India Toll Passes : ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు ప్రైవేటు వాహనాలకు టోల్ పాస్లు - కేంద్రం కీలక నిర్ణయం..!
India Toll Passes : జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహన యజమానులకు వార్షిక, నెలవారీ పాస్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇది టైం ఆదాతోపాటు టోల్లు వసూలు విధానాన్ని మెరుగుపరచనుందని భావిస్తున్నారు.

India Toll Passes : టోల్ బూత్ ల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే ప్రైవేటు వాహనాలకు టోల్ వసూలు చేసేందుకు నెలవారీ, వార్షిక పాస్ లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అత్యధికంగా 74శాతం టోల్ వసూళ్లు వాణిజ్యం లేదా సరుకు రవాణా వాహనాల నుంచే వస్తుండగా.. కేవలం 26 శాతం మాత్రమే ప్రైవేటు వాహనాల ద్వారా వస్తుందని చెప్పారు. టోల్ ను తగ్గించేందుకు ఎదురవుతోన్న అడ్డంకులు అనే అంశంపై జరిగిన కాన్ఫరెన్స్ లో మాట్లాడిన గడ్కరీ.. రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా గ్రామస్థుల కోసం టోల్ బూత్ లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కొత్త నిర్ణయాలతో డ్రైవర్లపై ప్రభావం
ఈ పాస్లను ప్రవేశపెట్టడం వల్ల ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రత్యామ్నాయ రహదారుల కోసం చెల్లించడం చాలా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచడంలో, టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చేసే సహాయంలో భాగంగా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. అంతేకాకుండా, ఆదాయ ఉత్పత్తిలో రాజీ పడకుండా వాటిని మరింత ఆమోదయోగ్యంగా మార్చడానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల రవాణా వ్యవస్థల ఆధునీకరణలో పెరుగుతున్న ధోరణిని వివరించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఫాస్టాగ్ (FASTag)ను అమలు చేస్తూనే అడ్డంకులు తక్కువగా ఉండే నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS toll system) బేస్డ్ టోల్ వసూలు వ్యవస్థను తీసుకురావాలని రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించిందని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం అమలవుతోన్న టోల్ విధానంతో పోలిస్తే జీఎన్ఎస్ఎస్ ఎంతో ఉత్తమమైనదన్నారు. ఇకపోతే జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థకు సంబంధించి బెంగళూరు - మైసూర్ ఎన్ హెచ్ -275తో పాటు హర్యాణాలోని పానిపట్ - హిసార్ ఎన్ హెచ్ - 709 మధ్య ప్రాథమిక అధ్యయనం చేపట్టినట్టు గతేడాది జూలైలోనే గడ్కరీ తెలిపారు.
రోడ్డుపై వెళ్లే వాళ్లకు అదిరిపోయే నజరానా
కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వారికి రివార్డును గణనీయంగా పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గతంలో గుడ్ సమారిటన్లకు కేవలం రూ.5 వేలు మాత్రమే అందించే వాళ్లమని.. ఇప్పుడు దాన్ని రూ.25 వేలకు పెంచుతున్నామన్నారు. దీని వల్ల రోడ్లపై ప్రమాదాలకు గురైన బాధితులకు ఆ మార్గాన లేదా చుట్టూ ఉన్న వారు సాయం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. ఇది కేవలం జాతీయ, రాష్ట్ర రహదారులకే కాకుండా నగరాలు, జిల్లాలు, గ్రామ పంచాయతీల రహదారులకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను వివరించిన ఆయన.. ప్రమాదం జరిగిన గంటలోపే బాధితులకు వైద్య చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలని సూచించారు.
Also Read : FIR on Balakrishna Fans: బాలకృష్ణ ఫ్యాన్స్కు బిగ్ షాక్, థియేటర్ వద్ద చేసిన అరాచకంపై కేసు నమోదు
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















