అన్వేషించండి

Tamilnadu News: AIADMK లో వీడిన ఉత్కంఠ, పళనికే పార్టీ పగ్గాలు - కౌన్సిల్ మీటింగ్‌‌లో మరో కీలక నిర్ణయం

AIADMK: తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకొనేందుకు చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను కూడా రద్దు చేశారు.

తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడింది. కొద్ది రోజులుగా ఈ పార్టీలో ఓ పన్నీర్ సెల్వం - ఎడప్పాడి పళనిస్వామి మధ్య నాయకత్వ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకొనేందుకు చేసిన తీర్మానానికి కూడా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను కూడా రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా ఆమోదం తెలిపారు. మొత్తం ఈ సమావేశంలో పళనిస్వామి వర్గం ప్రవేశపెట్టిన 16 తీర్మానాలకు ఆమోదం లభించింది. త్వరలోనే కొత్తగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని తీసుకొచ్చి అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.

ఈ జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహణపై ముందు నుంచి ఉత్కంఠ నెలకొని ఉంది. చెన్నైలో నేడు (జూన్ 11) నిర్వహించతలపెట్టిన జనరల్ కౌన్సిల్ సమావేశానికి మద్రాస్ హైకోర్టు ఉదయం 9 గంటలకే అనుమతి ఇచ్చింది. ఇది జరిగిన కాసేపటికే సమావేశం జరిగింది. పార్టీలో కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ పదవులను రద్దు చేసి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు సోమవారం చెన్నైలో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశాన్ని నిర్వహించవద్దంటూ ఓ పన్నీర్ సెల్వం వర్గం హైకోర్టును ఆశ్రయించింది. 

ఓ పన్నీర్ సెల్వమ్, పార్టీ జనరల్ కౌన్సిల్ మెంబర్ పి.వైరముత్తు అలియాస్ అమ్మన్ వైరముత్తు, జస్టిస్ క్రిష్ణన్ రామసామి తదితరులు జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించవద్దంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను పార్టీకి కో ఆర్డినేటర్ గా కొనసాగుతున్నానని, 2021 డిసెంబరు 6 న తాను ఏకపక్షంగా ఎన్నికయ్యానని, ఐదేళ్ల తర్వాతే తన పదవీకాలం ముగుస్తుందని పన్నీర్‌సెల్వం తన సివిల్ పిటిషన్ తో పాటు దరఖాస్తును దాఖలు చేశారు. జాయింట్ కోఆర్డినేటర్ ఎడప్పాడి కె పళనిస్వామితో పాటు ఆ సమయంలో ఓ పన్నీర్ సెల్వం ఈ పదవిని చేపట్టారు. అయితే, పార్టీలో ఇలా ద్వంద్వ నాయకత్వం ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందనే ఉద్దేశంతో కో ఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పరదవులను రద్దు చేసి, ప్రధాన కార్యదర్శి పదవిని తిరిగి ఎన్నుకొని ఏక నాయకత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నాయకత్వం కోసమే ఈపీఎస్ - ఓపీఎస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొని ఉంది.

తారస్థాయికి అంతర్గత పోరు
ఆ పదవులు రద్దు చేసేందుకు జూన్ 23న జరగాల్సిన జనరల్ కౌన్సిల్ సమావేశం ఆ రోజు ఉదయం 4:40 గంటలకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు కారణంగా జరగలేదు. ఆ ఉత్తర్వును తర్వాత సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఓ పన్నీర్‌సెల్వం వర్గం ప్రత్యేకంగా జూలై 11న నిర్వహించే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఆపాలని తాజాగా సివిల్ పిటిషన్ ను దాఖలు చేసింది. తాజాగా కోర్టు పన్నీర్ సెల్వంకు షాక్ ఇస్తూ పిటిషన్ ను తోసిపుచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget