అన్వేషించండి

PoK Clashes: స్వతంత్ర హోదా కోసం PoK పౌరుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

PoK Clashes: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పౌరులు తమకు స్వేచ్ఛ కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

Clashes in PoK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పౌరులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ గొడవల్లో ఓ పోలీస్‌ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్రవ్యోల్బణం, అత్యధికంగా పన్ను వసూళ్లు చేయడం, విద్యుత్ కొరత లాంటి సమస్యలపై స్థానికులు పోరాడుతున్నారు. తమ హక్కుల్ని అణిచివేస్తున్నారంటూ ప్రజలు తిరగబడుతున్నారు. ఆజాదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. ముజఫర్‌బాద్‌లో పోలీసులు, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతత్వంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆ కమిటీలోని నేతలు రోడ్లపైకి వచ్చి అల్లర్లకు దిగడం వల్ల పోలీసులు వాళ్లని అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పూర్తిస్థాయిలో బంద్ కొనసాగుతోంది. 

స్వతంత్ర హోాదా డిమాండ్..

పోలీసులకు వ్యతిరేకంగా కొందరు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అనవసరంగా పోలీసులు వచ్చి ఘర్షణకు దిగారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మా హక్కుల కోసమే పోరాడుతున్నామని తేల్చి చెబుతున్నారు. అయితే..కొంత మంది పాకిస్థాన్‌ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ నినదిస్తున్నారు. PoKకి స్వతంత్ర హోదా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజానికి గతేడాది ఆగస్టులోనూ PoKలో ఇదే తరహా ఆందోళనలు జరిగాయి. 

"కరెంట్ బిల్స్‌పైనా భారీ మొత్తంలో పన్నులు వేస్తున్నారు. దీనినే మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. హైడల్ పవర్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌నే మాకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ధరలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాకు పాకిస్థాన్ నుంచి స్వతంత్ర హోదా కావాలి"

- ఆందోళనకారులు

ఇక్కడ భారత్‌లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇది కచ్చితంగా భారత్‌దేనని తేల్చి చెబుతున్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. PoK ఎప్పటికీ భారత్‌లో భాగమే అని వెల్లడించారు. 

"పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమే. అందుకు సంబంధించిన తీర్మానాలు భారత్ వద్ద ఉన్నాయి. ఆ ప్రాంతంపైన వేరే వాళ్ల ఆధిపత్యం ఏంటి..? ఇంట్లో పెద్ద వ్యక్తి సరైన విధంగా లేకపోతే ఎవరు పడితే వాళ్లు వచ్చి దొంగతనం చేస్తారు. ఆక్రమించేసుకుంటారు. గత పాలకులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి ప్రజలు మర్చిపోయేలా చేశారు. ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన వస్తోంది"

- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

Also Read: మా ఉనికి ప్రమాదంలో పడితే అణు బాంబులు తయారీ తప్పదు - ఇజ్రాయేల్‌కి ఇరాన్‌ వార్నింగ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget