By: ABP Desam | Updated at : 31 Jan 2023 11:37 AM (IST)
మీడియాతో ప్రధాని మోదీ
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ బడ్జెట్ గురించి మాట్లాడారు. అస్థిర ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య, భారతదేశ బడ్జెట్ సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిర్మలా సీతారామన్ అన్ని ప్రయత్నాలు చేస్తారని తాను బలంగా నమ్ముతున్నానని మోదీ అన్నారు. ఈ బడ్జెట్ను ప్రపంచం మొత్తం చూస్తోందని చెప్పారు.
ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని మోదీ అన్నారు. ఆదివాసీలకు, మహిళలకు ఇచ్చే గౌరవం అని, మన దేశ ఆర్థిక మంత్రి కూడా మహిళే అని పార్లమెంటులో ప్రధాని అన్నారు. రేపు (ఫిబ్రవరి 1) ఆమె మరో బడ్జెట్ ను దేశం ముందు ప్రవేశపెట్టనున్నారని అన్నారు. ‘‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో, భారతదేశం మాత్రమే కాదు, యావత్ ప్రపంచం భారతదేశ బడ్జెట్ పై కన్నేసింది. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్ ను ముందుకు తీసుకువెళతాం. అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నాను’’ అని మోదీ అన్నారు.
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
Bhopal-New Delhi Vande Bharat: మరో వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని, ఈ సారి ఆ రాష్ట్రంలో
Sanjay Raut Death Threat: సంజయ్ రౌత్ హత్యా బెదిరింపుల కేసులో నిందితుడి అరెస్ట్, కొనసాగుతున్న విచారణ
Swedish National Arrested: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్తో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ చేసిన పోలీసులు
Emergency At Airport: విమానం టేకాఫ్ కాగానే ఢీకొట్టిన పక్షి, ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
PBKS Vs KKR: కోల్కతాకు వర్షం దెబ్బ - డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ లాజిక్ వేరే...