అన్వేషించండి

Sabrimala Temple: శబరిమలలో విషాదం, అయ్యప్ప ఆలయంలో ఆగిన చిన్నారి గుండె

Sabarimala News: శబరిమలలో విషాద ఘటన జరిగింది. అయ్యప్ప స్వామి దర్శానికి వెళ్లి తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలిక శనివారం మృతి చెందింది. 

Girl Died In Sabarimala: శబరిమలలో విషాద ఘటన జరిగింది. అయ్యప్ప స్వామి దర్శానికి వెళ్లి తమిళనాడుకు చెందిన 11 ఏళ్ల బాలిక శనివారం మృతి చెందింది. కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న బాలిక ఇటీవల స్వామి దర్శనం కోసం వెళ్లింది. సుదీర్ఘ సమయం పాటు యాత్రికుల రద్దీ మధ్య క్యూలో కుప్పకూలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.  

శబరిమల ఆలయానికి ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. యాత్రికులు స్వామి దర్శానానికి 18 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది భక్తులు స్వామి వారిని వేగంగా దర్శించుకోవడం కోసం క్యూలైన్లలో ఏర్పాుట చేసిన బారికేడ్లను దూకడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. భక్తుల మధ్య తోపులాట జరిగింది. పెరుగుతున్న రద్దీ, ఆందోళనలపై స్పందించిన కేరళ దేవదాయశాఖ మంత్రి రాధాకృష్ణన్, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు సీఎస్ ప్రశాంత్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 10,000 తగ్గించారు. అంతకు ముందు రోజుకు 90,000 వేలు ఉండగా దానిని 80,000కు కుదించారు. భక్తులకు భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సన్నిధానం వద్ద ప్రత్యేక రెస్క్యూ అంబులెన్స్ సేవ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల మధ్య ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణ వైద్య సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

దర్శన సమయం పెంపు
శబరిమలలోని అయ్యప్ప క్షేత్రానికి భక్తుల రద్దీ పెరగడంతో దర్శన సమయాలను గంటపాటు పెంచుతూ ట్రావెన్‌కోర్ ఆదివారం నిర్ణయం తీసుకుంది. మాములూగా రెండో దర్శన సమయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. దానిని మధ్యాహ్నం 3 నుంచి 11 గంటల వరకు సవరించాలని బోర్డు నిర్ణయించినట్లు జిల్లా పరిపాలన అధికారి తెలిపారు. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నట్లు అధికారి తెలిపారు.

ప్రతిపక్షాల ఫైర్
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు సరిగా లేవని, భక్తులు దర్శనం కోసం 15 నుంచి 20 గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ ఆరోపించారు. భక్తులకు నీరు కూడా అందించడం లేదని ఆరోపించారు. భక్తులకు సహాయం చేయడానికి శబరిమల వద్ద తగినంత మంది పోలీసులను మోహరించడం లేదని, యాత్రికుల ఏర్పాట్లకు సంబంధించి కేరళ హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదన్నారు.

అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో లేవని సతీషన్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణ చర్యలు తీసుకోకుంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. దర్శనం కోసం 10-12 గంటలకు పైగా క్యూలైన్లలో నిల్చున్నట్లు పలువురు భక్తులు టీవీ ఛానళ్లలో ఫిర్యాదు చేయడం కనిపించింది. శబరిమలకు వెళ్లే మార్గంలో కూడా యాత్రికులు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నారు. 

శబరిమల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఐజీ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ.. రోజుకు 75,000 మంది భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని ట్రావెన్స్ కోర్ దేవస్థానం బోర్డును అభ్యర్థించారు. ప్రస్తుత మూడవ దశ తీర్థయాత్రలో ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా 90,000 బుకింగ్‌లు, స్పాట్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తుల సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. ఈసారి ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని, ఇవి భక్తులను పతినెట్టంపాడి (18 దైవిక మెట్లు) త్వరగా అధిరోహించే ప్రయత్నాలను ప్రభావితం చేశాయని అధికారి తెలిపారు.  

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Mahesh Babu: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Mahesh Babu: మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
మహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
AP Liquor Scam Case: నాతో పెట్టుకోవద్దు... బట్టలు విప్పిస్తా !: విజయసాయిరెడ్డి మాస్ వార్నింగ్
నాతో పెట్టుకోవద్దు... బట్టలు విప్పిస్తా !: విజయసాయిరెడ్డి మాస్ వార్నింగ్
Anaganaga OTT Release Date: ఉగాదికి రావాల్సిన సినిమా... మేకు వెళ్ళింది... ETV Winలో సుమంత్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఉగాదికి రావాల్సిన సినిమా... మేకు వెళ్ళింది... ETV Winలో సుమంత్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
Maruti Brezza Mileage: బ్రెజ్జా పెట్రోల్, CNG రెండింటినీ ఫుల్‌ చేస్తే ఎంత రేంజ్‌ ఇస్తుంది, మైలేజ్‌ ఎంత?
బ్రెజ్జా పెట్రోల్, CNG రెండింటినీ ఫుల్‌ చేస్తే ఎంత రేంజ్‌ ఇస్తుంది, మైలేజ్‌ ఎంత?
Embed widget