అన్వేషించండి

Ideas of India 2024: ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ప్రజల కోసమే - ABP సీఈవో అవినాశ్ పాండే

Ideas of India 2024: ABP నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరుగుతున్న Ideas of India 2024 సమ్మిట్‌ని సీఈవో అవినాశ్ పాండే ప్రారంభించారు.

ABP Ideas of India 2024: ABP Network ఆధ్వర్యంలో Ideas of India థర్డ్ ఎడిషన్ సమ్మిట్ జరుగుతోంది. ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే, ఎడిటర్ ఇన్ చీఫ్ అతిదేబ్ సర్కార్, ABP Pvt Ltd సీఈవో ధ్రుబా ముఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాశ్ పాండే అతిథులందరికీ ఆహ్వానం పలికారు. అమెరికన్ బేస్‌బాల్ మూవీలోని డైలాగ్‌ని ప్రస్తావించారు. "If you make it, they will come" అంటూ అందరినీ స్వాగతించారు. ఇదే సమయంలో  Ideas of India summit ప్రాధాన్యతని వివరించారు. గతంలో జరిగిన రెండు ఎడిషన్స్‌ విజయవంతం అయ్యాయని వెల్లడించిన అవినాశ్ పాండే...అందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఆయన ఎన్నికలతో పాటు వాతావరణ మార్పుల గురించీ ప్రస్తావించారు. 

"2022లో మేము  Idea of India ఫస్ట్ ఎడిషన్‌ని ప్రారంభించాం. ఆ సమయంలో మాకు చాలా అనుమానాలున్నాయి. స్పందన ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ అది విజయం సాధించింది. ఆ తరవాత మరో ఎడిషన్‌ని నిర్వహించేందుకు మాకు ఉత్సాహాన్నిచ్చింది. మరీ పెద్ద కలలు కంటున్నారేమో అంటూ మా గురించి కొందరు మాట్లాడారు. అలాంటి పెద్ద కలలు కనకపోతే అది జీవితం ఎలా అవుతుంది..? గతంలో నిర్వహించిన రెండు ఎడిషన్స్‌ మంచి విజయం సాధించాయి. ఇప్పుడు మూడో ఎడిషన్‌తో మీ అందరి ముందుకు వచ్చాం"

- అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈవో

వాతావరణ మార్పుల గురించీ మాట్లాడారు ABP నెట్‌వర్క్ సీఈవో అవినాశ్ పాండే. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలూ నమోదవుతాయని అన్నారు. అడవులు తగలబడిపోవడం, గ్లేషియర్స్‌ కరిగిపోవడం లాంటి విపత్తులు చూడాల్సి వస్తుందని వెల్లడించారు. ఎన్నికల సరళి గురించీ ప్రస్తావించారు. 

"ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందా అన్నది వేచి చూడాలి. కానీ...ప్రజలు మాత్రం తమ అభిప్రాయాల్ని తేల్చి చెప్పేందుకు ఎన్నికలే వేదికగా మారుతున్నాయి. ఇక ఈ సారి వాతావరణ మార్పుల గురించీ మాట్లాడుకోవాలి. ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అడవులు తగలబడిపోతాయి. గ్లేషియర్స్‌ వేడికి కరిగిపోతాయి. గాలి, నీరు, భూమిలోని కాలుష్యం మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. Ideas Of India 3.0 సమ్మిట్ ప్రజల ఎజెండాగా నిర్వహిస్తున్నాం"

- అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈవో

Ideas of India Summit 2024 లో ABP Network చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ కీలక విషయాలు ప్రస్తావించారు. పీపుల్స్ ఎజెండాయే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. రెండ్రోజుల ఈ సదస్సుని ప్రారంభించిన ఆయన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి ప్రస్తావించారు. ఈ ఆలయం నిర్మాణం తరవాతే భారత్‌ని హిందుత్వ దేశంగా గుర్తించాలన్న ఆకాంక్ష అందరిలోనూ పెరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా RSS చీఫ్ మోహన్ భగవత్ హిందుత్వం గురించి నిర్వచనాన్ని ప్రస్తావించారు అతిదేబ్ సర్కార్. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు త్యాగాలూ హిందుత్వానికి పునాదులు అని వెల్లడించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
Advertisement

వీడియోలు

1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
ఒరే ఆజామూ..  1000 రోజులైందిరా!
బీసీసీఐ వార్నింగ్‌కి బెదరని నఖ్వి.. ట్రోఫీ నేనే ఇస్తానంటూ మొండి పట్టు
బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలుపుతో ఇండియాకి లైన్ క్లియర్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Nakkapalli Bulk Drug Park: నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
నక్కపల్లి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ చుట్టూ రాజకీయం ! ప్రజల బలహీనతతో ఆడుకుంటున్న పార్టీలు! 
8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
ఎనిమిదో వేతన సంఘంపై శుభవార్త! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెద్ద అప్‌డేట్ వచ్చింది!
Telangana:  తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేత - అవినీతి ఆరోపణలే కారణం
Tuni Crime News: బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నం..! తోటలోకి తీసుకెళ్లి వెకిలి చేష్టలు.. పోక్సో కేసు
Amazon: ఐ ఫోన్‌ ఆర్డరిస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ - అమెజాన్‌ను కోర్టుకు లాగిన కర్నూలు వాసి !
ఐ ఫోన్‌ ఆర్డరిస్తే ఐక్యూ ఫోన్ డెలివరీ - అమెజాన్‌ను కోర్టుకు లాగిన కర్నూలు వాసి !
Mass Jathara First Review: 'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
'మాస్ జాతర' ఫస్ట్ రివ్యూ... ఆ గంటసేపూ ఊగిపోతాయ్ - రవితేజ అభిమానులకు కిక్ ఇచ్చేలా!
Embed widget