అన్వేషించండి

Ideas of India 2024: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ప్రజల కోసమే - ABP సీఈవో అవినాశ్ పాండే

Ideas of India 2024: ABP నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న Ideas of India 2024 సమ్మిట్‌ని సీఈవో అవినాశ్ పాండే ప్రారంభించారు.

ABP Ideas of India 2024: ABP Network ఆధ్వర్యంలో Ideas of India థర్డ్ ఎడిషన్ సమ్మిట్ జరుగుతోంది. ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే, ఎడిటర్ ఇన్ చీఫ్ అతిదేబ్ సర్కార్, ABP Pvt Ltd సీఈవో ధ్రుబా ముఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాశ్ పాండే అతిథులందరికీ ఆహ్వానం పలికారు. అమెరికన్ బేస్‌బాల్ మూవీలోని డైలాగ్‌ని ప్రస్తావించారు. "If you make it, they will come" అంటూ అందరినీ స్వాగతించారు. ఇదే సమయంలో  Ideas of India summit ప్రాధాన్యతని వివరించారు. గతంలో జరిగిన రెండు ఎడిషన్స్‌ విజయవంతం అయ్యాయని వెల్లడించిన అవినాశ్ పాండే...అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన ఎన్నికలతో పాటు వాతావరణ మార్పుల గురించీ ప్రస్తావించారు. 

"2022లో మేము  Idea of India ఫస్ట్ ఎడిషన్‌ని ప్రారంభించాం. ఆ సమయంలో మాకు చాలా అనుమానాలున్నాయి. స్పందన ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ అది విజయం సాధించింది. ఆ తరవాత మరో ఎడిషన్‌ని నిర్వహించేందుకు మాకు ఉత్సాహాన్నిచ్చింది. మరీ పెద్ద కలలు కంటున్నారేమో అంటూ మా గురించి కొందరు మాట్లాడారు. అలాంటి పెద్ద కలలు కనకపోతే అది జీవితం ఎలా అవుతుంది..? గతంలో నిర్వహించిన రెండు ఎడిషన్స్‌ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు మూడో ఎడిషన్‌తో మీ అందరి ముందుకు వచ్చాం"

- అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈవో

వాతావరణ మార్పుల గురించీ మాట్లాడారు ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలూ నమోదవుతాయని అన్నారు. అడవులు తగలబడిపోవడం, గ్లేషియర్స్‌ కరిగిపోవడం లాంటి విపత్తులు చూడాల్సి వస్తుందని వెల్లడించారు. ఎన్నికల సరళి గురించీ ప్రస్తావించారు. 

"ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందా అన్నది వేచి చూడాలి. కానీ...ప్రజలు మాత్రం తమ అభిప్రాయాల్ని తేల్చి చెప్పేందుకు ఎన్నికలే వేదికగా మారుతున్నాయి. ఇక ఈ సారి వాతావరణ మార్పుల గురించీ మాట్లాడుకోవాలి. ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అడవులు తగలబడిపోతాయి. గ్లేషియర్స్‌ వేడికి కరిగిపోతాయి. గాలి, నీరు, భూమిలోని కాలుష్యం మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. Ideas Of India 3.0 సమ్మిట్ ప్రజల ఎజెండాగా నిర్వహిస్తున్నాం"

- అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈవో

Ideas of India Summit 2024 లో ABP Network చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ కీలక విషయాలు ప్రస్తావించారు. పీపుల్స్ ఎజెండాయే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. రెండ్రోజుల ఈ సదస్సుని ప్రారంభించిన ఆయన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి ప్రస్తావించారు. ఈ ఆలయం నిర్మాణం తరవాతే భారత్‌ని హిందుత్వ దేశంగా గుర్తించాలన్న ఆకాంక్ష అందరిలోనూ పెరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా RSS చీఫ్ మోహన్ భగవత్ హిందుత్వం గురించి నిర్వచనాన్ని ప్రస్తావించారు అతిదేబ్ సర్కార్. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు త్యాగాలూ హిందుత్వానికి పునాదులు అని వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rana Final Video: దేశంలో తొలి కారుణ్య మరణం.. అందర్నీ కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
దేశంలో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget