అన్వేషించండి

UAE President Demise : యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిపా బిన్ జాయెద్ కన్నుమూత, ఒక రోజు సంతాప దినం ప్రకటించిన భారత్

UAE President Demise : యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిపా బిన్ జాయెద్ మరణం పట్ల భారత్ ఒకరోజు సంతాప దినం ప్రకటించింది. శనివారం దేశంలో సంతాప దినం పాటించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

UAE President Demise : యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం కన్నుముశారు. దీంతో శనివారం సంతాప దినంగా పాటించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (MHA) ప్రకటించింది. సంతాప దినం నాడు భారత జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేసే అన్ని భవనాలపై సగం మాస్ట్‌లో ఎగరవేయాలని హోంశాఖ తెలిపింది. అలాగే అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. చమురు సంపన్న దేశానికి 2004 నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. జాయెద్ అల్ నహ్యాన్ అనారోగ్యంతో 73 సంవత్సరాల వయస్సులో మరణించారు. యూఏఈ అధ్యక్షుడి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత్-యూఏఈ సంబంధాల అభివృద్ధికి షేక్ ఖలిపా ఎంతో కృషి చేశారమన్నారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

ప్రధాని మోదీ సంతాపం 

“హెచ్‌హెచ్ షేక్ ఖలిఫా బిన్ జాయెద్ మరణించిన విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. అతను గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు, అతని ఆధ్వర్యంలో భారతదేశం-యూఏఈ సంబంధాలు అభివృద్ధి చెందాయి.UAE ప్రజలకు భారతదేశ ప్రజల హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
జాయెద్ అల్ నహ్యాన్ భారత్-యూఏఈ బంధానికి పునాది వేశారని విదేశాంగ మంత్రి (ఈఏఎం) ఎస్ జైశంకర్ అన్నారు. "యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, దేశ ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం" అని జైశంకర్ ట్వీట్ చేశారు. "యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను ఆధునీకరించిన నాయకుడిగా అతనను గుర్తుంచుకుంటారు. ఆయన భారత్-యూఏఈ సంబంధాల పరివర్తనకు పునాది వేశారు ”అని జైశంకర్ అన్నారు. 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంతాపం 

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా యూఏఈ అధ్యక్షుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. "యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణ వార్తను విని ఎంతో బాధపడ్డాను. దూరదృష్టి గల నాయకుడు, యూఏఈ అభివృద్ధికి మార్గనిర్దేశక సంస్కరణల చేసిన వ్యక్తి" అని ఆయన ట్వీట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
Embed widget