అన్వేషించండి

PoK Clashes: స్వతంత్ర హోదా కోసం PoK పౌరుల ఆందోళనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

PoK Clashes: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పౌరులు తమకు స్వేచ్ఛ కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

Clashes in PoK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పౌరులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ గొడవల్లో ఓ పోలీస్‌ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 90 మంది తీవ్రంగా గాయపడ్డారు. ద్రవ్యోల్బణం, అత్యధికంగా పన్ను వసూళ్లు చేయడం, విద్యుత్ కొరత లాంటి సమస్యలపై స్థానికులు పోరాడుతున్నారు. తమ హక్కుల్ని అణిచివేస్తున్నారంటూ ప్రజలు తిరగబడుతున్నారు. ఆజాదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. ముజఫర్‌బాద్‌లో పోలీసులు, భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతత్వంలో ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆ కమిటీలోని నేతలు రోడ్లపైకి వచ్చి అల్లర్లకు దిగడం వల్ల పోలీసులు వాళ్లని అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పూర్తిస్థాయిలో బంద్ కొనసాగుతోంది. 

స్వతంత్ర హోాదా డిమాండ్..

పోలీసులకు వ్యతిరేకంగా కొందరు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అనవసరంగా పోలీసులు వచ్చి ఘర్షణకు దిగారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. మా హక్కుల కోసమే పోరాడుతున్నామని తేల్చి చెబుతున్నారు. అయితే..కొంత మంది పాకిస్థాన్‌ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ నినదిస్తున్నారు. PoKకి స్వతంత్ర హోదా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజానికి గతేడాది ఆగస్టులోనూ PoKలో ఇదే తరహా ఆందోళనలు జరిగాయి. 

"కరెంట్ బిల్స్‌పైనా భారీ మొత్తంలో పన్నులు వేస్తున్నారు. దీనినే మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. హైడల్ పవర్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌నే మాకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ధరలూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మాకు పాకిస్థాన్ నుంచి స్వతంత్ర హోదా కావాలి"

- ఆందోళనకారులు

ఇక్కడ భారత్‌లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇది కచ్చితంగా భారత్‌దేనని తేల్చి చెబుతున్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. PoK ఎప్పటికీ భారత్‌లో భాగమే అని వెల్లడించారు. 

"పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమే. అందుకు సంబంధించిన తీర్మానాలు భారత్ వద్ద ఉన్నాయి. ఆ ప్రాంతంపైన వేరే వాళ్ల ఆధిపత్యం ఏంటి..? ఇంట్లో పెద్ద వ్యక్తి సరైన విధంగా లేకపోతే ఎవరు పడితే వాళ్లు వచ్చి దొంగతనం చేస్తారు. ఆక్రమించేసుకుంటారు. గత పాలకులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ గురించి ప్రజలు మర్చిపోయేలా చేశారు. ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన వస్తోంది"

- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

Also Read: మా ఉనికి ప్రమాదంలో పడితే అణు బాంబులు తయారీ తప్పదు - ఇజ్రాయేల్‌కి ఇరాన్‌ వార్నింగ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump: ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
ఆ 7 దేశాల ప్రజలకు అమెరికాలో నో ఎంట్రీ - వీసాలపై బ్యాన్ - లిస్టులో ఇండియా ఉందా?
India Exports to America: భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
భారీ సుంకాలు వేసినా అమెరికాకు భారత ఎగుమతులు పెరిగాయా - ఇదిగో పూర్తి నిజం
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !
Embed widget