అన్వేషించండి

Social Media Policy: దేశ వ్యతిరేక కంటెంట్ పోస్ట్ చేస్తే బ్లాక్! కఠిన చర్యలు: త్వరలో కేంద్రం కొత్త పాలసీ

ప్రభుత్వం దేశ వ్యతిరేక వీడియోలు, పోస్టులు షేర్ చేసే వారిపై చర్యలు తీసుకోనుంది. దీని కోసం హోం మంత్రిత్వ శాఖ త్వరలో ఒక విధానం తీసుకురానుంది.

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో సంఘ విద్రోహ శక్తులు, దేశానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇకనుంచి సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలు, లేదా విషయాలను పోస్ట్ చేసే వారు ఇకపై తప్పించుకోలేరు. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇలాంటి కంటెంట్ ను అడ్డుకునేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసే సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తారు. అదే విధంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

పహల్గాంలో ఉగ్రదాడి తరువాత కేంద్రం అప్రమత్తమైంది. మన మధ్యే ఉంటూ దేశానికి నష్టం కలిగించే వారిపై ఫోకస్ చేస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాతో పాటు అనేక వెబ్‌సైట్‌లలో టెక్ట్స్, వీడియో కంటెంట్ అప్‌లోడ్ అవుతుందని కేంద్ర హోంశాఖ గుర్తించింది.  ఇలాంటి పనులు చేసే వారిపై త్వరలో చర్యలు తప్పవని తెలుస్తోంది. సోషల్ మీడియాకు సంబంధించి హోంశాఖ త్వరలో కొత్త పాలసీ  రూపొందిస్తోంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, హోంశాఖ ఉన్నతాధికారులు పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాన్ని తెలిపారు.

నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు

దేశ వ్యతిరేక వ్యక్తులపై సోషల్ మీడియాలో నిఘా ఉంచడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ కమిటీకి సమాచారం అందించారు. అలాంటి వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఖలిస్థాన్ వేర్పాటువాద ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూతో సహా చాలా మంది దేశ వ్యతిరేక వ్యక్తులు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు మరియు వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కొత్త విధానం వచ్చిన తర్వాత, అలాంటి వ్యక్తులపై అదుపు చేయవచ్చు.

సోషల్ మీడియా కంపెనీలతో చర్చలు

అమెరికా ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో కూడా చర్చలు జరుపుతోంది. సోషల్ మీడియా కంపెనీలు తమ స్థాయిలో నిఘా ఉంచాలని, దేశానికి వ్యతిరేక విషయాలను, విధ్వేషం చిమ్మేలా వారి ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేయకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సిబిఐ, ఎన్‌ఐఏ, రాష్ట్ర పోలీసులు, అంతర్గత భద్రతకు సంబంధించిన ఇతర ఏజెన్సీలు భారత్ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలను అడ్డుకునేందుకు అప్రమత్తం అయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా, మతాల మధ్య విధ్వేషం చిమ్మేలా కంటెంట్ పోస్ట్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడంతో పాటు వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటారు. 

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి నాశనం చేశాయి భారత బలగాలు. అదే సమయంలో సోషల్ మీడియాలో అనేక దేశ వ్యతిరేక పోస్టులను కేంద్రం గుర్తించింది. పలు రాష్ట్రాల్లో యూట్యూబర్లను, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను అరెస్ట్ చేసి ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. కొందరు యూట్యూబర్లు పాక్ నుంచి డబ్బు తీసుకుని వారికి అనుకూల సమాచారం, దేశానికి సంబంధించి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. వారికి పాక్ తో ఉన్న లింకులపై దర్యాప్తు కొనసాగుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Youtube Down: అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
Tamilnadu Politics: ప్రజాకర్షక నేత లేకపోయినా పవర్ తగ్గని అన్నాడీఎంకే - జయలలిత మ్యాజిక్ ఇంకా పని చేస్తోందా?
ప్రజాకర్షక నేత లేకపోయినా పవర్ తగ్గని అన్నాడీఎంకే - జయలలిత మ్యాజిక్ ఇంకా పని చేస్తోందా?
PM Modi Interview: గ్లోబల్ AI సూపర్ పవర్స్‌లో భారత్ టాప్ త్రీలో ఉండాలి - 2047కి ప్రధాని మోదీ టార్గెట్ - ఏఎన్‌ఐ ఇంటర్యూ పూర్తి వివరాలు
గ్లోబల్ AI సూపర్ పవర్స్‌లో భారత్ టాప్ త్రీలో ఉండాలి - 2047కి ప్రధాని మోదీ టార్గెట్ - ఏఎన్‌ఐ ఇంటర్యూ పూర్తి వివరాలు
AI Summit 2026: డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?

వీడియోలు

Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: వచ్చే వారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాలవర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
వచ్చే వారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాలవర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
Youtube Down: అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత
నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
IAS Sri Lakshmi: జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
Pakistan Vs Namibia: నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. నమీబియా చేతిలో ఓడితే టోర్నీ నుంచి ఔట్
నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. నమీబియా చేతిలో ఓడితే టోర్నీ నుంచి ఔట్
Bajaj Pulsar N160 EMI: 7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
Embed widget