిస్తోంది. తమ దేశ సందర్శనను సులభతరం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన జారీ చేసింది. వీసా ఫీజు తగ్గింపులను డిసెంబర్ 31, 2025 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. 2024లోనే ఈ ధరలను తగ్గించగా.. ఇప్పుడు సింగిల్ ఎంట్రీకి రూ.2,900 ఉండగా, డబుల్ ఎంట్రీకి రూ.4,400 వసూలు చేస్తోంది. 6 నెలల కోసం తీసుకునే మల్టీపుల్ ఎంట్రీ వీసాకు రూ.5.900, ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాలనుకునే వారి కోసం మల్టీ ఎంట్రీ వీసా ఫీజును రూ.8,800గా నిర్ణయించింది. ఇక గ్రూప్ వీసా, అధికారిక గ్రూప్ వీసా కోసం ప్రతి దరఖాస్తుదారు రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : Cars Puncture: ఒకేసారి రహదారిపై 50 వాహనాలు పంక్చర్ - రాత్రివేళ గంటల పాటు ట్రాఫిక్ జామ్, అసలు కారణం ఏంటంటే?

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు భారత్ - చైనా ఇటీవల గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి కొనసాగనుంది. అలాగే ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇకనుంచి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పట్లో భారత రక్షణ శాఖ కూడా దీనిపై స్పందించింది. పరస్పర భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. చైనాతో అనేక సార్లు దౌత్యపరమైన చర్చలు జరిగిన తర్వాత ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది.    

న్యూ ఇయర్ సందర్భంగా సంచలనం సృష్టిస్తోన్న చైనా ప్రకటన 

కొత్త సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పిన్ దేశ ప్రజలకు సందేశమిచ్చాడు. ఈ సమయంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ ను చైనాలో కలపడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. తైవాన్ కూడా చైనాలో అంతర్భాగమేనన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొంతకాలం నుంచి తైవాన్ ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా నానా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే చాలా సార్లు జల, గగన తలాల్లో నియమాలను సైతం ఉల్లంఘించింది.

Also Read : Big Changes 2025: జనవరి 01 నుంచి జరిగే ఆరు పెద్ద మార్పులు - సగం లాభం, సగం నష్టం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Center statement on fuel issue: కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
కావాల్సినంత ఇంధనం ఉంది..కొరత రానే రాదు - పెట్రోల్ రష్‌పై కేంద్రం కీలక ప్రకటన
Solar AC vs Normal AC : సాధారణ ఏసీ vs సోలార్ ఏసీ.. ఏది బెస్ట్? ఖర్చు, లాభాలు ఇవే
సాధారణ ఏసీ vs సోలార్ ఏసీ.. ఏది బెస్ట్? ఖర్చు, లాభాలు ఇవే
LPG Gas Booking: గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారలేదు.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్ మారలేదు.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ
LPG Cylinder Booking Rules: మళ్లీ మారిన సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్.. ఎవరు ఎప్పుడు బుక్ చేయాలో తెలుసా
LPG సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్ మారాయా.. ఎవరు ఎప్పుడు బుక్ చేయాలో పూర్తి వివరాలివే

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో బంగ్లా మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Embed widget