అన్వేషించండి

Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం

Jammu and Kashmir News: జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ముగ్గురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు దుర్మరణం.. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి వెళ్లి ప్రమాదం చోటు చేసుకుంది.

Jammu Kashmir bus accident: జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఒక బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్ల  మృత్యువాత పడ్డారు. మరో 32 మంది గాయపడగా.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

బుద్గాం జిల్లాలో బస్సు ప్రమాదం:

            ఎలక్షన్ డ్యూటీ కోసం 35 మందితో వెళ్తున్న జవాన్ల బస్సు.. సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో బ్రెల్ వాటర్‌హెయిల్‌ ప్రాంతంలో రోడ్డు మీద నుంచి స్లిప్‌ అయి లోయలోకి జారిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటలో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో 32 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బీఎస్‌ఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. వీళ్లని జమ్ము కశ్మీర్‌లో జరగనున్న సెకండ్ ఫేజ్ ఎలక్షన్‌ నిర్వహణలో సెక్యూరిటి కోసం ఈసీ తరలిస్తోంది.

జమ్ము కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత ఎన్నికలు:

            జమ్ము కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల సంఘం వాటిని మూడు దశల్లో చేపడుతోంది. 2109లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు సహా జమ్ము కశ్మిర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బుధవారం నాటి తొలి దశలో ఈ యూనియన్‌ టెరిటరీలోని 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్ము కశ్మీర్‌ను యూనియన్ టెరిటరీగా మార్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే కావడం విశేషం. దీనిలో మొదటి దశ సెప్టెంబర్ 18న పూర్తి కాగా.. రెండో దశ ఈ సెప్టెంబర్‌ 25న నిర్వహించనుంది. అక్టోబర్ 1న మూడో దశ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు ముందు అక్టోబర్ 4నే వెల్లడించాలని ఎన్నికల సంఘం భావించినప్పటికీ ఆ తర్వాత అక్టోబర్ 8న వెల్లడి కానున్నట్లు తెలిపింది. తొలి దశ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ అవాంతరాలు ఏమీ ఏర్పడలేదు. మొత్తం 24 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించగా 61 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో దశలో 26 స్థానాలకు, మూడో దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ , నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూటమిగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటుండగా.. భారతీయ జనతా పార్టీ, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్‌తో పాటు మరి కొన్ని పార్టీలు ఏ పార్టీలతో కలవకుండా నేరుగా బరిలో నిలిచాయి.సెప్టెంబర్ 25న రాజౌరీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పారామిలటరీ ఫోర్సెస్‌, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన కంపెనీలు రాజౌరీకి చేరుకుంటున్నాయి.

పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలతో విమర్శలు- ప్రతి విమర్శలతో వేడెక్కిన రెండో దశ ఎన్నికల ప్రచారం:

            జమ్ము కశ్మీర్ విషయంలో తమ ఆలోచన భారత్‌లోని కాంగ్రెస్ ఆలోచన ఒకటేనంటూ పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీపై భాజపా ఘాటు విమర్శలు ఎక్కుపెడుతోంది. పాకిస్తాన్‌- కాంగ్రెస్ ఒకే తాను ముక్కలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే తిరిగి జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్‌ కాన్ఫరెన్స్ చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం మౌనం వహిస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget