(Source: ECI | ABP NEWS)
Droupdi Murmu: రాష్ట్రపతి ముర్ముకు తప్పిన ప్రమాదం, ల్యాండింగ్ సమయంలో కుంగిన హెలిప్యాడ్
Droupdi Murmu Kerala Tour: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన కోసం కేరళకు వస్తున్నారు. మంగళవారం నుండి ప్రారంభం, తిరువనంతపురంలో భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు.

Droupdi Murmu Helicopter Incident: తిరువనంతపురం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. కేరళలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారిగా హెలీప్యాడ్ కుంగిపోయింది. రాష్ట్రపతి శబరిమల ఆలయానికి వెళ్తుండగా ఘటన జరిగింది. రాష్ట్రపతి ముర్ము సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఆమె నాలుగు రోజులపాటు కేరళలో పర్యటిస్తున్నారని తెలిసిందే.
ప్రమదం స్టేడియంలో ఘటన
నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (అక్టోబర్ 21న) సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. ఈ క్రమంలో ముర్ము బుధవారం ఉదయం పథనంతిట్టకు వెళ్లారు. ప్రమదం ఏరియాలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాష్ట్రపతి ముర్ము స్పెషల్ చాపర్ ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారిగా హెలీప్యాడ్ కుంగిపోయింది. హెలికాప్టర్ వీల్ మట్టిలో ఇరుక్కుపోగా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రంగంలోకి దిగరు. హెలికాప్టర్ మరీ వంగిపోకుండా, దాదాపు 20 మంది అక్కడికి చేరుకుని రాష్ట్రపతి ముర్మును హెలికాప్టర్ నుంచి ఆమెను కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలిప్యాడ్ కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ ఇంకా తడి ఆరలేదని, దాంతో హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ కుంగిపోయిందని అధికారులు తెలిపారు.
#WATCH | Kerala: A portion of the helipad tarmac sank in after a chopper carrying President Droupdi Murmu landed at Pramadam Stadium. Police and fire department personnel deployed at the spot physically pushed the helicopter out of the sunken spot. pic.twitter.com/QDmf28PqIb
— ANI (@ANI) October 22, 2025
నాలుగు రోజుల కేరళ పర్యటనలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజులపాటు కేరళలో పర్యటిస్తున్నారు. ముర్ము పర్యటన కోసం అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాష్ట్రపతి ముర్ము తిరువనంతపురం విమానాశ్రయం నుండి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి నగరానికి చేరుకున్నారు. బుధవారం పథనంతిట్ట జిల్లాలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. స్వామివారి దర్శనం, హారతి కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారని ఒక పత్రికా ప్రకటనలో నిన్న అధికారులు తెలిపారు.






















