అన్వేషించండి

Srinagar G20 Meet: శ్రీనగర్‌లోని G-20 సదస్సుకి డుమ్మా కొట్టిన చైనా, భారత్ అదిరిపోయే కౌంటర్

Srinagar G20 Meet: శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 సదస్సుకి చైనా హాజరు కాకపోవడంపై భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

Srinagar G20 Meet: 

టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు..

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కీలకమైన G-20 సదస్సు జరుగుతోంది. G-20 దేశాలకు చెందిన 60 మంది ప్రతినిధులు శ్రీనగర్‌కు చేరుకుంటున్నారు. 3rd Tourism Working Group సమావేశం నిర్వహిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేసిన తరవాత ఇక్కడ అంతర్జాతీయ సదస్సు జరగడం ఇదే తొలిసారి. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. Sher-e-Kashmir International Convention Center వద్ద ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా G-20 చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ షింగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ G-20 సదస్సుకి అధ్యక్షత వహించేందుకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా 118 సమావేశాలు నిర్వహించామని స్పష్టం చేశారు. శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న టూరిజం మీటింగ్‌కి గతంలో కన్నా ఎక్కువ మంది  ప్రతినిధులు వచ్చారని చెప్పారు. సింగపూర్‌ నుంచి ఎక్కువ మంది వచ్చినట్టు తెలిపారు. వీరిలో కొందరు ప్రత్యేక అతిథులు కూడా ఉన్నారని వివరించారు. 

చైనా దూరం..

అయితే...అటు చైనా మాత్రం ఈ మీటింగ్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇక సౌదీ అరేబియా ఈ ఈవెంట్‌కి రిజిస్టర్ చేసుకోలేదు. టర్కీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. చైనా ఎందుకు వ్యతిరేకిస్తోందో...ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. "వివాదాస్పద ప్రాంతాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించినప్పుడు చైనా వాటికి హాజరుకాదు" అని తేల్చి చెప్పారు. అయితే..భారత్ మాత్రం ఇందుకు గట్టి కౌంటర్ ఇచ్చింది. తమ భూభాగంలో సమావేశాలు నిర్వహించుకునే హక్కు తమకు ఉంటుందని స్పష్టం చేసింది. చైనాతో వివాదాలు సద్దుమణిగి శాంతియుత వాతావరణం నెలకొనాలంటే..సరిహద్దు నిబంధనలకు కట్టుబడి ఉండాలని వెల్లడించింది. ఈ సదస్సుకి ఎలాంటి అంతరాయం కలగకుండా సెక్యూరిటీ టైట్ చేశారు. మెరైన్ కమాండోలతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లు కూడా పెద్ద ఎత్తున మొహరించారు. యాంటీ డ్రోన్ యూనిట్స్‌ని యాక్టివేట్ చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. ఆర్మీతో పాటు బీఎస్‌ఎప్, సీఆర్‌పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు అన్ని చోట్లా నిఘా పెడుతున్నారు. ట్రాఫిక్‌ పైనా ఆంక్షలు విధించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget