![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
జమ్మూకశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, నలుగురు జవాన్లు వీరమరణం
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు.
![జమ్మూకశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, నలుగురు జవాన్లు వీరమరణం 3 Soldiers Killed In J&K, Action After Army Truck Ambushed By Terrorists జమ్మూకశ్మీర్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు, నలుగురు జవాన్లు వీరమరణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/21/7473b43784ff203841796c4654d01f711703170835889840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Terror Attack In Jammu Kashmir : జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జవాన్లు (Army) ప్రయాణిస్తున్న వాహనాలపై టెర్రరిస్టులు (Terrorists) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అక్కడికక్కడే వీరమరణం పొందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ వేట కొనసాగిస్తోంది. మూడు రోజులుగా జవాన్లు...అడవులను జల్లెడ పడుతున్నారు. రాజౌరి నుంచి సురన్ కోటే వైపు జవాన్లు వాహనాల్లో వెళ్తుండగా, భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)