అన్వేషించండి

NRSలో నమోదు కాకుండా పౌరసత్వం లభిస్తే Assam CM పదవికి రాజీనామా, హిమంత శర్మ సంచలన వ్యాఖ్యలు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ  సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ సిటిజన్ షిప్ లో నమోదు కాని వ్యక్తులెవరికైనా...భారత పౌరసత్వం లిభిస్తే ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తానన్నారు. 

CAA Agitations : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ సిటిజన్ షిప్ (Nrc)లో నమోదు కాని వ్యక్తులెవరికైనా భారత పౌరసత్వం లిభిస్తే ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తానన్నారు. 

కేంద్రం సీఏఏ ప్రకటనలో అస్సాంలో ఆందోళనలు
పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించడంతో 16 పార్టీల కూటమైన అస్సాం యూవోఎఫ్‌ఏ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని... 16 పార్టీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సున్నితమైన ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు....చెక్‌పోస్టుల వద్ద అదనపు బలగాలను మోహరించారు. సీఏఏ చట్టం అమలుతో రాష్ట్రంలో లక్షల మంది ప్రవేశించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ హాట్ కామెంట్స్ చేశారు. 

ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేస్తానన్న హిమంత
శివసాగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.  సీఏఏ కొత్త చట్టమేమీ కాదన్న ఆయన, ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారు చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. సీఏఏ వ్యతిరేకుల మాటలు నిజమా ?  కాదా ? అన్న అంశాన్ని పోర్టల్‌లో ఉన్న డేటాతో తేలిపోతుందన్నారు. సీఏఏతో ఏదో జరిగిపోతుందన్న భయాలు వద్దని, రోడ్ల మీదకు రావడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. ఎన్‌ఆర్‌సీకి దరఖాస్తు చేయకుండా ఒక్కరికైనా కొత్త చట్టం కింద పౌరసత్వం లభిస్తే.. మొదట వ్యతిరేకించే వ్యక్తిని తానేనంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. తాను అస్సాం పుత్రుడినని, అక్రమంగా ఒక్కరికి భారత పౌరసత్వం లభించినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని శపథం చేశారు. సీఏఏ గతంలోనే రాష్ట్రంలో అమలులోకి వచ్చిందన్న హిమంత బిశ్వ శర్మ, పౌరసత్వం అవసరమైన వారంతా పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

సీఏఏను ఆపాలంటూ సుప్రీంకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ 
ఎన్నికల ముందు ఓట్లు చీల్చడానికి సీఏఏను అమలు చేస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు సీఏఏపై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ మండిపడింది. సీఏఏ అమలును వెంటనే నిలిపివేయాలని...సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2019లో సీఏఏ అమలును సవాలు చేస్తూ ఐయూఎంఎల్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడంతో ఆ చట్టం అమల్లోకి రాదని అప్పట్లో కేంద్రం కోర్టుకు హామీ ఇచ్చింది. తాజాగా నిబంధనలు నోటిఫై చేయడంతో...సీఏఏ వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. సీఏఏ రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు...అమలుపై స్టే విధించాలంటూ ఐయుఎంఎల్ పిటిషన్ లో ప్రస్తావించింది.

ముస్లిమేతరులకు భారత పౌరసత్వం
మయన్మార్, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేలా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం 2014 డిసెంబర్‌ 31కి ముందు ఈ మూడు దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం కల్పిస్తారు. ప్రసాదిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget