అన్వేషించండి

EPFO : ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌ కు మీరు అర్హులేనా ? ఇలా చెక్ చేసుకోండి !

ఈపీఎఫ్‌వో అధిక పెన్షన్‌కు మీరు అర్హులేనా ? ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా ?

 

EPFO :   ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ కింద అధిక పెన్షన్‌ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని  ఈపీఎఫ్‌ఓ  విడుదల చేసింది.  2014 సెప్టెంబర్‌ 1నాటికి సర్వీసులో ఉన్నవారు, అటు తర్వాత సర్వీసులో కొనసాగుతున్నవారికి అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన 4 నెలల గడువు మరో రెండు వారాల్లో ముగిసిపోతున్నది. ఈ తరుణంలో హడావుడిగా ఉద్యోగులు, యాజమాన్యాలు అనుసరించాల్సిన విధివిధానాలను ఈపీఎఫ్‌ఓ జారీచేసింది.

ఈపీఎఫ్ఓ  అధిక పెన్షన్‌ పొందడానికి ఇవీ రూల్స్ ! 

 
ఈపీఎస్‌కు 2014లో చేసిన సవరణల మేరకు పెన్షనబుల్‌ వేతన పరిమితిని నెలకు రూ. 6,500 నుంచి రూ. 15,000 కు పెంచింది. ఈ పరిమితికి లోబడి అందులో 12 శాతం శాతాన్ని పలు యాజమాన్యాలు పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌గా ఉద్యోగుల నుంచి  జమ చేస్తున్నారు. అంతే మొత్తం యాజమాన్యం సమకూరుస్తున్నది. యాజమాన్యం చెల్లించిన దానిలో 8.33 శాతం ఈపీఎస్‌కు మళ్లిస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు  బేసిక్‌+డీఏ పై ఉద్యోగుల నుంచి డిడెక్ట్‌ చేస్తూ, అంత మొత్తాన్ని అవి సమకూరుస్తున్నాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ? 

ఉద్యోగులు, వారి యాజమాన్యాలు ఉమ్మడిగా అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. ఇందుకు సంబంధించి ఒక ఆన్‌లైన్‌ సదుపాయాన్ని కల్పించారు.  ఈ యూఆర్‌ఎల్‌తో ఉద్యోగులు డిజిటల్‌గా లాగిన్‌ అయ్యి, దరఖాస్తును రిజిష్టర్‌ చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు రసీదు నంబరును కేటాయిస్తారు.ఉద్యోగి సమర్పించిన దరఖాస్తు యజమాని లాగిన్‌లోకి వెళుతుంది. దానిని యజమాని డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా ధృవీకరించడం తప్పనిసరి. ఈ విధంగా పీఎఫ్‌ కమిషనర్‌ నిర్దేశించిన ఫారంలో అధిక పెన్షన్‌ కోరుతూ ఉద్యోగులు వారి యాజమానితో కలిసి ఉమ్మడిగా దరఖాస్తు చేయాలి. జాయింట్‌ డిక్లరేషన్‌ తదితర డాక్యుమెంట్లను జతచేయాలి.  ప్రాంతీయ ప్రావిడెంట్‌ కార్యాలయం అధికారి దరఖాస్తులోని వాస్తవ వేతనంపై అధిక పెన్షన్‌ ఉమ్మడి ఆప్షన్‌ను పరిశీలించి నిర్ణయాన్ని దరఖాస్తుదారుకు ఈమెయిల్‌/పోస్ట్‌, తదుపరి ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపిస్తారు. ఉమ్మడి ఆప్షన్‌ ఫారం సమర్పించిన తర్వాత దరఖాస్తుదారు ఏమైనా ఫిర్యాదు చేయదలిస్తే ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ (గ్రీవియెన్స్‌ పోర్టల్‌)లో రిజిష్టర్‌ చేసుకోవచ్చు.అర్హమైన చందాదారులకు/ఉద్యోగులకు అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను అందించాలంటూ ఈపీఎఫ్‌ఓ తన ఫీల్డ్‌ ఆఫీసర్లను అదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు కారణంగా మరికొంత మందికి అవకాశం 

పెన్షన్‌బుల్‌ వేతన పరిమితిని మించి ఉన్న వాస్తవ వేతనంలో ఈపీఎస్‌కు 8.33 శాతం చెల్లించే అవకాశాన్ని 2014 స్కీమ్‌ కల్పించి, అధిక పెన్షన్‌ ఆప్షన్‌ ఎంచుకోవచ్చని సూచించింది. 2014 సెప్టెంబర్‌ 1కి ముందు పదవీ విరమణ చేసిన వారు, వాస్తవ జీతంపై పీఎఫ్‌ డిడెక్ట్‌ అవుతున్నవారికి  అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను ఈపీఎఫ్‌వో అనుమతించలేదు. గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పు మేరకు 2014 సెప్టెంబర్‌ 1 ముందు వాస్తవ జీతంపై డిడెక్షన్‌ జరుగుతున్నవారికి , అటు తర్వాత సర్వీసు కొనసాగుతున్నవారికి అధిక పెన్షన్‌ ఎంచుకునే అవకాశం కల్పించారు. వీరికి కేటగిరి 1, కేటగిరి 2గా పిలుస్తున్నారు. 

అధిక పెన్షన్‌ను ఎంచుకోని క్యాటగిరి 2 ఉద్యోగులకు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇప్పుడు ఎంచుకునే అవకాశం లభించింది. 2014 సెప్టెంబర్‌ 1 నాటికి, అటుపైనా సర్వీసులో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఎటువంటి ఆప్షన్‌నూ ఎంచుకోకుండా 2014 సెప్టెంబర్‌ 1కి ముందే పదవీ విరమణ చేసిన వారికి సుప్రీం తీర్పు వర్తించదు. క్యాటగిరి 1 ఉద్యోగులు అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే మార్గదర్శకాలను 2022 డిసెంబర్‌లోనే ఈపీఎఫ్‌ఓ జారీచేసింది. క్యాటగిరీ 2 ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ తాజాగా సర్క్యులర్‌ విడుదల చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget