అన్వేషించండి

Mexico Bus Accident: మెక్సికోలో ఘోర ప్రమాదం- 18 మంది మృతి- బస్సులో ఆరుగురు భారతీయులు

Mexico Bus Accident: పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి హైవే పై నుంచి 50 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది.


Mexico Bus Accident: పశ్చిమ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి హైవే పై నుంచి 50 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో 18మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఎలైట్ ప్యాసింజర్ లైన్‌‌కు చెందిన బస్సు రాజధాని టెపిక్‌కు కొంత దూరంలో హైవేపై బర్రాంకా బ్లాంకా సమీపంలో టిజువానా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 40 మంది ప్రయాణికుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నారు. అయితే మృతుల వివరాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మృతుల్లో భారతీయులు ఉన్నారా లేదో తెలియాల్సి ఉంది. 

నయారిత్ రాష్ట్ర భద్రత, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. టెపిక్‌కు కొంత దూరంలో హైవేపై బర్రాంకా బ్లాంకా సమీపంలో 40 మంది ప్రయాణికులతో టిజువానా వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి హైవే పై నుంచి 50 మీటర్ల లోతున్న లోయలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ఇందులో 18 మంది మరణించినట్లు చెప్పారు. మృతుల్లో 14 మంది పెద్దలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మరో 22 మంది ప్రయాణికులు గాయపడినట్లు వెల్లడించారు. గాయపడిన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.  లోయ దాదాపు 50 మీటర్లు (164 అడుగులు) లోతు ఉండడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని వివరించారు.  ప్రమాదానికి కారణాలు స్పష్టంగా తెలియదన్నారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

అంతకుముందు గురువారం నయారిట్ సివిల్ ప్రొటెక్షన్, అగ్నిమాపక సిబ్బంది హైవేపై అంబులెన్స్‌లు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద బాధితులను లోయ నుంచి బయటకు తీసుకొచ్చారు. అంబులెన్స్‌ల్లో ఆస్సత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ఫొటలోను అధికారుల విడుదల చేశారు. ప్రమాదం జరిగిన బస్సులో ఆరుగురు భారతీయులు ఉన్నారని వారి వివరాలు తెలియాల్సి ఉందని నయారిత్ అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ప్రమాదంపై బస్ కంపెనీ మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ స్పందించలేదు. 

ప్రమాదానికి కారణమని  డ్రైవర్‌ అతివేగమే అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి.  గత నెలలో దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 29 మంది మరణించారు. ఫిబ్రవరిలో వలసదారులను దక్షిణ అమెరికా నుంచి మధ్య అమెరికా తరలిస్తుండగా మెక్సికోలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సైతం 17 మంది మరణించారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget