అన్వేషించండి

Indian Muslims Wealth: భారత్‌లోని ముస్లింల ఆస్తుల విలువ ఎంత? వాళ్ల వద్ద ఎంత బంగారముంది?

Indian Muslims: భారత్‌లోని ముస్లింల వద్ద ఎంత ఆస్తి, బంగారం ఉందో 2020లో ఓ సంస్థ అధ్యయనం చేసి రిపోర్ట్ వెలువరించింది.

Indian Muslims Wealth Details: ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలోని ధనాన్నంతా కాంగ్రెస్ దోచుకుంటుందని, ఆ సంపదనంతా ముస్లింల చేతుల్లో పెట్టేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రధాని. కాంగ్రెస్ ఈ కామెంట్స్‌ని తీవ్రంగా ఖండిస్తోంది. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే మోదీపై మండి పడ్డారు. స్నేహితులకు దేశ సంపదనంతా దోచి పెట్టే ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారు. పరోక్షంగా అంబానీ, అదానీల గురించి ప్రస్తావించారు.

ఈ క్రమంలోనే అసలు దేశంలోని ముస్లింల ఆస్తుల (Wealth of Indian Muslims) లెక్కలెంత అన్న చర్చ జరుగుతోంది. 2020లో Indian Institute of Dalit Studies ఓ రిపోర్ట్ వెలువరించింది. ఈ నివేదికల్లోని లెక్కల ప్రకారం...భారతదేశ సంపదలో 41% మేర హిందువులదే వాటా అని తేలింది. ఇందులో కులాల వారీగా చూస్తే...హిందూ ఓబీసీల ఆస్తుల విలువ 31%గా ఉంది. అంటే ఎక్కువ మొత్తం వాళ్లదే. ఆ తరవాత ముస్లింలకు 8% ఆస్తులు, ఎస్సీలకు 7.3%, STలకు 3.7% మేర ఆస్తులు ఉన్నట్టు ఈ నివేదిక (Indian Muslims Wealth) వెల్లడించింది.

బంగారం ఎంతుంది..? 

ఇక కుటుంబాల వారీగా చూస్తే హిందువుల్లోని అగ్రవర్ణాల్లో తలసరి ఆస్తుల విలువ రూ.27.73 లక్షలుగా ఉంది. హిందూ ఓబీసీల్లో ఈ ఆస్తుల విలువ రూ.12.96 లక్షలుగా ఉన్నట్టు వెల్లడైంది. ముస్లిం కుటుంబాల్లో ఈ తలసరి ఆస్తుల విలువ రూ.9.95 లక్షలుగా ఉన్నట్టు తేలింది. అయితే..ఈ విషయంలో SC,STలో పోల్చుకుంటే ముస్లింలు కాస్తంత మెరుగ్గా ఉన్నట్టు రిపోర్ట్ తెలిపింది. మొత్తం ఆస్తుల విలువ చూస్తే దేశంలోని హిందువులకు (Wealth of Hindus in India) రూ.1,46,394 కోట్ల వరకూ ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

ముస్లింల ఆస్తుల విలువ రూ.28,707 కోట్లుగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిందువుల జనాభా 79.80%గా ఉండగా ముస్లింల జనాభా 14.23%గా ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ఇక అసలు ఈ మొత్తం వివాదానికి కారణమైన బంగారం విషయానికి వస్తే...హిందువుల్లోని OBCల వద్ద దేశంలోని బంగారం మొత్తంలో 39.1% మేర ఉంది. హిందువుల్లోని అగ్రవర్ణాల వద్ద 31.3% బంగారం ఉంది. ఇక ముస్లింల దగ్గర 9.2% మేర బంగారం ఉన్నట్టు వెల్లడించింది. అదే STల వద్ద ఇది కేవలం 3.4%గా ఉంది.

ప్రధాని మోదీ ఏమన్నారు..?

ప్రతిపక్ష కూటమిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోదీ. ఆ పార్టీ దేశంలోని అందరి మహిళల మంగళసూత్రాలతో సహా బంగారమంతా దోచుకుని ఆ సంపదను ముస్లింలకు పంచి పెడుతుందని ఆరోపించారు. రాజస్థాన్‌లో ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. అంతే కాదు. ఓ వ్యక్తి చనిపోయిన తరవాత కూడా కాంగ్రెస్ దోచుకుంటుందని LIC లో జరిగిన అవతకవతల్ని ప్రస్తావిస్తూ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూస్తుంటే మోదీ కాంగ్రెస్‌పై డైరెక్ట్ అటాక్‌ మొదలు పెట్టారని అర్థమవుతోంది. 

Also Read: Tesla Layoffs: టెస్లా ఉద్యోగులకు లేఆఫ్‌ల టెన్షన్, వేలాది మంది తొలగింపు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget