అన్వేషించండి

బిహార్‌లో పట్టాలు తప్పిన నార్త్‌ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌- నలుగురు మృతి- 70 మందికిపైగా గాయాలు

బిహార్‌లోని బక్సర్ జిల్లాలో నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 70 మందికిపైగా గాయపడ్డారు.

బిహార్‌లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి వేళ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. 

ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ లో బయల్దేరిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌ వెళ్తోంది. రాత్రి 9:53 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు ఏసీ 3 టైర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో నాలుగు కోచ్‌లు ఎగిరి పడ్డాయి. 

"రైలు నంబర్ 12506 (ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్య వరకు) రఘునాథ్‌పూర్ స్టేషన్ ప్రధాన లైన్ గుండా వెళుతోంది. ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి" అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

23 కోచ్‌ల ఈ రైలు బుధవారం ఉదయం 7:40 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్యకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారని బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మనీష్ కుమార్ తెలిపారు. 70 మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారని రైల్వే పోలీసు ఫోర్స్ అధికారి తెలిపారు. తీవ్ర గాయాలపాలైన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు, అంబులెన్స్‌లు, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఢిల్లీ, దిబ్రూగఢ్ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా కనీసం 21 రైళ్లు దారి మళ్లించారు. కాశీ పాట్నా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (15125), పాట్నా కాశీ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (15126) రద్దు చేసినట్టు తూర్పు మధ్య రైల్వే జోన్ ప్రకటించింది. 

స్థానికులు మాట్లాడుతూ"రైలు సాధారణ వేగంతో నడుస్తోది కానీ అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. రైలు నుంచి పొగలు వచ్చాయి, ఏం జరిగిందో చూడటానికి పరుగెత్తాము. రైలు పట్టాలు తప్పినట్టు గుర్తించాం. AC కోచ్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి."

తరలింపు, సహాయక చర్యలు పూర్తయ్యాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారికి సంతాపం తెలిపిన ఆయన, రైలు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామన్నారు. పట్టాల పునరుద్ధరణపై అధికారులు దృష్టి పెట్టారు. మిగిలిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 

విపత్తు నిర్వహణ విభాగం, బక్సర్, భోజ్‌పూర్ ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. వీలైనంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ CPRO బీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, రైలు బక్సర్ స్టేషన్ నుంచి బయలుదేరి అరగంటకే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. 
పాట్నా జంక్షన్ (PBE)- 9771449971
దానాపూర్ (DNR)- 8905697493
అరా- 8306182542
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్- 9794849461, 8081206628

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
Rupali Chakankar and Ashok Kharat: కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget