అన్వేషించండి

Zika virus: ఏడేళ్ల బాలికకు పాజిటివ్- దేశంలో మరోసారి జికా వైరస్ టెన్షన్!

ఓ వైపు కరోనాతో ప్రజలు సతమతమవుతుంటే, మరోవైపు కొత్తగా జికా వైరస్ కేసు వెలుగు చూసింది. మహారాష్ట్రకు చెందిన ఏడేళ్ల బాలికకు పాజిటివ్ గా తేలింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అసలే విపరీతమైన వర్షాలు.. వాతావరణ మార్పుల కారణంగా అనేక అనారోగ్యాల సమస్యల బారిన పడుతూ ప్రజలు ఆగమైపోతున్నారు. ఇది చాలదన్నట్లు కరోనా. దేశంలో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన ఓ వైపు ఉండగానే మరో భయం దేశ ప్రజలను వెంటాడుతోంది. కొత్తగా జికా వైరస్ కేసు వెలుగు చూసింది. ఈ వార్త విన్న ప్రతీ ఒక్కరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలోని పాల్ ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్ గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని తలసరి గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని తెలిపారు.

రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా జికా వైరస్ కేసు గతేడాది పుణెలో నమోదైందని.. రెండో కేస్‌ ఇదేనని వైద్య అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున.. ఆ తర్వాత దోమలు, ఫంగస్ వంటిసి పెరిగి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వీటన్నిటిని తప్పించుకోవాలంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

జికా వైరస్ అంటే ఏంటి?

జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ... ఇప్పటి వరకు దీనకి మందు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్ సోకడం వల్ల కొందరిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు ఈ జికా వైరస్ సోకినట్లు అయితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టబోయే శిశువు మెదడు సరిగా అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. 1947 ప్రాంతంలో ఈ వైరస్ అడువల్లో ఉండే కోతుల్లో కనిపించింది. ఆ తర్వాత అంటే 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో తమిళనాడు, అహ్మదబాద్ లలో ఈ కేసులు నమోదైనట్లు తేలింది.

ఈ వైరస్ అంత ప్రమాదకరమా..?

గత మూడేళ్లుగా కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా తీవ్రత తగ్గిందని సంబుర పడుతున్నారు. ఈ క్రమంలోనే పాఠషాలలు, కళాశాలల తెరిచి.. అన్ని కార్యకలాపాలను సాగిస్తున్నారు. కానీ కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇది చాలదన్నట్లు తాజాగా మహారాష్ట్రలో జికి వైరస్ కేసు వెలుగు చూడడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

అయితే దోమ వల్ల జికా వైరస్ సోకుతున్నందును.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో, ఇంటి బయట దోమలు నిల్వకుండా తరచుగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని వివరిస్తున్నారు. ఏదైనా జ్వరం, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏం కాదులే అని ఇంట్లోనే ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దోమలను దరి చేరనీయకుండా మీరు తీసుకునే జాగ్రత్తలే మీకు జికా వైరస్ సోకకుండా చేస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అసలే వర్షాకాలం ఆపై వ్యాధులు, కొత్త కొత్త వైరస్ లు.. జాగ్రత్త సుమీ!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget