అన్వేషించండి

Byju's: ప్రజలను, సిబ్బందినీ బైజూస్ మోసం చేస్తోంది- కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఓ ఉద్యోగి రిక్వస్ట్‌

Byju's: తనను రాజీనామా చేయాలని బైజూస్ సంస్థ ఒత్తిడి చేస్తోందంటూ ఓ ఉద్యోగిని లింక్డ్‌ఇన్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

Byju's: అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ ఇప్పుడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉవ్వెత్తున ఎగిసి ఎంతో మందికి, స్టార్టర్ నిపుణులకు, అంకుర సంస్థల అధినేతలకు ఆదర్శంగా నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండ్రోజుల క్రితం ఆ సంస్థ సీఈవో, బైజూస్ వ్యవస్థాపకుడు.. బైజూస్ రవీంద్రన్ గా పేరు సంపాదించుకున్న రవీంద్రన్.. తన కంపెనీ పతనంపై కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి కష్టం, కంటెంట్, ప్లానింగ్ తో 22 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగిన బైజూస్.. కొన్ని పరిపాలనాపరమైన తప్పుల వల్ల అథఃపాతాళానికి పడిపోయింది. కరోనా తర్వాత విద్యా సంస్థలన్నీ తెరచుకోవడంతో మొదలైన కష్టాలు.. రోజు రోజుకూ పెరిగి పెద్దవై కంపెనీని ముంచెత్తాయి. ఈ క్రమంలో కాస్ట్ కటింగ్ పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. అయితే తాజాగా ఓ ఉద్యోగిపై ఉన్నతాధికారులు రాజీనామా చేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న వ్యవహారంతో మరోసారి ఈ ఎడ్ టెక్ కంపెనీ వార్తల్లో నిలిచింది.

ఆకాంక్ష ఖేమ్కా గత ఒకటిన్నర సంవత్సరంగా బైజూస్ లో అకడమిక్ స్పెషలిస్టుగా పని చేస్తోంది. ఈ ఉద్యోగమే తన జీవనాధారం. కుటుంబాన్ని పోషించడం పూర్తిగా తన ఉద్యోగంపైనే ఆధారపడి నడుస్తోంది. ఇలాంటి సమయంలో తనను ఉద్యోగం నుంచి రాజీనామా చేయాలంటూ తన ఉన్నతోదోగ్యులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని తన లింక్డ్‌ఇన్‌ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేసింది. వేరియబుల్స్, లీవ్స్ ఎన్‌క్యాష్‌మెంట్‌ను కూడా చెల్లించలేదని, కానీ తక్షణమే రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. తన కుటుంబంలో తను మాత్రమే సంపాదిస్తున్నానని, తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని, తీర్చాల్సిన అప్పులు ఉన్నాయని, బైజూస్ సంస్థ తనకు జీతం ఇవ్వకపోతే ఎలా బతకాలంటూ కన్నీరు మున్నీరు అయింది. 

ఈ విషపూరిత పని సంస్కృతి నుంచి తమను ప్రభుత్వమే రక్షించాలని, తనతో పాటు ఇతర ఉద్యోగులకు కూడా సహాయం చేయాలని ఆ వీడియోలో అభ్యర్థిచింది. బైజూస్ సంస్థ ఉద్యోగులను, కస్టమర్లను అందరినీ మోసం చేస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. 

అష్టకష్టాలంటే ఇవే..

ఏళ్ల తరబడి కష్టం, కంటెంట్‌, ప్లానింగ్‌తో ఎవరెస్ట్‌ స్థాయికి ఎదిగిన బైజూస్, అక్కడి నుంచి పడిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కరోనా కాలంలో హైయెస్ట్ లెవల్‌కు వెళ్లి, తన పతనాన్ని అక్కడి నుంచే స్వహస్తాలతో రాసుకుంది. ఫారిన్‌ పెట్టుబడులు, లాభాలు వరదలా వచ్చి పడేసరికి, ఆ డబ్బును అక్రమంగా దాచుకోవడానికి బైజూస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ అడ్డదార్లు తొక్కిందని రూమర్లు ఉన్నాయి. దీంతో, ఈ ఏడాది ఏప్రిల్ చివరలో, బైజూస్‌ బెంగళూరు ఆఫీస్‌ మీద సెంట్రల్‌ గవర్నమెంట్‌ తనిఖీలు చేశారు. ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదు గానీ, అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయింది.

2022, 2023 ఆర్థిక సంవత్సరాల ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ను ఈ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కంపెనీ గవర్నెన్స్‌ సరిగా లేకపోవడం, పెట్టుబడులు పెట్టి డైరెక్టర్ల సీట్లలో కూర్చున్న వాళ్ల మాటలు పట్టించుకోకపోవడంతో బైజూస్‌ నుంచి ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ ప్రకటించడంలో బైజూస్ ఆలస్యం చేస్తోందనే కారణంతో, ఈ సంస్థ ఆడిటింగ్‌ కంపెనీ 'డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్', గత నెలలో తప్పుకుంది. బైజూస్‌ బోర్డ్‌లో మెంబర్లుగా ఉన్న పీక్ XV, ప్రోసస్ NV, చాన్-జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ ప్రతినిధులు కూడా అదే వారంలో బైజూస్‌ బోర్డ్‌కు రిజైన్‌ చేశారు. ఐదు లక్షల డాలర్లను బైజూస్‌ దాచి పెట్టిందని ఆరోపిస్తూ కేసులు కూడా పెట్టారు.

బైజూస్ అకౌంట్‌ బుక్స్‌ను క్షుణ్నంగా పరిశీలించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Corporate Affairs Ministry) ఇటీవల ఆర్డర్‌ పాస్‌ చేసినట్లు సమాచారం. ఆరు వారాల్లోగా రిపోర్ట్ సబ్మిట్‌ చేయాలని ఆదేశించినట్లు కూడా మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget