అన్వేషించండి

Ideas of India 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా తగ్గదు - దేవేంద్ర ఫడణవీస్

Ideas of India 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశమే లేదని దేవేంద్ర ఫడణవీస్ తేల్చి చెప్పారు.

Ideas of India Summit 2024: ABP Network నిర్వహిస్తున్న Ideas of India Summit లో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. 2021లో తమకు వెన్నుపోటు పొడవకపోయి ఉంటే రాష్ట్ర ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని చూసే వాళ్లని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరవాతే సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతోందని వెల్లడించారు. ప్రజాతీర్పుని కాదని కొందరు కావాలనే ప్రభుత్వాన్ని కూల్చేశారని, అదే జరగకపోయుంటే రాష్ట్ర పరిస్థితులు వేరుగా ఉండేవని అన్నారు. అన్ని రాష్ట్రాలూ కలిసి కట్టుగా పని చేయాలన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌ని ఏర్పాటు చేసేలా చొరవ చూపించారని ప్రశంసించారు దేవేంద్ర ఫడణవీస్. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే...ఏ పదవిలో ఉన్నప్పటికీ...నీతి ఆయోగ్ సమావేశాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. Maharashtra Institution for Transformation సంస్థకి కో ఛైర్మన్‌గానూ ఉన్నారు. 

"రాజకీయాల్లో కొన్నిసార్లు అనుకోని పరిణామాలు జరుగుతుంటాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంటారు. మహారాష్ట్రలోనూ ఇదే జరిగింది. 2019లో మా ప్రభుత్వం కూలకపోయుంటే రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్న ఆలోచన పెరిగింది. అదే నీతి ఆయోగ్ సంస్థ ఏర్పాటుకు కారణమైంది"

- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం

ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. గతంలో 48 లోక్‌సభ సీట్లలో బీజేపీ 44 చోట్ల విజయం సాధించిందని, ఇప్పుడూ అదే స్థాయిలో ఫలితాలు రాబడుతుందని స్పష్టం చేశారు. ఇందులో ఒక్క సీటు కూడా తగ్గదని వెల్లడించారు. 

"ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. మా ముందు సవాళ్లు ఉండొచ్చు. కానీ వాటన్నింటినీ సులువుగా అధిగమిస్తాం. గతంలో కన్నా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకముంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో 44 చోట్ల గెలిచాం. ఈ సారి అంత కన్నా ఎక్కువే సీట్లు వస్తాయన్న విశ్వాసముంది. కానీ...ఈ లెక్క మాత్రం తగ్గదు. అజిత్‌ పవార్‌తో మైత్రి అనేది కేవలం రాజకీయపరమైందే. ప్రస్తుతం ఉన్న శిందే ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోంది"

- దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం 

ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే, ఎడిటర్ ఇన్ చీఫ్ అతిదేబ్ సర్కార్, ABP Pvt Ltd సీఈవో ధ్రుబా ముఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాశ్ పాండే అతిథులందరికీ ఆహ్వానం పలికారు. అమెరికన్ బేస్‌బాల్ మూవీలోని డైలాగ్‌ని ప్రస్తావించారు. "If you make it, they will come" అంటూ అందరినీ స్వాగతించారు. ఇదే సమయంలో  Ideas of India summit ప్రాధాన్యతని వివరించారు. గతంలో జరిగిన రెండు ఎడిషన్స్‌ విజయవంతం అయ్యాయని వెల్లడించిన అవినాశ్ పాండే...అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన ఎన్నికలతో పాటు వాతావరణ మార్పుల గురించీ ప్రస్తావించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Tirumala News: తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
తిరుమల, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు ప్రారంభం.. బదిలీ చేస్తూ తొలి ఉత్తర్వులు జారీ
Telugu TV Movies Today: చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరు ‘పసివాడి ప్రాణం’, బాలయ్య ‘పైసా వసూల్’ to మహేష్ ‘టక్కరి దొంగ’, విజయ్ ‘లియో’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
IPL 2025 PBKS VS RCB Result Update:  పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఓటమి
పంజాబ్ పాంచ్ పటాకా.. టోర్నీలో ఐదో విజయం.. సత్తా చాటిన బౌలర్లు, వధేరా, సొంతగడ్డపై ఆర్సీబీకి 3వ ఓటమి
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget